అంటే సుందరానికితో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ నజ్రియా మన పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ శ్రీమతన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ అనోన్య దాంపత్యానికి మారుపేరుగా ఉంటారు. అయితే గత కొంత కాలంగా నజ్రియా కనిపించడం తగ్గించేసింది. సూక్ష్మ దర్శిని విజయాన్ని షేర్ చేసుకోవడం కానీ, తన పుట్టినరోజుకు అందుబాటులో ఉండటం కానీ చేయలేదు. పోనీ కలిసేందుకు ప్రయత్నించిన దర్శక నిర్మాతలకు అందుబాటులోకి రాలేదు. ఏం జరిగిందా అని ఫ్యాన్స్ సతమతమవుతున్న టైంలో సోషల్ మీడియా పోస్టు ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులోనూ కొన్ని ప్రశ్నలు మిగిలాయి. ముందు ఏముందో చూద్దాం.
“హలో అందరికీ. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కొన్ని నెలలుగా ఎందుకు అందుబాటులో లేనో చెప్పాలనిపించి ఇక్కడికి వచ్చాను. మీకు తెలుసు సినీ పరిశ్రమనే అద్భుత సమూహంలో భాగమైన నేను మానసిక మెరుగుదలతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల మీ ముందు హాజరు చూపించుకోవడం కష్టంగా మారింది. నా 30వ పుట్టినరోజుతో పాటు సూక్ష్మదర్శిని విజయాన్ని సెలెబ్రేట్ చేసుకోలేకపోయాను. పూర్తిగా షట్ డౌన్ కావడం వల్ల కాల్స్ అటెండ్ చేయలేదు. మెసేజెస్ కు రిప్లై ఇవ్వలేదు. క్షమాపణ కోరుతున్నాను. బెస్ట్ యాక్టర్ గా కేరళ స్టేట్ అవార్డు అందుకున్నాను. చాలా కష్టంగా అనిపిస్తున్న ప్రయాణంలో నేను పూర్తిగా వెనక్కు రావడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలతో అతి త్వరలోనే రీ కనెక్ట్ అవుతాను. సెలవు”
చూశారుగా. సందేశం స్పష్టంగానే ఉన్నా అసలు ఎందుకు అంతర్ధానం అయ్యిందనేది నజ్రియా స్పష్టంగా పేర్కొనలేదు. భార్యా భర్తలు ఇద్దరూ ఆర్టిస్టులుగా చాలా బిజీగా ఉన్న టైంలో ఏదో జరగరానిది జరిగితే తప్ప ఇంత రియాక్షన్ ఉండదు. ఫహద్ ఫాసిల్ సైతం దీని గురించి ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆమెగా బయట చెప్పింది కానీ ఇకపై ఏదైనా తన సమాధానం ఆశించవచ్చు. ఎక్కడా నోట్ లో ఫహద్ గురించి నజ్రియా ప్రస్తావించలేదు కాబట్టి కుటుంబ పరంగా ఏ సమస్యా ఉండకపోవచ్చు. ఏది ఏమైనా నిజమైన కారణాలు బయటికి వస్తే తప్ప నజ్రియా ఇంత బ్రేక్ ఎందుకు తీసుకుందనేది సస్పెన్స్ గానే ఉంటుంది.
This post was last modified on April 17, 2025 8:53 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…