స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు ప్రాణం లేచొస్తుంది. ముఖ్యంగా టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, లిరికల్ సాంగ్స్, రిలీజ్ డేట్ విషయంలో ఆ ఉద్వేగాన్ని మాటల్లో కొలవడం కష్టం. ఒక్కోసారి ఇది నిర్మాతల పాలిట ఒత్తిడిగా మారిపోయి పబ్లిక్ స్టేజి మీద దీని గురించి మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా దిల్ రాజు, నాగవంశీ, యువి క్రియేషన్స్ లాంటి సంస్థలు, ప్రొడ్యూసర్లు వీటి వల్ల బాగా ప్రభావితం చెందారు. అప్డేట్ వస్తోందంటే ఆ సమయానికి పనులు మానుకుని ఆన్ లైన్లో ఎదురు చూసే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే నిన్న ఎన్టీఆర్ నీల్ తాలూకు అప్డేట్ ఒకటి ఇవాళ మధ్యాన్నం ఇస్తామని నిర్మాణ సంస్థలు సోషల్ మీడియాలో పేర్కొన్నాయి. దీంతో ఏదో పెద్ద విశేషం ఉంటుందని మూవీ లవర్స్ తో పాటు ఫ్యాన్స్ ఎదురు చూశారు. తీరా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి సెట్లో అడుగు పెట్టబోతున్నాడని చల్లని కబురు చెప్పారు. నిజానికి హీరో షూటింగ్ లో పాల్గొనడం విశేషం కాదు. ఇది అందరూ చేసేదే. అదేదో ప్రత్యేకంగా ఊరించి ఊరించి సమయం సందర్భం పెట్టుకుని పంచుకునేది అస్సలు కాదు. డైరెక్ట్ గా ఫలానా రోజు వస్తున్నాడని చెప్పినా సరిపోతుంది. ఇంత హంగామా అవసరం లేదు.
ఇదొక్కటే కాదు గతంలో ఫలానా టైంకి ఫలానా డేట్ లో అప్డేట్స్ ఇస్తామని వాయిదాలు వేసి ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ నీల్ బృందం చేసింది అంత సీరియస్ గా కాకపోయినా ఒక ప్యాన్ ఇండియా మూవీ మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ నెలకొన్నప్పుడు ఎక్స్, ఇన్స్ టాలో షేర్ చేసేది స్పెషల్ అయ్యుండాలి. అంతే తప్ప హీరో వచ్చాడు, షెడ్యూల్ అయిపోయిందని చెప్పడం కాదు. వీటి సంగతలా ఉంచితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 9 విడుదలవుతుందనే ప్రచారం పట్ల టీమ్ స్పందించడం లేదు. నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పట్లో చెప్పకపోవచ్చని టాక్.
This post was last modified on April 9, 2025 3:25 pm
కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను…
పైన హెడ్డింగ్ చదవగానే అరే మిస్సయ్యామే అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అలాంటిదే అభిమానులు ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్,…
ఉమ్మడి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు..…
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్యపై సీఎం…
ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…
విజయవాడ ప్రస్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివనాథ్), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములు. రాజకీయంగా వైరం లేకపోయినా..…