హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. తెలుగులో భారీ చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తూ, ఘనవిజయాలు అందుకుంటూ పెద్ద రేంజికి వెళ్లిన మైత్రీ.. ఆల్రెడీ మలయాళంలో టొవినో థామస్ హీరోగా ‘ఏఆర్ఎం’ అనే బిగ్ బడ్జెట్ మూవీతో సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఒకేసారి మైత్రీ.. హిందీ, తమిళంలో అడుగు పెట్టింది. ఆ సంస్థ హిందీలో నిర్మించిన చిత్రం ‘జాట్’.. తమిళంలో ప్రొడ్యూస్ చేసిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఒకే రోజు విడుదల కావడం విశేషం. గురువారం భారీ అంచనాల మధ్య ఈ మూవీస్ ప్రేక్షకులను పలకరించాయి. రెంటికీ భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తొలి రోజు ప్యాక్డ్ హౌస్లతో నడిచింది.
కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. ఫుల్ రన్లో అనేక రికార్డులనూ బద్దలు కొట్టేలా ఉంది. ఇక ‘జాట్’ కూడా తొలి రోజు థియేటర్లు కళకళలాడించింది. మాస్ సర్క్యూట్లలో ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ రెండు చిత్రాలకూ భారీగా బిజినెస్ జరిగింది. మైత్రీ సంస్థకు మంచి లాభాలూ వచ్చాయి. కానీ వసూళ్ల పరంగా ఢోకా లేకపోయినప్పటికీ.. కంటెంట్ విషయంలో మాత్రం విమర్శలు తప్పట్లేదు.
ఇవి రెండూ రొటీన్ మాస్ మసాలా సినిమాలే. ప్రధానంగా హీరో ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్సుల మీదే దృష్టిపెట్టారు. అంతకుమించి కథాకథనాలను పెద్దగా పట్టించుకోలేదు. కమర్షియల్గా ఈ సినిమాలు సక్సెస్ అనిపించుకున్నా.. కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచిపోతారని.. కంటెంట్ పరంగా మైత్రీ సాధారణమైన సినిమాలే తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రాలతో డబ్బులు వచ్చినా మైత్రీ పేరు చెడడం ఖాయమని అంటున్నారు.
This post was last modified on April 12, 2025 10:29 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…