Movie News

క్లైమాక్స్ కోసం ఇంత కసరత్తు జరిగిందా

నిన్న విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మొదటి రోజు అయిదు కోట్లకు పైగా గ్రాస్ సాధించిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ సక్సెస్ మీట్ నిర్వహించి తన ఆనందాన్ని టీమ్ తో పాటు పంచుకున్నాడు. ఓపెనింగ్స్ పరంగా పెట్టుకున్న భారీ అంచనాలకు తగ్గట్టు థియేటర్ల దగ్గర అంత సందోహం లేదు కానీ గత నెల రోజులగా ఉన్న డ్రై పీరియడ్ తో పోలిస్తే జనాన్ని రప్పించడంలో అర్జున్ ఓ మోస్తరు విజయం సాధించినట్టే. కాకపోతే ఈ వీకెండ్ అనూహ్యంగా పికప్ కావడం మీద బాక్సాఫీస్ నెంబర్లు ఆధారపడి ఉంటాయి. అపోజిషన్ కొచ్చిన మిక్స్డ్ టాక్ ని ఏ మేరకు ఉపయోగించుకుంటారనేది కీలకం.

రిలీజ్ ముందు నుంచి ఇప్పటిదాకా కళ్యాణ్ రామ్ తో పాటు టీమ్ అందరూ క్లైమాక్స్ గురించి చాలా గొప్పగా చెబుతూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే హైలైట్ అవుతుందని, ఎమోషనల్ కాకుండా ఉండలేరని ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు. నిజంగానే అది షాక్ ఇచ్చేలాగే వచ్చింది. సాధారణంగా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు చేయని రిస్క్ ని కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నాడు. కథ నమ్మి బ్లైండ్ గా వెళ్ళిపోయాడు. అది ఇది ఆషామాషీగా జరగలేదు. చివరి ఘట్టం ఎలా ఉండాలనే దాని మీద చాలా వెర్షన్లు డిస్కషన్ లోకి వచ్చాయట. ఇంత ఎమోషనల్ కంటెంట్ ఫ్లాట్ గా ముగించడం ఇష్టం లేదు కాబట్టి పవర్ ఫుల్ బ్లాక్ కోసం ఎదురుచూశారు  

చివరికి ఇప్పుడు చూస్తున్న క్లైమాక్స్ అందరి అంచనాలకు తగ్గట్టు ఉందని, విజయశాంతి లాంటి ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఇలా ముగిస్తేనే న్యాయం జరుగుతుందని భావించి ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదంతా కళ్యాణ్ రామే పంచుకున్నాడు. రచయిత శ్రీకాంత్ కు థాంక్స్ కూడా చెప్పాడు. విజయశాంతి మాట్లాడుతూ ఇంత రిస్క్ అనిపించే క్లైమాక్స్ ని అతను తప్ప ఎవరూ ఒప్పుకోరని అంత గొప్పగా వచ్చిందని పొగడ్తలతో ముంచెత్తారు. మంగళ బుధవారాల్లోపు బ్రేక్ ఈవెన్ అవుతుందని కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు. ఈ మేరకు బయ్యర్ల నుంచి కాల్స్ వచ్చాయి, వాళ్లంతా చాలా సంతోషంగా ఉన్నారని వివరించాడు. 

Kumar

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

28 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

1 hour ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

1 hour ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago