Movie News

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది ముందుతరం నిర్మాతలు మాత్రమే ఇంకా యాక్టివ్‌గా ఉన్నారు. వీరితో పాటు ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అతి కొద్ది మంది సీనియర్ నిర్మాతల్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఒకరు. 1986లో వచ్చిన ‘డ్రైవర్ బాబు’తో మొదలుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినిమాలు నిర్మిస్తున్నారు. పుష్కర కాలం కిందట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’కి ఆయనే నిర్మాత. మరో ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’లో కూడా ఆయన భాగస్వామి.

ఇంకా ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్.. నాన్నకు ప్రేమతో, ఊసరవల్లి లాంటి పెద్ద చిత్రాలు నిర్మించారు ప్రసాద్. రాజీ లేకుండా సినిమాలు తీస్తారని.. విలువలు పాటిస్తారని ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరుంది.

కానీ ఈ మంచి నిర్మాతకు కొన్నేళ్ల నుంచి అస్సలు కలిసి రావడం లేదు. ఆయన సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. మరీ దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి. ‘తొలి ప్రేమ’, విరూపాక్ష’ సినిమాలు బాగా ఆడినా.. మిగతా చిత్రాలన్నీ తేడా కొట్టాయి. మిస్టర్ మజ్ను, సోలో బ్రతుకే సో బెటర్, రంగ రంగ వైభవంగా, గాండీవధారి అర్జున, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. ఇలా ఐదేళ్ల వ్యవధిలో ఐదు ఫెయిల్యూర్లు చూశారు. వీటిలో ‘గాండీవధారి అర్జున్’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది.

‘అప్పుడో ఇప్పుడో ఎఫ్పుడో’ కూడా వాషౌట్ అయిపోయింది. ఇప్పుడు ‘జాక్’ మీద ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇది అనివార్య కారణాలతో బాగా ఆలస్యం అయింది. బడ్జెట్ పెరిగిపోయింది. తీరా సినిమా రిలీజ్ చేసే సమయానికి హైప్ రాలేదు. సిద్ధు పేరు మీద కాస్త ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ టాక్ బ్యాడ్ కావడంతో రెండో రోజే సినిమా బాగా డౌన్ అయిపోయింది. అసలే డెఫిషిట్‌లో సినిమాను రిలీజ్ చేశారు. టాక్ బాలేక వసూళ్లు లేవు. దీంతో ప్రసాద్‌కు ఈ చిత్రం పెద్ద నష్టమే మిగిల్చేలా ఉంది. ఇకపై సినిమాలు తీయడమే కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

This post was last modified on April 12, 2025 2:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

36 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago