పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్యాన్ ఇండియా మూవీ అట్లీ చేతికొచ్చిందనే వార్త నెలల క్రితమే లీకైనప్పటికీ అది ఏ జానరనే అనుమానం అలాగే ఉండిపోయింది. దానికి ఇవాళ బన్నీ పుట్టినరోజు సందర్భంగా చెక్ పెట్టేశారు. రెండున్నర నిమిషాల ప్రత్యేక వీడియో చేయించి కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందో చూచాయగా చెప్పేశారు. నిర్మాత కళానిధి మారన్ ను అల్లు అర్జున్, అట్లీ ఇద్దరు కలిశాక పరస్పరం కరచాలనం చేసుకుని, ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయి పలు విఎఫెక్స్ స్టూడియోలకు వెళ్లి, అక్కడి నిపుణులకు కథ వినిపించి, ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలో వివరించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే షాట్స్ అన్నీ పొందుపరిచారు.
అల్లు అర్జున్ మీద ట్రయిల్ విఎఫెక్స్ తాలూకు ఫుటేజ్, ఎక్స్ ప్రెషన్లకు సంబంధించిన కొన్ని షాట్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. మొత్తానికి సైన్స్ ఫిక్షన్ తో పాటు చిత్ర విచిత్ర రాకాసి జీవాలు, జంతువులు ఇందులో భాగం కానున్నాయనే క్లూ అయితే వచ్చింది. క్యాస్టింగ్, సాంకేతిక నిపుణులు తదితర వివరాలు పొందుపరచలేదు కానీ స్క్రిప్ట్ ఎంత ఎగ్జైటింగ్ అనిపించిందో ఫారిన్ టెక్నీషియన్లతో చెప్పించడం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది సాయి అభ్యంకర్ అయినా అతని పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు. ఏదైనా స్పెషల్ అప్డేట్ లో రివీల్ చేస్తారేమో చూడాలి. కంటెంట్ అయితే ఆకట్టుకునేలా ఉంది.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఏఏ 22 దర్శకుడు అట్లీకి ఆరో సినిమా. బడ్జెట్ పరంగా ఇదే అతి పెద్దది. చెన్నై టాక్ ప్రకారం బన్నీకి రెండు వందల కోట్లు, అట్లీకి వంద కోట్లు రెమ్యునరేషన్ రూపంలోనే సగం ఖర్చవుతోందట. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలని ప్రయత్నించిన అట్లీ అంత బడ్జెట్ తట్టుకునే మార్కెట్ కండల వీరుడుకి లేకపోవడంతో యునానిమస్ ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్న బన్నీకి షిఫ్ట్ అయిపోయాడు. 2026లో విడుదలయ్యే అవకాశమున్న ఈ విజువల్ వండర్ లో అంతర్జాతీయ నిపుణులతో పాటు వివిధ బాషల నుంచి క్రేజీ నటీనటులు భాగం కాబోతున్నారు.
This post was last modified on April 8, 2025 11:19 am
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…
తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…
మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…
దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘ…