దర్శకుడు ప్రశాంత్ వర్మకి హనుమాన్ కన్నా ముందు కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చిన సినిమా జాంబీ రెడ్డి. అప్పటిదాకా టాలీవుడ్ కు పెద్దగా పరిచయం లేని జాంబీ హారర్ కు రాయలసీమ కామెడీని కలగలిపి చేసిన ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని ఇచ్చింది. సోలో హీరోగా తేజ సజ్జ ఫిల్మోగ్రఫీలో మొదటి హిట్టు పడింది. ఇదంతా జరిగి నాలుగేళ్లు గడిచిపోయాయి. అప్పటి నుంచి సీక్వెల్ కోసం ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రశాంత్ వర్మ వర్క్ చేయడమే తప్ప బయటకి చెప్పడం జరగలేదు. ఇప్పుడా దిశగా చర్యలు జరుగుతున్నట్టు సమాచారం. హీరో తప్ప ఈసారి దర్శకుడు, బడ్జెట్ వగైరాలు మారబోతున్నాయట.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రానా నాయుడు ఫేమ్ సుపర్న్ వర్మ దర్శకత్వంలో జాంబీ రెడ్డి 2 కోసం సుమారు వంద కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించబోతున్నట్టు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ టీమ్ ఫైనల్ టచ్ అప్ పనుల్లో బిజీగా ఉందని తెలిసింది. ఈసారి కథని కేవలం సీమకే పరిమితం చేయకుండా ప్యాన్ ఇండియా స్థాయిలో వివిధ నగరాల్లో జాంబీలు విరుచుకుపడితే అప్పుడు హీరో ఏం చేశాడనే పాయింట్ మీద రూపొందుతుందని వినిపిస్తోంది. బడ్జెట్, స్కేల్, క్యాస్టింగ్ తదితర విషయాల్లో ఎవరూ ఊహించని స్థాయిలో సర్ప్రైజులు ఉండబోతున్నాయని వినికిడి.
హనుమాన్ తర్వాత కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న తేజ సజ్జ నెక్స్ట్ సినిమా మిరాయ్ ఆగస్ట్ 1 విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీని కోసం కుర్రాడు ఏకంగా రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ తర్వాత జాంబీ రెడ్డి 2 ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లార్జర్ దాన్ లైఫ్ సూపర్ హీరో కథల్లో తేజ సజ్జ ఒదుగుతున్న తీరు ఆలాంటి అవకాశాలే తీసుకొస్తోంది. తన సినిమాటిక్ యునివర్స్ లో జాంబీ రెడ్డిని ఒక భాగం చేయబోతున్న ప్రశాంత్ వర్మ క్రమంగా హనుమాన్, జై హనుమాన్, మహాకాళి, అధీర, బ్రహ్మ్ రాక్షస్ తదితరులతో ఒక మల్టీస్టారర్ ని భవిష్యత్తులో ప్లాన్ చేస్తాడట. నిజమైతే దీని బడ్జెట్ ఊహించలేమేమో.
This post was last modified on April 15, 2025 4:50 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…