యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే జరిగిన రియాలిటీ షోలో ఒక స్కిట్ చేశాడు. సీనియర్ హీరోయిన్ రంభ అతిథిగా వచ్చిన ఎపిసోడ్ అది. ఆమె ఎంట్రీ స్పెషల్ గా ఉండాలనే ఉద్దేశంతో 1998లో వచ్చిన బావగారు బాగున్నారా ఇంటర్వెల్ సీన్ ని రీ క్రియేట్ చేశారు. నంది కొమ్ముల మధ్యలో నుంచి సుధీర్ చూస్తుండగా రంభ దర్శనం ఇవ్వడం ఈ సన్నివేశం. ఒక్క మాట మార్చకుండా యాజిటీజ్ గా దింపేశారు. ఇక్కడే ఊహించని విధంగా కాంట్రావర్సి మొదలయ్యింది.
హిందువుల మనోభావాలు దెబ్బ తీశారంటూ సుధీర్ మీద భగ్గుమంటూ పలు సంఘాలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి చిరంజీవి చేసినప్పుడు రాని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చిదంటే ఆ టైంలో ఇంటర్ నెట్, సోషల్ మీడియా గట్రాలు లేవు కనక. పైగా మెగాస్టార్ చేస్తే ఎబ్బెట్టుగా అనిపించలేదు కానీ కామెడీ స్కిట్లు చేసే సుధీర్ చేసేసరికి నెగటివ్ ఫీలింగ్ వచ్చేసింది. రంభకు స్వాగతం ఇవ్వడం కోసమే అలా రాసుకున్నప్పటికీ ఇలా వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సీన్ ని ఒరిజినల్ గా రాసింది పరుచూరి బ్రదర్స్ కాగా జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు.
ఇక్కడ మరో విషయం గమనించాలి. బావగారు బాగున్నారా కథ ప్రకారం విశ్రాంతికి చిరంజీవి రంభ కలుసుకునే ఎపిసోడ్ శివుడి గుళ్లో జరుగుతుంది. సందర్భానికి తగ్గట్టు ఒకరినొకరు చూసి షాక్ అయ్యే క్రమంలో నంది విగ్రహాన్ని వాడుకున్నారు. సింక్ కుదిరిపోయింది కాబట్టి తప్పనిపించలేదు. లేదంటే అల్లుడా మజాకా తరహాలో నిరసనలు వ్యక్తమయ్యేవి. కానీ సుడిగాలి సుధీర్ చేసింది ఖచ్చితంగా అవసరమైనది కాకపోవడంతో కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఇకపై పాత సినిమాలును వాడుకునే విషయంలో దర్శక రచయతలు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలాంటి సున్నిత పరిస్థితులను ఎదురుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on April 9, 2025 6:42 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…