థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ మొదటి ఆప్షన్ గా ఉండేవి కానీ ఇప్పుడా స్థానాన్ని ఓటిటిలు తీసేసుకున్నాయి. అందుకే శుక్రవారం వచ్చినప్పుడల్లా కొత్త కంటెంట్ ఏం వచ్చిందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఏప్రిల్ 11 వాళ్లకు డబుల్ ట్రిపుల్ ధమాకా కానుంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా నాని నిర్మించిన ‘కోర్ట్’ అన్ని భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై సర్ప్రైజ్ సూపర్ హిట్ అనిపించుకున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామా డిజిటల్ లోనూ అంతే సంచలనం సృష్టిస్తుందనే నమ్మకం నాని టీమ్ లో ఉంది.
పుష్ప 2 తర్వాత అంత పెద్ద సక్సెస్ సాధించిన ప్యాన్ ఇండియా మూవీగా నిలిచిన ‘ఛావా’ ఇదే నెట్ ఫ్లిక్స్ లో రానుంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఈ శంభాజీ మహారాజ్ బయోపిక్ కి ఉత్తరాది జనాలు బ్రహ్మరథం పట్టారు. మిస్ చేసుకున్న వాళ్ళు నిక్షేపంగా బుల్లితెరపై చూసుకుంటారు. ఇదే ప్లాట్ ఫార్మ్ లో వైభవ్ నటించిన కామెడీ చిత్రం ‘పేరసు’ని తెలుగు ఆడియోతో పాటు స్ట్రీమింగ్ చేయబోతున్నాడు. కోలీవుడ్ లో దీనికి మంచి హిట్టు దక్కింది. రెండు రోజుల గ్యాప్ తో జివి ప్రకాష్ నటించిన ‘కింగ్స్టన్’ని జీ5 వేదికగా తీసుకొస్తున్నారు. ఇదొకటి ఉందనే సంగతే చాలా మందికి తెలియదు కాబట్టి వ్యూస్ రావొచ్చు.
ఆది సాయికుమార్ నటించిన ఫాంటసీ థ్రిల్లర్ ‘షణ్ముఖ’ ఆహాలో వస్తోంది. సంచలనం సృష్టించిన మొదటి భాగానికి కొనసాగింపుగా అమెజాన్ ప్రైమ్ లో ‘చోరీ 2’ తెస్తున్నారు. థియేట్రికల్ గా విజయవంతమైన సినిమాకు ఓటిటి కొనసాగింపు రావడం విచిత్రం. మొత్తానికి ఒళ్ళు కాళ్ళు కదపకుండా ఇంట్లోనే కాలక్షేపానికి లోటు లేకుండా ఇన్నేసి సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ ‘టుక్ టుక్’ లాంటివి అందుబాటులోకి వచ్చేశాయి కూడా. థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ తగ్గిపోవడం పట్ల బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇవన్నీ 28 నుంచి 50 రోజుల మధ్యలో నిడివి పెట్టుకున్నవి కావడం గమనార్షం.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…