Movie News

మైత్రీకి డబ్బులొచ్చాయ్.. పేరు చెడుతోంది

హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. తెలుగులో భారీ చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తూ, ఘనవిజయాలు అందుకుంటూ పెద్ద రేంజికి వెళ్లిన మైత్రీ.. ఆల్రెడీ మలయాళంలో టొవినో థామస్ హీరోగా ‘ఏఆర్ఎం’ అనే బిగ్ బడ్జెట్ మూవీతో సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఒకేసారి మైత్రీ.. హిందీ, తమిళంలో అడుగు పెట్టింది. ఆ సంస్థ హిందీలో నిర్మించిన చిత్రం ‘జాట్’.. తమిళంలో ప్రొడ్యూస్ చేసిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఒకే రోజు విడుదల కావడం విశేషం. గురువారం భారీ అంచనాల మధ్య ఈ మూవీస్ ప్రేక్షకులను పలకరించాయి. రెంటికీ భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తొలి రోజు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది.

కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. ఫుల్ రన్లో అనేక రికార్డులనూ బద్దలు కొట్టేలా ఉంది. ఇక ‘జాట్’ కూడా తొలి రోజు థియేటర్లు కళకళలాడించింది. మాస్ సర్క్యూట్లలో ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ రెండు చిత్రాలకూ భారీగా బిజినెస్ జరిగింది. మైత్రీ సంస్థకు మంచి లాభాలూ వచ్చాయి. కానీ వసూళ్ల పరంగా ఢోకా లేకపోయినప్పటికీ.. కంటెంట్ విషయంలో మాత్రం విమర్శలు తప్పట్లేదు.

ఇవి రెండూ రొటీన్ మాస్ మసాలా సినిమాలే. ప్రధానంగా హీరో ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్సుల మీదే దృష్టిపెట్టారు. అంతకుమించి కథాకథనాలను పెద్దగా పట్టించుకోలేదు. కమర్షియల్‌గా ఈ సినిమాలు సక్సెస్ అనిపించుకున్నా.. కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచిపోతారని.. కంటెంట్ పరంగా మైత్రీ సాధారణమైన సినిమాలే తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రాలతో డబ్బులు వచ్చినా మైత్రీ పేరు చెడడం ఖాయమని అంటున్నారు.

This post was last modified on April 12, 2025 10:29 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖలు చేసిన అంబటి రాంబాబును, గుంటూరులోని తన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత…

1 minute ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

7 minutes ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

2 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

3 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

3 hours ago

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…

4 hours ago