హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఓ మోస్తరు సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం పాట ఓపెనింగ్స్ కి బాగా దోహదం చేయడమే కాక ప్రదీప్ కో మంచి హిట్టు దక్కేలా చేసింది. ఆ తర్వాత కొందరు నిర్మాతలు, దర్శకులు తనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించారు కానీ కథలు నచ్చకపోవడం వల్లో లేక ఇంకేదైనా కారణమో కానీ వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. యాంకర్ గా ప్రస్థానం కొనసాగిస్తూ శాటిలైట్ చానెల్స్, ఓటిటిలో బిజీగా మారిపోయాడు.
మొన్న శుక్రవారం సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ పెట్టేసుకున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ రధన్ తో సంగీతం చేయించుకుని పెద్ద క్యాస్టింగ్ సెట్ చేసుకున్నాడు. దర్శకులు నితిన్ – భరత్ ని పూర్తిగా నమ్మేశాడు. ప్రమోషన్లు బాగానే చేశారు. బాక్సాఫీస్ దగ్గర సరైన సినిమా లేకపోవడంతో ఎంటర్ టైన్మెంట్ పరంగా ప్రేక్షకులకు తమదే బెస్ట్ ఛాయస్ అవుతుందనుకున్నారు. తీరా చూస్తే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి ఆశించిన ఫలితం రాలేదు. ఓపెనింగ్స్ జస్ట్ ఓకే అనిపించగా రివ్యూలు, పబ్లిక్ టాక్స్ అబ్బే లాభం లేదని పెదవి విరిచేశాయి.
కామెడీని హ్యాండిల్ చేయడంలో దర్శకులు పడిన తడబాటు దీన్నో యావరేజ్ కన్నా తక్కువ చిత్రంగా మార్చేశాయి. ముఖ్యంగా సెకండాఫ్ పెద్ద దెబ్బ కొట్టింది. రెగ్యులర్ గా కనిపిస్తూ వరుసగా సినిమాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులతో కనెక్టివిటీ ఉంటుంది. అలా కాకుండా అయిదేళ్లకోసారి కనిపిస్తే జనాన్ని పుష్ చేయడం కష్టమవుతుంది. హిట్టో ఫ్లాపో చైన్ కొనసాగుతూ ఉంటేనే హీరోలను పబ్లిక్ గుర్తు పెట్టుకుంటారు. ఇంత గ్యాప్ తీసుకుని అది కూడా ఇలాంటి కంటెంట్ తో వస్తే కష్టం. ఇకపై ప్రదీప్ వేగంగా సినిమాలు చేయడమో లేక మంచి కెరీర్ ఇస్తున్న బుల్లితెరపై కంటిన్యూ అయిపోవడంమో ఏదో ఒకటి చేయడం బెటర్.
This post was last modified on April 15, 2025 4:11 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…