మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’లో వేర్ ఈజ్ ద పార్టీతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ చిత్రం ‘డాకు మహారాజ్’లోనూ ఆమెకు అవకాశం దక్కింది. అందులో ‘దబిడి దిబిడి’ అంటూ సాగే పాటలో ఆమె వేసిన స్టెప్పులు చర్చనీయాంశం అయ్యాయి. ఇందులో ఒక పాత్ర కూడా చేసిందామె.
తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటున్న ఊర్వశి..తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనకు ఉత్తరాదిన అభిమానులు గుడి కట్టి పూజలు చేస్తున్నారని.. అలాగే దక్షిణాది వారు కూడా చేయాలని కోరుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించడం విశేషం.
బద్రీనాథ్లో తనకు అభిమానులు గుడి కట్టినట్లు చెప్పి ఊర్వశి పెద్ద షాకే ఇచ్చింది. ఆ గుడి పేరు కూడా ‘ఊర్వశి మందిర్’ అని వెల్లడించింది. ఇంటర్వ్యూయర్ ఇది నిజమా.. గుడి ఎక్కడ ఉంది అని అడిగితే ఆమె తడుముకోకుండా సమాధానం చెప్పింది. బద్రీనాథ్ ప్రధాన ఆలయం నుంచి కిలోమీటర్ దూరంలో ఈ ‘ఊర్వశి మందిర్’ ఉందని.. అక్కడ తన విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారని చెప్పింది.
తాను తెలుగులో ఏడాదిన్నర వ్యవధిలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ సినిమాల్లో నటించానని.. ఇక్కడ కూడా తనకు భారీగా ఫ్యాన్స్ పెరిగారని ఆమె తెలిపింది. ఉత్తరాదిలో మాదిరే ఇక్కడి ఫ్యాన్స్ కూడా తనకు టెంపుల్స్ కట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. మీ పేరున ఉన్న గుడిలో మీ విగ్రహం పెట్టి, పూజలు చేస్తున్నారా అని అడిగితే.. అంతే కదా, అదే కదా చేస్తారు అని ఆమె స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా వివాదాల్లో భాగమైన ఊర్వశి.. తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాకు టార్గెట్ అవుతోంది.
This post was last modified on April 19, 2025 2:05 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…