సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న వెంకటేష్ ఆ తర్వాత ఎవరితో చేయాలనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా ఉండొచ్చనే ప్రచారం నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తి పెరిగింది కానీ వాస్తవానికి అలాంటి ప్రతిపాదనేది లేదట. అట్లీతో చేస్తున్న అల్లు అర్జున్ 22 టైం ఎంత ఆలస్యమైనా అప్పటిదాకా వేచి ఉండాలని త్రివిక్రమ్ నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. వీలైతే రెండు సమాంతరంగా షూట్ చేసే సాధ్యాసాధ్యాలను బన్నీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. సో వెంకీ, మాటల మాంత్రికుడి కాంబో లేనట్టే.
ఇక అసలు విషయానికి వస్తే వెంకటేష్ ని ఒప్పించడం దర్శకులకు మహా కష్టంగా మారిందట. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సక్సెస్ ని పెంచుకునే దిశగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సామాజవరగమన రచయితల్లో ఒకరైన నందు చెప్పిన కథ నచ్చింది కానీ దాని బాధ్యతలు తీసుకునే దర్శకుడిని సెట్ చేయడం సవాల్ గా మారిందట. చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఎంటర్ టైనర్ లో వెంకటేష్ ఉన్నారనే వార్తకు సంబంధింది సరైన క్లారిటీ రాలేదు. ఉన్నా ఎంత నిడివి అనేది సస్పెన్స్ గా ఉంది.
మిగిలిన సీనియర్ హీరోల్లా వేగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్న వెంకటేష్ మూడు నెలలుగా స్టోరీ డిస్కషన్స్ లో తరచుగా పాల్గొంటున్నారు కానీ ఏదీ తేల్చడం లేదు. మధ్యలో కొంత అనారోగ్యం ఇబ్బంది పెట్టినా వేగంగా కోలుకుని తిరిగి పనుల మీద దృష్టి పెట్టారు. రానా నాయుడు 2 షూట్ చివరి దశలో ఉంది. త్వరలోనే డబ్బింగ్ పూర్తి చేయబోతున్నారు. స్ట్రీమింగ్ డేట్ ఇంకా నిర్ణయించలేదు కానీ ఈ వేసవిలోనే ఉండొచ్చు. ఇమేజ్ ప్లస్ గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈసారి బూతుల డోస్ బాగా తగ్గించారట. ఇదంతా ఓకే కానీ వెంకీని మెప్పించే లక్కీ దర్శకుడు ఎవరో.
This post was last modified on April 17, 2025 6:58 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…