హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. తెలుగులో భారీ చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తూ, ఘనవిజయాలు అందుకుంటూ పెద్ద రేంజికి వెళ్లిన మైత్రీ.. ఆల్రెడీ మలయాళంలో టొవినో థామస్ హీరోగా ‘ఏఆర్ఎం’ అనే బిగ్ బడ్జెట్ మూవీతో సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఒకేసారి మైత్రీ.. హిందీ, తమిళంలో అడుగు పెట్టింది. ఆ సంస్థ హిందీలో నిర్మించిన చిత్రం ‘జాట్’.. తమిళంలో ప్రొడ్యూస్ చేసిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఒకే రోజు విడుదల కావడం విశేషం. గురువారం భారీ అంచనాల మధ్య ఈ మూవీస్ ప్రేక్షకులను పలకరించాయి. రెంటికీ భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తొలి రోజు ప్యాక్డ్ హౌస్లతో నడిచింది.
కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. ఫుల్ రన్లో అనేక రికార్డులనూ బద్దలు కొట్టేలా ఉంది. ఇక ‘జాట్’ కూడా తొలి రోజు థియేటర్లు కళకళలాడించింది. మాస్ సర్క్యూట్లలో ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ రెండు చిత్రాలకూ భారీగా బిజినెస్ జరిగింది. మైత్రీ సంస్థకు మంచి లాభాలూ వచ్చాయి. కానీ వసూళ్ల పరంగా ఢోకా లేకపోయినప్పటికీ.. కంటెంట్ విషయంలో మాత్రం విమర్శలు తప్పట్లేదు.
ఇవి రెండూ రొటీన్ మాస్ మసాలా సినిమాలే. ప్రధానంగా హీరో ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్సుల మీదే దృష్టిపెట్టారు. అంతకుమించి కథాకథనాలను పెద్దగా పట్టించుకోలేదు. కమర్షియల్గా ఈ సినిమాలు సక్సెస్ అనిపించుకున్నా.. కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచిపోతారని.. కంటెంట్ పరంగా మైత్రీ సాధారణమైన సినిమాలే తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రాలతో డబ్బులు వచ్చినా మైత్రీ పేరు చెడడం ఖాయమని అంటున్నారు.
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…