Ranbir Kapoor, Rishi Kapoor
ఏ తల్లిదండ్రులకైనా తమ సంతానం పెళ్లి చేసుకుని.. వారికి పిల్లలు పుడితే వాళ్లతో ఆడుకుని ఆ తర్వాత తనువు చాలించాలని అనుకుంటారు. అందుకు సెలబ్రెటీలు కూడా మినహాయింపు కాదు. బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషి కపూర్ కూడా అదే ఆశించాడు. పిల్లల సంగతేమో కానీ.. తన కొడుకు రణబీర్ కపూర్ పెళ్లి చూడాలనుకున్నారు.
ఐతే ఇంతకుముందు కత్రినా కైఫ్తో డీప్ లవ్లో ఉన్న అతను వ్యవహారాన్ని పెళ్లిదాకా తీసుకెళ్లి మధ్యలో డ్రాప్ అయిపోయాడు. కత్రినాను రణబీర్ పెళ్లి చేసుకోవడం పట్ల రిషికి పెద్దగా అభ్యంతరాలు లేవని.. కానీ ఆయన భార్య మాత్రం అభ్యంతర పెట్టిందని అప్పట్లో వార్తలొచ్చాయి. గర్ల్ ఫ్రెండ్స్ను మార్చడం అలవాటైన రణబీర్.. తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత మహేష్ భట్ తనయురాలు ఆలియా భట్ ప్రేమలో పడ్డాడు. ముందు ఆలియానే అతణ్ని ఇష్టపడింది. తర్వాత రణబీర్ కూడా ఓకే అన్నాడు.
వీరి పెళ్లి గురించి రెండేళ్ల కిందట్నుంచే చర్చ జరుగుతోంది. వీరి పెళ్లి జరిపించాలని రిషి గట్టిగా కోరుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతాయి. కానీ ఇంతలోనే ఆయన ఎవ్వరూ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడ్డారు. అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ఆయన కోలుకున్నారనే అంతా అనుకున్నారు. తిరిగొచ్చాక ఆయన కొన్ని టీవీ షోల్లో పాల్గొన్నారు. మీడియతో కూడా మాట్లాడారు. కొంత నీరసంగా కనిపించినప్పటికీ రిషి సాధారణ స్థితికి వస్తాడనే అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా ఉన్నట్లుండి ఈ రోజు ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.
రిషి కోలుకున్నాక పెళ్లి చేసుకుందామని రణబీర్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఆయనుండగా పెళ్లి కొడుకు కాలేదు. దీంతో కొడుకు పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండానే రిషి వెళ్లిపోయాడు. నిన్నటి ఇర్ఫాన్ మరణాన్నే తట్టుకోలేకపోతుంటే రిషి సైతం ఇలా కాలం చేయడం సినీ అభిమానులకు కోలుకోలేని షాక్.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…