Movie News

‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో ట్రాజిక్ ఎండింగ్? : దర్శకుడు ఏమన్నాడంటే…

నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా పెద్దగా బజ్ లేదు కానీ.. టీజర్ వచ్చాక కావాల్సినంత హైప్ వచ్చింది. లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్ సైతం అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో క్లైమాక్స్ గురించి కళ్యాణ్ రామ్ ముందు నుంచి గొప్పగా చెబుతున్నాడు. ఇలాంటి క్లైమాక్స్ తెలుగులో ఇప్పటిదాకా రాలేదన్నాడు. ఇక ప్రి రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చివరి 20 నిమిషాల సన్నివేశాలు చూసి కదిలిపోని, కన్నీళ్లు పెట్టని ప్రేక్షకుడు ఉండడని అన్నాడు.

అన్నదమ్ముల మాటలతో పతాక సన్నివేశాల మీద అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా తారక్ మాటల మీద నందమూరి అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఐతే క్లైమాక్స్ చూసి కదిలిపోతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు అంటుంటే.. ఇది ట్రాజిక్ క్లైమాక్స్ ఏమో అని సందేహాలు నెలకొన్నాయి. తెలుగు ప్రేక్షకులు విషాదాంతాలను ఇష్టపడరనే అభిప్రాయం ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు ప్రదీప్ చిలుకూరి స్పందించాడు.

‘‘క్లైమాక్స్‌లో కన్నీళ్లు ఆగవు అంటే కథ విషాదాంతం అవుతుందని కాదు. ఎమోషన్స్ అలా ఉంటాయి. అమ్మకోసం మనం ఎన్ని త్యాగాలు చేయొచ్చో ఇందులో చూపించాం. కొంత వయసు వచ్చాక అమ్మ తనకు సంబంధించిన విషయాలను మరిచిపోతుంది. వాటిని మనం గుర్తు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూపించాం. మన చిన్నపుడు మన పుట్టిన రోజును అమ్మ చేయడం సెలబ్రేషన్. మనం పెద్దయ్యాక అమ్మ పుట్టిన రోజును చేయడం ఎమోషన్. ఇదే సినిమాలో కీ పాయింట్. ఎన్టీఆర్, విజయశాంతి సినిమా చూశారు. కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో వాళ్లకు నచ్చింది కూడా ఎమోషన్లే. ఇది కామెడీ యాక్షన్ సినిమా అని చెప్పను. ఎమోషనల్ మూవీ. పాటలు కూడా ఎక్కువ ఉండవు’’ అని ప్రదీప్ తెలిపాడు.

Kumar

Recent Posts

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

51 minutes ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

2 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

4 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

6 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

11 hours ago