సినిమా హీరోలను అభిమానులు ఏ స్థాయిలో ఆరాధిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు సినిమా హీరోల డూప్లను చూసి కూడా ఊగిపోయే రోజులు వచ్చేశాయి. గత కొన్నేళ్లలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఊపేసిన సినిమా అంటే ‘పుష్ప’నే. అందులో ప్రధాన పాత్రకు ఉత్తరాది జనం కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. పుష్ప గెటప్, మేనరిజమ్స్, డైలాగ్స్ వాళ్లను ఒక ఊపు ఊపేశాయి. దీంతో అల్లు అర్జున్తో కొంచెం పోలికలు ఉన్న ఒక వ్యక్తి.. పుష్ప గెటప్ వేసుకుని అక్కడి జనాలను ఆకర్షించడం మొదలుపెట్టాడు.
ఐతే ఇలా సినిమా హీరోలు, క్రికెటర్లతో పోలికలు ఉన్న వ్యక్తులు వారి గెటప్స్ వేసుకుని ఎప్పుడో ఒకసారి సందడి చేయడం వరకు ఓకే. కానీ ఇలాంటి వ్యక్తులకు ఆ సెలబ్రెటీల స్థాయిలో ఆదరణ రావడం, వారిని చూస్తే జనం ఊగిపోవడమే విడ్డూరం. పుష్ప గెటప్తో పాపులరైన వ్యక్తి కొంత కాలంగా అనేక కార్యక్రమాలకు అతిథిగా హాజరవుతున్నాడు. రాజకీయ నాయకుల సభలకు అతిథిగా వెళ్తున్నాడు. అతను వస్తే జనం సినిమా హీరోను చూసినట్లే ఊగిపోతున్నారు.
తన ర్యాలీలు, సభలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూసి జనం షాకవుతున్నారు. ఒక సినిమా క్యారెక్టర్ను అనుకరిస్తే జనం ఇంత వేలం వెర్రిగా ఎగబడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకా పెద్ద విశేషం ఏంటంటే.. సదరు వ్యక్తి కొన్ని ప్రకటనల్లోనూ నటిస్తున్నాడు. కొన్ని బ్రాండ్స్ అతణ్ని ప్రచారకర్తగా మార్చుకున్నాయి. ఒక సంస్థ అతడితో ఒక యాడ్ కూడా షూట్ చేసింది. ఈ వ్యక్తి షాపింగ్ మాల్స్ ఆరంభోత్సవాలకు, టీవీ షోలకు సైతం అతిథిగా హాజరవుతుండడం విశేషం. తన డూప్ను అల్లు అర్జున్ సైతం బీహార్లో ప్రి రిలీజ్ ఈవెంట్కు వెళ్లినపుడు కలిశాడు. దీంతో తన క్రేజ్ ఇంకా పెరిగిపోయింది.
This post was last modified on April 19, 2025 3:21 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…