మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న మంచు కుటుంబ సభ్యుల్లో ఇటీవల అనూహ్యంగా విభేదాలు తలెత్తాయి. మోహన్ బాబు, విష్ణు ఒక వైపు నిలిస్తే.. మనోజ్ వారికి దూరం అయిపోయాడు. విష్ణు, మనోజ్ సవతి సోదరులు అనే విషయం జనం గుర్తించనంతగా.. ఒక కడుపునే పుట్టినంత అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇద్దరూ శత్రువులైపోయారు. మోహన్ బాబు సైతం మనోజ్ను దూరం పెట్టడం.. కొడుకు మీద అనేక ఆరోపణలు చేయడం.. మనోజ్ సైతం మోహన్ బాబు-విష్ణుల మీద అభియోగాలు మోపడం చర్చనీయాంశంగా మారింది.
ఈ కుటుంబం ఇలా రోడ్డున పడడం వారి అభిమానులకు అస్సలు నచ్చట్లేదు. మధ్యలో గొడవ కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా.. మళ్లీ ఇటీవల జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ నిరసనకు దిగడం, అనేక ఆరోపణలు చేయడంతో వ్యవహారం మొదటికి వచ్చింది. ఐతే ఈ గొడవ అంతకంతకూ పెరుగుతుండగా.. విష్ణు, మనోజ్ల సోదరి మంచు లక్ష్మి ఏం చేస్తోంది, అన్నదమ్ముల మధ్య రాజీకి ఆమె ప్రయత్నించడం లేదా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. బహుశా ఆమె ఆ ప్రయత్నం చేస్తుండొచ్చు. అది బయటికి కనిపించడం లేదు. అన్నదమ్ముల గొడవ ఆమెను ఎంత వేదనకు గురి చేస్తోందో తెలియజేసే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఒక ఈవెంట్లో పాల్గొన్న మంచు లక్ష్మిని మనోజ్ సర్ప్రైజ్ చేశాడు. వెనుక నుంచి ఆమెను మనోజ్ పట్టుకోవడం.. ఆమె అతణ్ని చూడగానే ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకోవడం.. తర్వాత మనోజ్ భార్య మౌనిక ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయడం.. ఇలా మొత్తంగా వీడియో చూసే వాళ్లను కదిలించేస్తోంది. ఏ కుటుంబానికీ ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఎవరైనా అనుకుంటారు. వీలైనంత త్వరగా విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు సమసిపోయి.. కుటుంబమంతా కలిసి పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయంలో మంచు లక్ష్మి గట్టిగా ప్రయత్నిస్తే అనుకున్నది జరుగుతందని అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on April 13, 2025 9:48 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పాలనలో పెద్దగా అనుభవం లేదని చెప్పాలి. ఓ డిప్యూటీ…
విశ్వగురుగా…పేరు తెచ్చుకున్నప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పెహల్గామ్ ఉగ్రదాడి విషమ పరీక్ష పెడుతోందా? ప్రపంచ దేశాలకు శాంతి సందేశం అందిస్తున్న…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందబోయే భారీ ఎంటర్ టైనర్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.…
గత ఏడాది కూటమి విజయం దక్కించుకున్నాక.. ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించిన తర్వాత.. 'పిఠాపురం…
పెహల్గామ్ ఉదంతం తర్వాత పాకిస్థాన్ మీద తీవ్ర చర్యలకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ప్రజల నుంచి కూడా…
బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిర్లిప్తత నెలకొంది. చాలా థియేటర్ల దగ్గర స్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. పట్టుమని పది మంది రాక…