సినిమా హీరోలను అభిమానులు ఏ స్థాయిలో ఆరాధిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు సినిమా హీరోల డూప్లను చూసి కూడా ఊగిపోయే రోజులు వచ్చేశాయి. గత కొన్నేళ్లలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఊపేసిన సినిమా అంటే ‘పుష్ప’నే. అందులో ప్రధాన పాత్రకు ఉత్తరాది జనం కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. పుష్ప గెటప్, మేనరిజమ్స్, డైలాగ్స్ వాళ్లను ఒక ఊపు ఊపేశాయి. దీంతో అల్లు అర్జున్తో కొంచెం పోలికలు ఉన్న ఒక వ్యక్తి.. పుష్ప గెటప్ వేసుకుని అక్కడి జనాలను ఆకర్షించడం మొదలుపెట్టాడు.
ఐతే ఇలా సినిమా హీరోలు, క్రికెటర్లతో పోలికలు ఉన్న వ్యక్తులు వారి గెటప్స్ వేసుకుని ఎప్పుడో ఒకసారి సందడి చేయడం వరకు ఓకే. కానీ ఇలాంటి వ్యక్తులకు ఆ సెలబ్రెటీల స్థాయిలో ఆదరణ రావడం, వారిని చూస్తే జనం ఊగిపోవడమే విడ్డూరం. పుష్ప గెటప్తో పాపులరైన వ్యక్తి కొంత కాలంగా అనేక కార్యక్రమాలకు అతిథిగా హాజరవుతున్నాడు. రాజకీయ నాయకుల సభలకు అతిథిగా వెళ్తున్నాడు. అతను వస్తే జనం సినిమా హీరోను చూసినట్లే ఊగిపోతున్నారు.
తన ర్యాలీలు, సభలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూసి జనం షాకవుతున్నారు. ఒక సినిమా క్యారెక్టర్ను అనుకరిస్తే జనం ఇంత వేలం వెర్రిగా ఎగబడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకా పెద్ద విశేషం ఏంటంటే.. సదరు వ్యక్తి కొన్ని ప్రకటనల్లోనూ నటిస్తున్నాడు. కొన్ని బ్రాండ్స్ అతణ్ని ప్రచారకర్తగా మార్చుకున్నాయి. ఒక సంస్థ అతడితో ఒక యాడ్ కూడా షూట్ చేసింది. ఈ వ్యక్తి షాపింగ్ మాల్స్ ఆరంభోత్సవాలకు, టీవీ షోలకు సైతం అతిథిగా హాజరవుతుండడం విశేషం. తన డూప్ను అల్లు అర్జున్ సైతం బీహార్లో ప్రి రిలీజ్ ఈవెంట్కు వెళ్లినపుడు కలిశాడు. దీంతో తన క్రేజ్ ఇంకా పెరిగిపోయింది.
This post was last modified on April 19, 2025 3:21 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…