అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ అయిన అట్లీ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. అట్లీ ఇప్పటిదాకా తీసిన సినిమాలను దృష్టిలో ఉంచుకుని ఇది మామూలు మాస్ సినిమానే అనుకుంటూ వచ్చారు ఇన్నాళ్లూ. కానీ ఈసారి అట్లీ అంతర్జాతీయ స్థాయిలో సైఫై థ్రిల్లర్ తీయబోతున్నాడని నిన్నటి వీడియో చూస్తే అర్థమైంది. దీని బడ్జెట్, స్పాన్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. ఇండియన్ సినిమాల మీద వంద కోట్ల బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అనుకునే రోజుల్లో ‘రోబో’ మీద ఏకంగా రూ.200 కోట్ల దాకా ఖర్చు పెట్టిన నిర్మాణ సంస్థ అది.
కంటెంట్ను బట్టి ఎంతైనా బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది సన్ పిక్చర్స్. ఈ నేపథ్యంలో సన్ పిక్చర్స్ బన్నీ-అట్లీ ప్రాజెక్టు మీద 700 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం.
ఈ బడ్జెట్లో రూ.300 కోట్ల దాకా హీరో, డైరెక్టర్ పారితోషకాలకే కేటాయించబోతున్నారట. ‘పుష్ప-2’ చిత్రానికి ఏకంగా రూ.159 కోట్ల పారితోషకంతో రికార్డు సృష్టించాడు బన్నీ. ఇప్పుడు అట్లీ సినిమాకు దాన్ని మించి, ఏకంగా రూ.200 కోట్ల దాాకా రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడట బన్నీ. అట్లీ వాటా రూ.100 కోట్ల పైమాటే అని సమాచారం. ఇక మిగతా పారితోషకాలకు ఎంత కాదన్నా రూ.50 కోట్ల దాకా అవుతుంది.
ఓ ఇండియన్ సినిమాలో కేవలం రెమ్యూనరేషన్లకే రూ.350 కోట్లు వెచ్చించడం అంటే అసామాన్యమైన విషయం. హాలీవుడ్ వీఎఫెక్స్ స్టూడియోలు, టెక్నీషియన్లు భాగమవతుున్న ఈ సినిమాకు ప్రొడక్షన్ ఖర్చు రూ.350-400 కోట్ల దాకా అయ్యే అవకాశముంది. ఐతే ‘పుష్ప-2’ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడం, అట్లీకి కూడా సూపర్ సక్సెస్ రికార్డు ఉండడంతో బడ్జెట్ వర్కవుట్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఈజీగా ఈ మూవీకి రూ.వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రామాయణం చిత్రాన్ని రికార్డు స్థాయిలో రూ.800 కోట్లకు పైగా బడ్జెట్లో రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తుండగా.. బన్నీ-అట్లీ మూవీ రెండో స్థానంలో నిలవనుంది.
This post was last modified on April 11, 2025 9:35 am
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…