ఈ వారం విడుదల కాబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో క్లైమాక్స్ గురించి టీమ్ పదే పదే హైలైట్ చేస్తూ చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తాను సినిమా చూశానని, చివరిగా క్లైమాక్స్ లో కంటతడి పెట్టకుండా ఉండటం అసాధ్యమని, ఇంత రిస్క్ కి కళ్యాణ్ రామ్ కు మాత్రమే సాధ్యమయ్యిందని చెప్పడం ఫ్యాన్స్ ఎగ్ జైట్ మెంట్ పెంచింది. అంతగా ఏముందనే సందేహం రావడం సహజం. నిన్న గమనిస్తే తారక్ ఏదో చెప్పబోతూ ఉంటే కళ్యాణ్ రామ్ వద్దని వారిస్తూ సరదాగా తమ్ముడిని నిలువరించే ప్రయత్నం స్టేజి మీదే జరిగింది. అంటే ఏదో పెద్ద ట్విస్టే ఉంది.
దీని గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కథలో కీలకమైన పాత్రలు రెండు. ఒకటి కళ్యాణ్ రామ్, రెండు విజయశాంతి. ఆడియన్స్ ని కంటతడికి గురి చేసే ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా వీళ్ళలో ఒకరికి ఏదైనా జరగరానిది జరిగినప్పుడే అంత ఎమోషన్ పండుతుంది. మరి దర్శకుడు ప్రవీణ్ చిలుకూరి దీన్ని ఎలా డిజైన్ చేశాడనేది చూడాలి. పైగా అందరూ చివరి ఇరవై నిమిషాల గురించి ఈ స్థాయిలో ఎలివేట్ చేయడం చూస్తే అదేదో ఆషామాషి వ్యవహారంలా లేదు. కాకపోతే అంతగా మెలితిప్పే ఎమోషన్ ఏమై ఉండొచ్చనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ఇంకో అయిదు రోజులు వేచి ఉండాల్సిందే.
ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేయడం, విజయశాంతి ఇంత వయసులోనూ ఓపిగ్గా అన్ని చోట్లకు వెళ్లి పబ్లిసిటీలో భాగం కావడం చూస్తే మాస్ లో అర్జున్ సన్నాఫ్ వైజయంతికి మంచి మద్దతు దక్కేలా ఉంది. విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాకు తమన్నా ఓదెల 2 నుంచి పోటీ ఉంది. అది ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయనుండటం టాక్ పరంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కు అంత పెద్ద సక్సెస్ అయితే రాలేదు. ఇప్పుడీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫలితాన్ని బట్టి బింబిసార 2 మీద ఎంత పెట్టుబడి పెట్టాలనేది నిర్ణయించుకోవచ్చు.
This post was last modified on April 13, 2025 10:00 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…