ఈ వారం విడుదల కాబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో క్లైమాక్స్ గురించి టీమ్ పదే పదే హైలైట్ చేస్తూ చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తాను సినిమా చూశానని, చివరిగా క్లైమాక్స్ లో కంటతడి పెట్టకుండా ఉండటం అసాధ్యమని, ఇంత రిస్క్ కి కళ్యాణ్ రామ్ కు మాత్రమే సాధ్యమయ్యిందని చెప్పడం ఫ్యాన్స్ ఎగ్ జైట్ మెంట్ పెంచింది. అంతగా ఏముందనే సందేహం రావడం సహజం. నిన్న గమనిస్తే తారక్ ఏదో చెప్పబోతూ ఉంటే కళ్యాణ్ రామ్ వద్దని వారిస్తూ సరదాగా తమ్ముడిని నిలువరించే ప్రయత్నం స్టేజి మీదే జరిగింది. అంటే ఏదో పెద్ద ట్విస్టే ఉంది.
దీని గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కథలో కీలకమైన పాత్రలు రెండు. ఒకటి కళ్యాణ్ రామ్, రెండు విజయశాంతి. ఆడియన్స్ ని కంటతడికి గురి చేసే ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా వీళ్ళలో ఒకరికి ఏదైనా జరగరానిది జరిగినప్పుడే అంత ఎమోషన్ పండుతుంది. మరి దర్శకుడు ప్రవీణ్ చిలుకూరి దీన్ని ఎలా డిజైన్ చేశాడనేది చూడాలి. పైగా అందరూ చివరి ఇరవై నిమిషాల గురించి ఈ స్థాయిలో ఎలివేట్ చేయడం చూస్తే అదేదో ఆషామాషి వ్యవహారంలా లేదు. కాకపోతే అంతగా మెలితిప్పే ఎమోషన్ ఏమై ఉండొచ్చనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ఇంకో అయిదు రోజులు వేచి ఉండాల్సిందే.
ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేయడం, విజయశాంతి ఇంత వయసులోనూ ఓపిగ్గా అన్ని చోట్లకు వెళ్లి పబ్లిసిటీలో భాగం కావడం చూస్తే మాస్ లో అర్జున్ సన్నాఫ్ వైజయంతికి మంచి మద్దతు దక్కేలా ఉంది. విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాకు తమన్నా ఓదెల 2 నుంచి పోటీ ఉంది. అది ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయనుండటం టాక్ పరంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కు అంత పెద్ద సక్సెస్ అయితే రాలేదు. ఇప్పుడీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫలితాన్ని బట్టి బింబిసార 2 మీద ఎంత పెట్టుబడి పెట్టాలనేది నిర్ణయించుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…