Ranbir Kapoor, Rishi Kapoor
ఏ తల్లిదండ్రులకైనా తమ సంతానం పెళ్లి చేసుకుని.. వారికి పిల్లలు పుడితే వాళ్లతో ఆడుకుని ఆ తర్వాత తనువు చాలించాలని అనుకుంటారు. అందుకు సెలబ్రెటీలు కూడా మినహాయింపు కాదు. బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషి కపూర్ కూడా అదే ఆశించాడు. పిల్లల సంగతేమో కానీ.. తన కొడుకు రణబీర్ కపూర్ పెళ్లి చూడాలనుకున్నారు.
ఐతే ఇంతకుముందు కత్రినా కైఫ్తో డీప్ లవ్లో ఉన్న అతను వ్యవహారాన్ని పెళ్లిదాకా తీసుకెళ్లి మధ్యలో డ్రాప్ అయిపోయాడు. కత్రినాను రణబీర్ పెళ్లి చేసుకోవడం పట్ల రిషికి పెద్దగా అభ్యంతరాలు లేవని.. కానీ ఆయన భార్య మాత్రం అభ్యంతర పెట్టిందని అప్పట్లో వార్తలొచ్చాయి. గర్ల్ ఫ్రెండ్స్ను మార్చడం అలవాటైన రణబీర్.. తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత మహేష్ భట్ తనయురాలు ఆలియా భట్ ప్రేమలో పడ్డాడు. ముందు ఆలియానే అతణ్ని ఇష్టపడింది. తర్వాత రణబీర్ కూడా ఓకే అన్నాడు.
వీరి పెళ్లి గురించి రెండేళ్ల కిందట్నుంచే చర్చ జరుగుతోంది. వీరి పెళ్లి జరిపించాలని రిషి గట్టిగా కోరుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతాయి. కానీ ఇంతలోనే ఆయన ఎవ్వరూ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడ్డారు. అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ఆయన కోలుకున్నారనే అంతా అనుకున్నారు. తిరిగొచ్చాక ఆయన కొన్ని టీవీ షోల్లో పాల్గొన్నారు. మీడియతో కూడా మాట్లాడారు. కొంత నీరసంగా కనిపించినప్పటికీ రిషి సాధారణ స్థితికి వస్తాడనే అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా ఉన్నట్లుండి ఈ రోజు ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.
రిషి కోలుకున్నాక పెళ్లి చేసుకుందామని రణబీర్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఆయనుండగా పెళ్లి కొడుకు కాలేదు. దీంతో కొడుకు పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండానే రిషి వెళ్లిపోయాడు. నిన్నటి ఇర్ఫాన్ మరణాన్నే తట్టుకోలేకపోతుంటే రిషి సైతం ఇలా కాలం చేయడం సినీ అభిమానులకు కోలుకోలేని షాక్.
This post was last modified on April 30, 2020 3:48 pm
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…
సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…