Ranbir Kapoor, Rishi Kapoor
ఏ తల్లిదండ్రులకైనా తమ సంతానం పెళ్లి చేసుకుని.. వారికి పిల్లలు పుడితే వాళ్లతో ఆడుకుని ఆ తర్వాత తనువు చాలించాలని అనుకుంటారు. అందుకు సెలబ్రెటీలు కూడా మినహాయింపు కాదు. బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషి కపూర్ కూడా అదే ఆశించాడు. పిల్లల సంగతేమో కానీ.. తన కొడుకు రణబీర్ కపూర్ పెళ్లి చూడాలనుకున్నారు.
ఐతే ఇంతకుముందు కత్రినా కైఫ్తో డీప్ లవ్లో ఉన్న అతను వ్యవహారాన్ని పెళ్లిదాకా తీసుకెళ్లి మధ్యలో డ్రాప్ అయిపోయాడు. కత్రినాను రణబీర్ పెళ్లి చేసుకోవడం పట్ల రిషికి పెద్దగా అభ్యంతరాలు లేవని.. కానీ ఆయన భార్య మాత్రం అభ్యంతర పెట్టిందని అప్పట్లో వార్తలొచ్చాయి. గర్ల్ ఫ్రెండ్స్ను మార్చడం అలవాటైన రణబీర్.. తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత మహేష్ భట్ తనయురాలు ఆలియా భట్ ప్రేమలో పడ్డాడు. ముందు ఆలియానే అతణ్ని ఇష్టపడింది. తర్వాత రణబీర్ కూడా ఓకే అన్నాడు.
వీరి పెళ్లి గురించి రెండేళ్ల కిందట్నుంచే చర్చ జరుగుతోంది. వీరి పెళ్లి జరిపించాలని రిషి గట్టిగా కోరుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతాయి. కానీ ఇంతలోనే ఆయన ఎవ్వరూ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడ్డారు. అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ఆయన కోలుకున్నారనే అంతా అనుకున్నారు. తిరిగొచ్చాక ఆయన కొన్ని టీవీ షోల్లో పాల్గొన్నారు. మీడియతో కూడా మాట్లాడారు. కొంత నీరసంగా కనిపించినప్పటికీ రిషి సాధారణ స్థితికి వస్తాడనే అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా ఉన్నట్లుండి ఈ రోజు ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.
రిషి కోలుకున్నాక పెళ్లి చేసుకుందామని రణబీర్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఆయనుండగా పెళ్లి కొడుకు కాలేదు. దీంతో కొడుకు పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండానే రిషి వెళ్లిపోయాడు. నిన్నటి ఇర్ఫాన్ మరణాన్నే తట్టుకోలేకపోతుంటే రిషి సైతం ఇలా కాలం చేయడం సినీ అభిమానులకు కోలుకోలేని షాక్.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…