ఈ వారం విడుదల కాబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో క్లైమాక్స్ గురించి టీమ్ పదే పదే హైలైట్ చేస్తూ చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తాను సినిమా చూశానని, చివరిగా క్లైమాక్స్ లో కంటతడి పెట్టకుండా ఉండటం అసాధ్యమని, ఇంత రిస్క్ కి కళ్యాణ్ రామ్ కు మాత్రమే సాధ్యమయ్యిందని చెప్పడం ఫ్యాన్స్ ఎగ్ జైట్ మెంట్ పెంచింది. అంతగా ఏముందనే సందేహం రావడం సహజం. నిన్న గమనిస్తే తారక్ ఏదో చెప్పబోతూ ఉంటే కళ్యాణ్ రామ్ వద్దని వారిస్తూ సరదాగా తమ్ముడిని నిలువరించే ప్రయత్నం స్టేజి మీదే జరిగింది. అంటే ఏదో పెద్ద ట్విస్టే ఉంది.
దీని గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కథలో కీలకమైన పాత్రలు రెండు. ఒకటి కళ్యాణ్ రామ్, రెండు విజయశాంతి. ఆడియన్స్ ని కంటతడికి గురి చేసే ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా వీళ్ళలో ఒకరికి ఏదైనా జరగరానిది జరిగినప్పుడే అంత ఎమోషన్ పండుతుంది. మరి దర్శకుడు ప్రవీణ్ చిలుకూరి దీన్ని ఎలా డిజైన్ చేశాడనేది చూడాలి. పైగా అందరూ చివరి ఇరవై నిమిషాల గురించి ఈ స్థాయిలో ఎలివేట్ చేయడం చూస్తే అదేదో ఆషామాషి వ్యవహారంలా లేదు. కాకపోతే అంతగా మెలితిప్పే ఎమోషన్ ఏమై ఉండొచ్చనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ఇంకో అయిదు రోజులు వేచి ఉండాల్సిందే.
ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేయడం, విజయశాంతి ఇంత వయసులోనూ ఓపిగ్గా అన్ని చోట్లకు వెళ్లి పబ్లిసిటీలో భాగం కావడం చూస్తే మాస్ లో అర్జున్ సన్నాఫ్ వైజయంతికి మంచి మద్దతు దక్కేలా ఉంది. విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాకు తమన్నా ఓదెల 2 నుంచి పోటీ ఉంది. అది ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయనుండటం టాక్ పరంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కు అంత పెద్ద సక్సెస్ అయితే రాలేదు. ఇప్పుడీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫలితాన్ని బట్టి బింబిసార 2 మీద ఎంత పెట్టుబడి పెట్టాలనేది నిర్ణయించుకోవచ్చు.
This post was last modified on April 13, 2025 10:00 am
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…