‘గ్రహణం’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ.. తనకంటూ ఒక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. గొప్ప అభిరుచి ఉన్న దర్శకుడిగా ఆయనకు పేరుంది. కాకపోతే కెరీర్లో చాలా వరకు ఇంద్రగంటి చిన్న సినిమాలే చేశారు. ‘వి’ చిత్రంతో ఆయన రేంజ్ పెరుగుతుందని అనిపించింది. కానీ ఆ సినిమా నిరాశపరచడంతో మళ్లీ ముందులాగే చిన్న సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. వచ్చే వారం ఆయన కొత్త చిత్రం ‘సారంగపాణి జాతకం’ రాబోతోంది. దీని తర్వాతి ప్రాజెక్టు ఇంకా ఖరారు కాలేదు.
ఐతే ‘జటాయు’ పేరుతో ఇంద్రగంటి ఓ భారీ చిత్రం చేయాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా ఈ సినిమా రూపొందుతుందనే వార్తలు వచ్చాయి. దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమా చేయడానికి గతంలో ప్రయత్నాలు చేశారు ఇంద్రగంటి. తాజాగా ‘జటాయు’ గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఈ సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. ‘జటాయు’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఆ సినిమాను భారీ స్థాయిలో తీయాలనే ఆలోచన ఉందని.. త్వరలోనే దాని గురించి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు ఇంద్రగంటి.
ఇక ఇటీవల ఓ డ్యాన్స్ షోలో ‘మాయా బజార్’లోని ‘అహనా పెళ్ళంట’ పాటకు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసిన అమ్మాయిని ఇంద్రగంటి అభినందించడం వివాదాస్పదమైంది. ఇలాంటి డ్యాన్సుల విషయంలో మందలించాల్సింది పోయి అభినందనేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై ఇంద్రగంటి స్పందించారు. ఆ షోల్లో స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పే అవకాశం ఉండదన్నారు. కొన్ని పరిమితుల మధ్య మాట్లాడాల్సి ఉంటుందని.. అందుకే ఆ డ్యాన్స్ గురించి విమర్శ చేయలేకపోయానని ఆయనన్నారు.
This post was last modified on April 17, 2025 1:50 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…