ఇండియాలో అత్యంత విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్న ఫిలిం సెలబ్రెటీల్లో ముందు వరుసలో ఉండే పేరు షారుఖ్ ఖాన్దే. ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఇంద్ర భవనాన్ని తలపించేలా భారీ భవంతిని కట్టుకున్నాడు షారుఖ్. దానికి ‘మన్నత్’ అని పేరు పెట్టుకున్నాడు. కొన్నేళ్ల కిందటే దాని విలువ రూ.200 కోట్లుగా రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేశారంటే అదెంత విలాసవంతంగా, భారీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అప్పుడప్పుడూ షారుఖ్ భార్యా పిల్లలతో ఇంటి లోపల తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతుంటే నోరెళ్లబెట్టి చూస్తుంటారు అభిమానులు. ఎదురుగా సముద్రం కనిపించేలా షారుఖ్ కట్టుకున్న ఈ ఇంటిని బయటి నుంచి చూసేందుకే వేలాదిగా అభిమానులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా షారుఖ్ పుట్టిన రోజు అయిన నవంబరు 2న ‘మన్నత్’ ఉన్న రోడ్డులో ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు.
ఐతే వాళ్లందరినీ ఈసారి తన ఇంటిలోకి తీసుకెళ్లాలని షారుఖ్ నిర్ణయించుకున్నాడు. మరి వేలాది మంది అభిమానులు ఇంటి లోపలికి వెళ్తే ఇల్లు గుల్లయిపోదూ అనే సందేహం కలగొచ్చు. ఐతే ఇక్కడే ఓ మతలబు ఉంది. షారుఖ్ ఇంట్లోకి అడుగు పెట్టకుండానే ఆ ఇంట్లో ఉన్న అనుభూతిని అభిమానులు పొందేలా షారుఖ్ ఓ ఏర్పాటు చేస్తున్నాడు. తన ‘మన్నత్’లో అడుగడుగూ తిరుగుతూ అతను వర్చువల్ రియాలిటీ వీడియోను సిద్ధం చేస్తున్నాడు. దాన్ని తన పుట్టిన రోజు నాడు అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటాడు.
వీఆర్ ఎక్విప్మెంట్ పెట్టుకుని ఆ వీడియో చూస్తే షారుఖ్ ఇంటిలోకి వెళ్లి అంతా చూస్తున్న అనుభూతి కలుగుతుంది అభిమానులకు. ఈ విషయం తెలిసి షారుఖ్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇటీవల ట్విట్టర్లో అభిమానులతో షారుక్ ముచ్చటించినపుడు.. ఒక వ్యక్తి ‘మన్నత్’ను అమ్మే ఉద్దేశాలేమైనా ఉన్నాయా అని అడిగితే.. ‘మన్నత్’ అంటే ప్రార్థనకు సంబంధిందని.. దాన్నెవరైనా అమ్ముతారా అని ప్రశ్నించాడు షారుఖ్. ఇక ఈ పుట్టిన రోజు నాడు తన కొత్త సినిమాల ప్రకటన కూడా షారుఖ్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
This post was last modified on November 1, 2020 7:13 am
వీవీఐపీలు…ప్రత్యేకించి ముఖ్యమంత్రుల కాన్వాయ్ లు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అనుకోని కారణాల వల్ల సీఎం వెళ్లడం కాస్తంత…
తమిళనాడు రాజకీయం రంజుగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనన్ని ట్విస్టులు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు కారణం నిన్నటిదాకా అక్కడ ఉన్నవి…
దేశంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పరాజయం…
అవును.. దళపతి విజయ్ ఏడ్చేశాడు. అవేమీ తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు వచ్చిన ఆనంద భాష్పాలు కావు. తన…
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…