ఏడేళ్ల క్రితం ఒక చిన్న సీన్ ఆమెకు ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. కుర్రాడిని చూస్తూ కన్నుగీటుతున్న సన్నివేశం దేశంలోనే కాదు ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఉన్నా చూసేంత వైరలైపోయింది. కట్ చేస్తే ఆ ఎపిసోడ్ ఉన్న ఓరు ఆధార్ లవ్ అనే సినిమా హాట్ కేక్ లా అమ్ముడుపోయి పెద్ద ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. తెలుగులో లవర్స్ డేగా డబ్బింగ్ చేశారు కానీ మనోళ్లు అంతగా పట్టించుకోలేదు. ఆ అమ్మడే ప్రియా ప్రకాష్ వారియర్. 2019లో ఇంత సెన్సేషనల్ డెబ్యూ చేశాక తనకు తిరుగు లేదనుకున్నారు. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ప్రియా వారియర్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.
టాలీవుడ్ లో నితిన్ చెక్, పవన్ కళ్యాణ్ బ్రో లాంటి వాటిలో చేసినా వాటి ఫలితాలు తనకు మలుపు ఇవ్వలేకపోయాయి. ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మా నీకు అంత కోపమాలో మంచి పాత్రే దొరికింది కానీ బాక్సాఫీస్ వద్ద బొమ్మ ఆడకపోవడంతో మరోసారి నిరాశే మిగిలింది. కట్ చేస్తే గుడ్ బ్యాడ్ అగ్లీలో విలన్ పక్కన వేసిన సపోర్టింగ్ రోల్ ఒక్కసారిగా తన జాతకాన్ని మార్చేలా ఉంది. అలాని పెర్ఫార్మన్స్ బ్రహ్మాండంగా చేసిందని కాదు. విలన్ అర్జున్ దాస్ తో కలిసి సుల్తానా అంటూ పాత పాటకు వేసిన స్టెప్పులు అప్పట్లో దాంట్లో నర్తించిన సిమ్రాన్ ని గుర్తు చేయడంతో తమిళ ఆడియన్స్ ప్రియాతో బాగా కనెక్ట్ అవుతున్నారు.
ఈమె ఎపిసోడ్ తాలూకు వీడియోలను షేర్ చేసుకోవడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ రెస్పాన్స్ చూసి ప్రియా ప్రకాష్ వారియర్ చాలా హ్యాపీగా ఉంది. స్టార్ హీరోలతో ఆడిపాడే అవకాశాలు రాకపోయినా అజిత్ సినిమాలో చేసిన ఆనందం, ఆయనతో దగ్గరి నుంచి పని చేసిన అనుభవం జీవితాంతం గుర్తుండిపోతాయని అంటోంది. 2019లో పోలిస్తే ప్రియా వారియర్ లో చాలా మార్పులొచ్చాయి. మలయాళం, కన్నడలో చెప్పుకోదగ్గ సినిమాలైతే చేసింది కానీ గుర్తింపు వచ్చింది మాత్రం గుడ్ బ్యాడ్ అగ్లీతోనే. మరి తర్వాత కూడా అన్నీ ఇలాంటి క్యారెక్టర్లే వస్తే మాత్రం ఆదాయం తప్ప ఆనందం ఉండకపోవచ్చు. చూద్దాం.
This post was last modified on April 13, 2025 7:20 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…