మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’లో వేర్ ఈజ్ ద పార్టీతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ చిత్రం ‘డాకు మహారాజ్’లోనూ ఆమెకు అవకాశం దక్కింది. అందులో ‘దబిడి దిబిడి’ అంటూ సాగే పాటలో ఆమె వేసిన స్టెప్పులు చర్చనీయాంశం అయ్యాయి. ఇందులో ఒక పాత్ర కూడా చేసిందామె.
తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటున్న ఊర్వశి..తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనకు ఉత్తరాదిన అభిమానులు గుడి కట్టి పూజలు చేస్తున్నారని.. అలాగే దక్షిణాది వారు కూడా చేయాలని కోరుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించడం విశేషం.
బద్రీనాథ్లో తనకు అభిమానులు గుడి కట్టినట్లు చెప్పి ఊర్వశి పెద్ద షాకే ఇచ్చింది. ఆ గుడి పేరు కూడా ‘ఊర్వశి మందిర్’ అని వెల్లడించింది. ఇంటర్వ్యూయర్ ఇది నిజమా.. గుడి ఎక్కడ ఉంది అని అడిగితే ఆమె తడుముకోకుండా సమాధానం చెప్పింది. బద్రీనాథ్ ప్రధాన ఆలయం నుంచి కిలోమీటర్ దూరంలో ఈ ‘ఊర్వశి మందిర్’ ఉందని.. అక్కడ తన విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారని చెప్పింది.
తాను తెలుగులో ఏడాదిన్నర వ్యవధిలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ సినిమాల్లో నటించానని.. ఇక్కడ కూడా తనకు భారీగా ఫ్యాన్స్ పెరిగారని ఆమె తెలిపింది. ఉత్తరాదిలో మాదిరే ఇక్కడి ఫ్యాన్స్ కూడా తనకు టెంపుల్స్ కట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. మీ పేరున ఉన్న గుడిలో మీ విగ్రహం పెట్టి, పూజలు చేస్తున్నారా అని అడిగితే.. అంతే కదా, అదే కదా చేస్తారు అని ఆమె స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా వివాదాల్లో భాగమైన ఊర్వశి.. తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాకు టార్గెట్ అవుతోంది.
This post was last modified on April 19, 2025 2:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…