నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ థియేటర్ల పరిస్థితి ఘోరంగా ఉందని, జనాలు రావడం లేదని, తాను స్వయంగా రెండు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తిరిగి ప్రత్యక్షంగా గమనించి ఇది చెబుతున్నానని అన్నారు. ఆడియన్స్ ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని, సెకండ్ షోలు వేయడం దాదాపు మానేశారని, సాయంత్రం కొంచెం పర్వాలేదనిపించేలా నడుస్తున్నాయని వివరించారు. ఈ దుస్థితి స్టార్ హీరోలకు సైతం తప్పడం లేదని, పబ్లిక్ వచ్చి టికెట్లు కొంటేనే తాము అన్నం తినగలమంటూ ఆవేదన వెలిబుచ్చారు.
త్రినాథరావు వ్యక్తపరిచింది ముమ్మాటికీ నిజం. ముఖ్యంగా బంగారం లాంటి సమ్మర్ సీజన్ లో సైతం థియేటర్లు ఖాళీగా ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు. అయితే ఇక్కడ ప్రాక్టికల్ కోణంలో చూడాల్సిన అంశాలు కొన్నున్నాయి. ప్రేక్షకులు ఎప్పుడు సినిమాలను వెండితెర మీద చూసేందుకు ముందుంటారు. కాకపోతే మారిన ట్రెండ్ లో, ఓటిటి జమానాలో ఆషామాషీ కంటెంట్ తో పని జరగడం లేదు. మూడు వందల కోట్లతో తీసిన గేమ్ ఛేంజర్ కన్నా యాభై కోట్లకే పూర్తయిన సంక్రాంతికి వస్తున్నాంకి బ్రహ్మరథం దక్కింది. కోర్ట్, మ్యాడ్ స్క్వేర్లు అసలు స్టార్లే లేకుండా ఘనవిజయం సాధించి బయ్యర్లందరికీ లాభాలిచ్చాయి.
సో బాగా తీస్తే ఆదరణ అందించేందుకు పబ్లిక్ సిద్ధంగా ఉన్నారనేది ఓపెన్ ఫాక్ట్. దాన్ని గుర్తించాలి. అంతదాకా ఎందుకు ఇదే త్రినాథరావు తీసిన మజాకా ఎందుకు ఆడలేదనేది అందరికీ తెలిసిన విషయమే. వర్కవుట్ కాని ఏజ్ బార్ తండ్రి ప్రేమకథని అవసరానికి మించి సాగదీయడంతో ఆ కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేకపోయారు. కల్కి, దేవర, పుష్ప 2, బలగం ఇలా ఏది చూసుకున్నా చిన్నా పెద్దా లేకుండా బాగున్నవాటికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. యావరేజ్, బిలో యావరేజ్ కంటెంట్లకు కాలం చెల్లిన రోజుల్లో హాలుకు వచ్చిన వాళ్లకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తే తప్ప కొత్త సినిమాలకు టికెట్లు తెగడం కష్టం.
This post was last modified on April 16, 2025 5:36 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…