యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే జరిగిన రియాలిటీ షోలో ఒక స్కిట్ చేశాడు. సీనియర్ హీరోయిన్ రంభ అతిథిగా వచ్చిన ఎపిసోడ్ అది. ఆమె ఎంట్రీ స్పెషల్ గా ఉండాలనే ఉద్దేశంతో 1998లో వచ్చిన బావగారు బాగున్నారా ఇంటర్వెల్ సీన్ ని రీ క్రియేట్ చేశారు. నంది కొమ్ముల మధ్యలో నుంచి సుధీర్ చూస్తుండగా రంభ దర్శనం ఇవ్వడం ఈ సన్నివేశం. ఒక్క మాట మార్చకుండా యాజిటీజ్ గా దింపేశారు. ఇక్కడే ఊహించని విధంగా కాంట్రావర్సి మొదలయ్యింది.
హిందువుల మనోభావాలు దెబ్బ తీశారంటూ సుధీర్ మీద భగ్గుమంటూ పలు సంఘాలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి చిరంజీవి చేసినప్పుడు రాని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చిదంటే ఆ టైంలో ఇంటర్ నెట్, సోషల్ మీడియా గట్రాలు లేవు కనక. పైగా మెగాస్టార్ చేస్తే ఎబ్బెట్టుగా అనిపించలేదు కానీ కామెడీ స్కిట్లు చేసే సుధీర్ చేసేసరికి నెగటివ్ ఫీలింగ్ వచ్చేసింది. రంభకు స్వాగతం ఇవ్వడం కోసమే అలా రాసుకున్నప్పటికీ ఇలా వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సీన్ ని ఒరిజినల్ గా రాసింది పరుచూరి బ్రదర్స్ కాగా జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు.
ఇక్కడ మరో విషయం గమనించాలి. బావగారు బాగున్నారా కథ ప్రకారం విశ్రాంతికి చిరంజీవి రంభ కలుసుకునే ఎపిసోడ్ శివుడి గుళ్లో జరుగుతుంది. సందర్భానికి తగ్గట్టు ఒకరినొకరు చూసి షాక్ అయ్యే క్రమంలో నంది విగ్రహాన్ని వాడుకున్నారు. సింక్ కుదిరిపోయింది కాబట్టి తప్పనిపించలేదు. లేదంటే అల్లుడా మజాకా తరహాలో నిరసనలు వ్యక్తమయ్యేవి. కానీ సుడిగాలి సుధీర్ చేసింది ఖచ్చితంగా అవసరమైనది కాకపోవడంతో కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఇకపై పాత సినిమాలును వాడుకునే విషయంలో దర్శక రచయతలు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలాంటి సున్నిత పరిస్థితులను ఎదురుకోవాల్సి ఉంటుంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…