మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న మంచు కుటుంబ సభ్యుల్లో ఇటీవల అనూహ్యంగా విభేదాలు తలెత్తాయి. మోహన్ బాబు, విష్ణు ఒక వైపు నిలిస్తే.. మనోజ్ వారికి దూరం అయిపోయాడు. విష్ణు, మనోజ్ సవతి సోదరులు అనే విషయం జనం గుర్తించనంతగా.. ఒక కడుపునే పుట్టినంత అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇద్దరూ శత్రువులైపోయారు. మోహన్ బాబు సైతం మనోజ్ను దూరం పెట్టడం.. కొడుకు మీద అనేక ఆరోపణలు చేయడం.. మనోజ్ సైతం మోహన్ బాబు-విష్ణుల మీద అభియోగాలు మోపడం చర్చనీయాంశంగా మారింది.
ఈ కుటుంబం ఇలా రోడ్డున పడడం వారి అభిమానులకు అస్సలు నచ్చట్లేదు. మధ్యలో గొడవ కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా.. మళ్లీ ఇటీవల జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ నిరసనకు దిగడం, అనేక ఆరోపణలు చేయడంతో వ్యవహారం మొదటికి వచ్చింది. ఐతే ఈ గొడవ అంతకంతకూ పెరుగుతుండగా.. విష్ణు, మనోజ్ల సోదరి మంచు లక్ష్మి ఏం చేస్తోంది, అన్నదమ్ముల మధ్య రాజీకి ఆమె ప్రయత్నించడం లేదా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. బహుశా ఆమె ఆ ప్రయత్నం చేస్తుండొచ్చు. అది బయటికి కనిపించడం లేదు. అన్నదమ్ముల గొడవ ఆమెను ఎంత వేదనకు గురి చేస్తోందో తెలియజేసే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఒక ఈవెంట్లో పాల్గొన్న మంచు లక్ష్మిని మనోజ్ సర్ప్రైజ్ చేశాడు. వెనుక నుంచి ఆమెను మనోజ్ పట్టుకోవడం.. ఆమె అతణ్ని చూడగానే ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకోవడం.. తర్వాత మనోజ్ భార్య మౌనిక ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయడం.. ఇలా మొత్తంగా వీడియో చూసే వాళ్లను కదిలించేస్తోంది. ఏ కుటుంబానికీ ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఎవరైనా అనుకుంటారు. వీలైనంత త్వరగా విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు సమసిపోయి.. కుటుంబమంతా కలిసి పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయంలో మంచు లక్ష్మి గట్టిగా ప్రయత్నిస్తే అనుకున్నది జరుగుతందని అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on April 13, 2025 9:48 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…