ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్తో వీడియో వచ్చింది. ఈ వీడియోతో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఐతే ‘పుష్ప-2’ తర్వాత బన్నీ చేయాలనుకున్న సినిమా ఇది కాదు. దీని కంటే ముందు త్రివిక్రమ్ ప్రాజెక్టును ఓకే చేశాడు. దాన్నే ముందు మొదలుపెట్టాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా అట్లీ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి అన్నీ వేగంగా ముందుకు కదిలాయి. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి కూడా వెళ్లబోతోంది.
అట్లీతో బన్నీ సినిమా అన్నపుడు పెద్దగా ఎగ్జైట్ కాని వాళ్లలో కూడా ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమో వీడియో క్యూరియాసిటీ పెంచింది. ఈ ప్రాజెక్టుకు కావాల్సినంత హైప్ వచ్చేసింది. ఐతే ఎప్పట్నుంచో అభిమానులు ఎంతో ఊహించుకుంటున్న త్రివిక్రమ్ ప్రాజెక్టు సంగతి ఇప్పుడు డోలాయమానంలో పడిపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. బన్నీ.. అట్లీ మూవీతో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా చేస్తాడనే కొంత కాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఐతే ఇప్పటిదాకా ఆ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసింది లేదు. బన్నీ వాసు, నాగవంశీ లాంటి వాళ్లు వేర్వేరు సందర్భాల్లో సినిమాకు బాగానే హైప్ ఇచ్చారు కానీ.. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఎంతకీ రావట్లేదు.
అట్లీ సినిమా నుంచి రిలీజ్ చేసినట్లు వీడియో ప్రోమో లేకపోయినా.. కనీసం బన్నీ పుట్టిన రోజుకు ఒక మంచి అప్డేట్ అయినా రిలీజ్ చేస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పటికే నిర్మాత నాగవంశి సినిమా మొదలవ్వడానికి కొంచం సమయం పడుతుంది అని పలు సందర్భాల్లో చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఒక సాధారణ పోస్టర్ తో సరిపెట్టారు. ఇక ఫ్యాన్స్ ఎలాంటి అప్డేట్స్ ఆశించకుండా… అట్లీ బన్నీ అనౌన్స్మెంట్ వీడియో తో సరిపెట్టుకోవాలని కామెంట్లు మొదలయ్యాయి.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…