నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి టీజర్ లాంటివి రిలీజ్ చేయడం.. అలాగే కొత్త చిత్రాలను ప్రకటించడం లాంటివి ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ 10న బాలయ్య పుట్టిన రోజుకు రెండు కానుకలు రెడీ అవుతున్నట్లు సమాచారం. ముందు నుంచి అనుకుంటున్నట్లే తన కొత్త చిత్రం ‘అఖండ-2’ నుంచి టీజర్ ట్రీట్ ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూళ్లు చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు కూడా షూట్ కొనసాగుతోంది. దర్శకుడు బోయపాటి ఇప్పటికే టీజర్ కాన్సెప్ట్ ఎలా ఉండాలో ఫిక్స్ చేశాడట.
ఇప్పట్నుంచే అందుకోసం విజువల్స్ తీసి పక్కన పెడుతున్నాడట. టీజర్ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేలా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బాలయ్య కొత్త సినిమాను పుట్టిన రోజు నాడు అనౌన్స్ చేయబోతున్నారట. నందమూరి హీరోకు ‘వీరసింహారెడ్డి’ రూపంలో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని మరోసారి ఆయనతో జట్టు కట్టబోతున్నాడు.
తాజాగా అతను ‘జాట్’తో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్కు హిట్ ఇచ్చాడు. ఈ ఊపులో బాలయ్యతో మళ్లీ సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’తో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. మరో సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అవుతుందని సమాచారం. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో భారీగా ఈ సినిమాను నిర్మించబోతున్నారట. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి కానీ.. అది కార్యరూపం దాల్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…