పెద్దగా అంచనాలు లేకుండా కేవలం పదహారు కోట్లతో రూపొంది మూడు వందల కోట్లకు పైగా సాధించిన బ్లాక్ బస్టర్ గా కాంతార గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటిదాకా శాండల్ వుడ్ తప్ప బయట ప్రపంచానికి అంతగా పరిచయం లేని హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి పేరు ప్యాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోయింది. దాంతో కాంతర సీక్వెల్ ని చాఫ్టర్ 1 పేరుతో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. పంజుర్లి గ్రామ దేవత నేపథ్యంలో రూపొందిన ఈ డివోషనల్ డ్రామాలో చూపించిన ఘట్టాలు రిషబ్ స్వంత ఊరితో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో అతనికో షాక్ తగిలింది.
ఇటీవలే రిషబ్ శెట్టి మంగళూరులోని పంజుర్లి దేవస్థానాన్ని సందర్శించాడు. ప్రతి సంవత్సరం ప్రత్యేక దినాన ఉదయం పదకొండు నుంచి మరుసటి రోజు తెల్లవారుఝాము నాలుగు గంటల దాకా జరిగే వేడుకలో భాగం పంచుకున్నాడు. ఇది కద్రి బరిబైల్ అనే ప్రాంతంలో జరుగుతుంది. పండగ చివరిలో రిషబ్ తో పంజుర్లి పూనిన పూజారి మాట్లాడుతూ నీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారని, భారీ కుట్రకు తెర తీశారని, నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా కాపాడతాడని రక్షణ హామీ ఇచ్చాడు. వారాహి పంజుర్లి నోటి వెంట వచ్చిన ఈ వాక్కులు విని అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
నిజానికి రిషబ్ కాంతార పార్ట్ 1 తీస్తున్న క్రమంలో చాలా సమస్యలు ఎదురుకున్నాడు. బెంగళూరు దగ్గర్లోని షూటింగ్ ప్రాంతంలో పర్యావరణానికి హానీ కలిగిస్తున్నారని స్వయంగా అటవీ శాఖా మంత్రి చర్యలకు పూనుకోవడం సంచలనం రేపింది. చిత్రీకరణ సమయంలో ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు వాడారని ప్రభుత్వానికి కంప్లయింట్స్ వచ్చాయి. ఒక వాహన ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇవన్నీ టీమ్ కి తలనెప్పిగా మారాయి. అక్టోబర్ 2 విడుదల ప్లాన్ చేసుకున్న కాంతార చాప్టర్ 1 అనుకున్న సమయానికి విడుదల చేయాలనే లక్ష్యంతో రిషబ్ శెట్టి చాలా కష్టపడుతున్నాడు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…