Movie News

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది ముందుతరం నిర్మాతలు మాత్రమే ఇంకా యాక్టివ్‌గా ఉన్నారు. వీరితో పాటు ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అతి కొద్ది మంది సీనియర్ నిర్మాతల్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఒకరు. 1986లో వచ్చిన ‘డ్రైవర్ బాబు’తో మొదలుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినిమాలు నిర్మిస్తున్నారు. పుష్కర కాలం కిందట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’కి ఆయనే నిర్మాత. మరో ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’లో కూడా ఆయన భాగస్వామి.

ఇంకా ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్.. నాన్నకు ప్రేమతో, ఊసరవల్లి లాంటి పెద్ద చిత్రాలు నిర్మించారు ప్రసాద్. రాజీ లేకుండా సినిమాలు తీస్తారని.. విలువలు పాటిస్తారని ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరుంది.

కానీ ఈ మంచి నిర్మాతకు కొన్నేళ్ల నుంచి అస్సలు కలిసి రావడం లేదు. ఆయన సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. మరీ దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి. ‘తొలి ప్రేమ’, విరూపాక్ష’ సినిమాలు బాగా ఆడినా.. మిగతా చిత్రాలన్నీ తేడా కొట్టాయి. మిస్టర్ మజ్ను, సోలో బ్రతుకే సో బెటర్, రంగ రంగ వైభవంగా, గాండీవధారి అర్జున, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. ఇలా ఐదేళ్ల వ్యవధిలో ఐదు ఫెయిల్యూర్లు చూశారు. వీటిలో ‘గాండీవధారి అర్జున్’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది.

‘అప్పుడో ఇప్పుడో ఎఫ్పుడో’ కూడా వాషౌట్ అయిపోయింది. ఇప్పుడు ‘జాక్’ మీద ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇది అనివార్య కారణాలతో బాగా ఆలస్యం అయింది. బడ్జెట్ పెరిగిపోయింది. తీరా సినిమా రిలీజ్ చేసే సమయానికి హైప్ రాలేదు. సిద్ధు పేరు మీద కాస్త ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ టాక్ బ్యాడ్ కావడంతో రెండో రోజే సినిమా బాగా డౌన్ అయిపోయింది. అసలే డెఫిషిట్‌లో సినిమాను రిలీజ్ చేశారు. టాక్ బాలేక వసూళ్లు లేవు. దీంతో ప్రసాద్‌కు ఈ చిత్రం పెద్ద నష్టమే మిగిల్చేలా ఉంది. ఇకపై సినిమాలు తీయడమే కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

This post was last modified on April 12, 2025 2:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

44 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago