లాక్ డౌన్ టైంలో చాలా వరకు పెళ్లిళ్లు సింపుల్గానే జరుగుతున్నాయి. సెలబ్రెటీలు కూడా హడావుడి, జన సందోహాన్ని నివారించి మామూలుగానే పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నారు. ఐతే కరోనాను రాను రాను జనాలు తేలిగ్గా తీసుకుంటుండటం, ప్రభుత్వం కూడా మరీ కఠినంగా వ్యవహరించకపోవడంతో ఈ మధ్య పెళ్లిళ్లలో సందడి బాగానే ఉంటోంది. ఇలాంటి తరుణంలోనే బహు భాషల్లో స్టార్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది.
ఎన్నో ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ఆమె మూడు ముళ్లు వేయించుకుంది. పెళ్లి జరిగిన కొన్ని నిమిషాలకే అంత క్లారిటీ లేని ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. సమయం గడిచేకొద్దీ మరింత స్పష్టత ఉన్న ఫొటోలు అధికారికంగా బయటికి వచ్చాయి. చూడముచ్చటగా ఉన్న ఈ ఫొటోలు కాజల్ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
ఐతే తెలుగులోనే అత్యధికంగా సినిమాలు చేసి ఇక్కడే ఎక్కువ ఆదరణ సంపాదించుకున్న కాజల్.. ఇక్కడి జనాలతో మరీ అంత అటాచ్డ్ కాదు అన్నట్లుగా ఉండేది. కానీ పెళ్లి సందర్భంగా మాత్రం ఆమె తెలుగు వాళ్ల మనసు దోచేసింది. తెలుగు వారికే సొంతమైన జీలకర్ర-బెల్లం సంప్రదాయాన్ని కాజల్, గౌతమ్ పాటించడం విశేషం. సంబంధిత ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వధూవరులు ఒకరి నెత్తిన ఒకరు చేతులు పెట్టి జీలకర్ర-బెల్లం తంతును నిర్వహిస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
వధూవరుల డ్రెస్సింగ్ దగ్గర్నుంచి, మిగతా వ్యవహారమంతా ఉత్తరాది సంప్రదాయల ప్రకారమే జరిగినట్లుంది. కానీ తెలుగు ప్రేక్షకులతో ఉన్న అనుబంధం మూలంగానో ఏమో.. కాజల్ జీలకర్ర-బెల్లం సంప్రదాయం పాటించిందేమో అని భావిస్తున్నారు. ఇదే నిజమైతే మన సంప్రదాయాన్ని ఇలా గౌరవించినందుకు కాజల్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
This post was last modified on November 1, 2020 2:09 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…