డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. రెండో చిత్రం ‘మహానటి’తో గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ‘కల్కి’తో ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడనిపించుకున్నాడు. ఇప్పుడు నాగి అంటే ఒక బ్రాండ్. అలాంటి దర్శకుడు చెప్పే మాటలను ఎవ్వరైనా ఆసక్తిగా వింటారు. తాజాగా ఒక కాలేజీలో ఓ ఈవెంట్లో పాల్గొన్న నాగి.. అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.
ఈ క్రమంలోనే మీరు ఏదైనా కథ రాస్తే.. అలాంటి కథే వేరే సినిమాలో కనిపిస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందని ప్రశ్నించాడు ఓ విద్యార్థి. ఈ ప్రశ్నకు ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు నాగి. హాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్లో ఒకటనదగ్గ క్రిస్టఫర్ నోలన్ సినిమా ‘ఇన్సెప్షన్’తో తన కథకు పోలికలు కనిపించాయని నాగి చెప్పాడు. ‘ఇన్సెప్షన్’ రిలీజ్కు ముందే తాను అలాంటి ఒక కథ రాశానన్నాడు.
జ్ఞాపకాల మీద ఆ కథ సాగుతుందని.. ఐతే సేమ్ అదే కథ కాకపోయినా.. ఆ సినిమా చూసినపుడు తన ఐడియాతో చాలా సిమిలర్గా కనిపించిందని.. దీంతో ఒక వారం పాటు తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయానని.. ఊరికే అలా తిరుగుతూ, మ్యాగీ తింటూ గడిపానని చెప్పాడు నాగి. ఇక వేరే సినిమా ఏదైనా డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ మీకుందా అని అడిగితే.. అలాంటిదేమీ లేదని చెప్పిన నాగి.. రెండు మూడు చిత్రాలను ఎడిట్ చేస్తే బాగుండేదని మాత్రం అనిపించిందన్నాడు. అందులో ముందుగా చెప్పిన పేరు.. ఖలేజా. ఆ సినిమాతో పాటు ‘డియర్ కామ్రేడ్’ సినిమాను కూడా తాను ఎడిట్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు నాగి. బహుశా ఎడిటింగ్ సరిగా లేకపోవడం వల్లే ఆ సినిమాలు ఫెయిలయ్యాయన్నది నాగి ఫీలింగ్ కావచ్చు.
This post was last modified on April 15, 2025 7:09 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…