అంటే సుందరానికితో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ నజ్రియా మన పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ శ్రీమతన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ అనోన్య దాంపత్యానికి మారుపేరుగా ఉంటారు. అయితే గత కొంత కాలంగా నజ్రియా కనిపించడం తగ్గించేసింది. సూక్ష్మ దర్శిని విజయాన్ని షేర్ చేసుకోవడం కానీ, తన పుట్టినరోజుకు అందుబాటులో ఉండటం కానీ చేయలేదు. పోనీ కలిసేందుకు ప్రయత్నించిన దర్శక నిర్మాతలకు అందుబాటులోకి రాలేదు. ఏం జరిగిందా అని ఫ్యాన్స్ సతమతమవుతున్న టైంలో సోషల్ మీడియా పోస్టు ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులోనూ కొన్ని ప్రశ్నలు మిగిలాయి. ముందు ఏముందో చూద్దాం.
“హలో అందరికీ. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కొన్ని నెలలుగా ఎందుకు అందుబాటులో లేనో చెప్పాలనిపించి ఇక్కడికి వచ్చాను. మీకు తెలుసు సినీ పరిశ్రమనే అద్భుత సమూహంలో భాగమైన నేను మానసిక మెరుగుదలతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల మీ ముందు హాజరు చూపించుకోవడం కష్టంగా మారింది. నా 30వ పుట్టినరోజుతో పాటు సూక్ష్మదర్శిని విజయాన్ని సెలెబ్రేట్ చేసుకోలేకపోయాను. పూర్తిగా షట్ డౌన్ కావడం వల్ల కాల్స్ అటెండ్ చేయలేదు. మెసేజెస్ కు రిప్లై ఇవ్వలేదు. క్షమాపణ కోరుతున్నాను. బెస్ట్ యాక్టర్ గా కేరళ స్టేట్ అవార్డు అందుకున్నాను. చాలా కష్టంగా అనిపిస్తున్న ప్రయాణంలో నేను పూర్తిగా వెనక్కు రావడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలతో అతి త్వరలోనే రీ కనెక్ట్ అవుతాను. సెలవు”
చూశారుగా. సందేశం స్పష్టంగానే ఉన్నా అసలు ఎందుకు అంతర్ధానం అయ్యిందనేది నజ్రియా స్పష్టంగా పేర్కొనలేదు. భార్యా భర్తలు ఇద్దరూ ఆర్టిస్టులుగా చాలా బిజీగా ఉన్న టైంలో ఏదో జరగరానిది జరిగితే తప్ప ఇంత రియాక్షన్ ఉండదు. ఫహద్ ఫాసిల్ సైతం దీని గురించి ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆమెగా బయట చెప్పింది కానీ ఇకపై ఏదైనా తన సమాధానం ఆశించవచ్చు. ఎక్కడా నోట్ లో ఫహద్ గురించి నజ్రియా ప్రస్తావించలేదు కాబట్టి కుటుంబ పరంగా ఏ సమస్యా ఉండకపోవచ్చు. ఏది ఏమైనా నిజమైన కారణాలు బయటికి వస్తే తప్ప నజ్రియా ఇంత బ్రేక్ ఎందుకు తీసుకుందనేది సస్పెన్స్ గానే ఉంటుంది.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…