Movie News

‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో ట్రాజిక్ ఎండింగ్? : దర్శకుడు ఏమన్నాడంటే…

నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా పెద్దగా బజ్ లేదు కానీ.. టీజర్ వచ్చాక కావాల్సినంత హైప్ వచ్చింది. లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్ సైతం అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో క్లైమాక్స్ గురించి కళ్యాణ్ రామ్ ముందు నుంచి గొప్పగా చెబుతున్నాడు. ఇలాంటి క్లైమాక్స్ తెలుగులో ఇప్పటిదాకా రాలేదన్నాడు. ఇక ప్రి రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చివరి 20 నిమిషాల సన్నివేశాలు చూసి కదిలిపోని, కన్నీళ్లు పెట్టని ప్రేక్షకుడు ఉండడని అన్నాడు.

అన్నదమ్ముల మాటలతో పతాక సన్నివేశాల మీద అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా తారక్ మాటల మీద నందమూరి అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఐతే క్లైమాక్స్ చూసి కదిలిపోతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు అంటుంటే.. ఇది ట్రాజిక్ క్లైమాక్స్ ఏమో అని సందేహాలు నెలకొన్నాయి. తెలుగు ప్రేక్షకులు విషాదాంతాలను ఇష్టపడరనే అభిప్రాయం ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు ప్రదీప్ చిలుకూరి స్పందించాడు.

‘‘క్లైమాక్స్‌లో కన్నీళ్లు ఆగవు అంటే కథ విషాదాంతం అవుతుందని కాదు. ఎమోషన్స్ అలా ఉంటాయి. అమ్మకోసం మనం ఎన్ని త్యాగాలు చేయొచ్చో ఇందులో చూపించాం. కొంత వయసు వచ్చాక అమ్మ తనకు సంబంధించిన విషయాలను మరిచిపోతుంది. వాటిని మనం గుర్తు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూపించాం. మన చిన్నపుడు మన పుట్టిన రోజును అమ్మ చేయడం సెలబ్రేషన్. మనం పెద్దయ్యాక అమ్మ పుట్టిన రోజును చేయడం ఎమోషన్. ఇదే సినిమాలో కీ పాయింట్. ఎన్టీఆర్, విజయశాంతి సినిమా చూశారు. కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో వాళ్లకు నచ్చింది కూడా ఎమోషన్లే. ఇది కామెడీ యాక్షన్ సినిమా అని చెప్పను. ఎమోషనల్ మూవీ. పాటలు కూడా ఎక్కువ ఉండవు’’ అని ప్రదీప్ తెలిపాడు.

This post was last modified on April 14, 2025 4:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

54 minutes ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

2 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

2 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

3 hours ago

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన…

3 hours ago

అన్నయ్య రూటులోనే బేబీ హీరో రిస్కు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…

4 hours ago