తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది ముందుతరం నిర్మాతలు మాత్రమే ఇంకా యాక్టివ్గా ఉన్నారు. వీరితో పాటు ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అతి కొద్ది మంది సీనియర్ నిర్మాతల్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఒకరు. 1986లో వచ్చిన ‘డ్రైవర్ బాబు’తో మొదలుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినిమాలు నిర్మిస్తున్నారు. పుష్కర కాలం కిందట ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’కి ఆయనే నిర్మాత. మరో ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’లో కూడా ఆయన భాగస్వామి.
ఇంకా ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్.. నాన్నకు ప్రేమతో, ఊసరవల్లి లాంటి పెద్ద చిత్రాలు నిర్మించారు ప్రసాద్. రాజీ లేకుండా సినిమాలు తీస్తారని.. విలువలు పాటిస్తారని ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరుంది.
కానీ ఈ మంచి నిర్మాతకు కొన్నేళ్ల నుంచి అస్సలు కలిసి రావడం లేదు. ఆయన సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. మరీ దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి. ‘తొలి ప్రేమ’, విరూపాక్ష’ సినిమాలు బాగా ఆడినా.. మిగతా చిత్రాలన్నీ తేడా కొట్టాయి. మిస్టర్ మజ్ను, సోలో బ్రతుకే సో బెటర్, రంగ రంగ వైభవంగా, గాండీవధారి అర్జున, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. ఇలా ఐదేళ్ల వ్యవధిలో ఐదు ఫెయిల్యూర్లు చూశారు. వీటిలో ‘గాండీవధారి అర్జున్’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది.
‘అప్పుడో ఇప్పుడో ఎఫ్పుడో’ కూడా వాషౌట్ అయిపోయింది. ఇప్పుడు ‘జాక్’ మీద ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇది అనివార్య కారణాలతో బాగా ఆలస్యం అయింది. బడ్జెట్ పెరిగిపోయింది. తీరా సినిమా రిలీజ్ చేసే సమయానికి హైప్ రాలేదు. సిద్ధు పేరు మీద కాస్త ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ టాక్ బ్యాడ్ కావడంతో రెండో రోజే సినిమా బాగా డౌన్ అయిపోయింది. అసలే డెఫిషిట్లో సినిమాను రిలీజ్ చేశారు. టాక్ బాలేక వసూళ్లు లేవు. దీంతో ప్రసాద్కు ఈ చిత్రం పెద్ద నష్టమే మిగిల్చేలా ఉంది. ఇకపై సినిమాలు తీయడమే కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on April 12, 2025 2:00 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…