నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అమిగోస్, డెవిల్ సినిమాలు నిరాశపరిచాక.. బాగా టైం తీసుకుని ఈ మూవీ చేశాడు ఈ నందమూరి హీరో. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రూపొందించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొన్ని వారాల ముందు వరకు ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు కానీ.. టీజర్ రిలీజయ్యాక ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఇప్పుడు మంచి అంచనాల మధ్య సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్.. ఇంకా హైప్ పెంచే స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇందులో 20 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని.. ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ రాలేదని అతను ఘంటాపథంగా చెప్పాడు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో మేజర్ హైలైట్ ఏంటి యాంకర్ సుమ అడగ్గా.. ఇప్పుడీ మాట చెప్పొచ్చో లేదో.. ఈ స్టేట్మెంట్ ఇస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారో ఏమో తెలియదు. కానీ సినిమాలో చివరి 20 నిమిషాలు హైలైట్గా ఉంటుంది. ఇలాంటి క్లైమాక్స్ మన ఇండస్ట్రీలో ఇంత వరకు రాలేదని కచ్చితంగా చెప్పగలను.
ఇలాంటి సన్నివేశాలు మీరు ఇప్పటిదాకా చూసి ఉండరు. క్లైమాక్స్ చూశాక ప్రేక్షకులు కదిలిపోతారు. తల్లిని ప్రేమించే ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నేను ఇంత వరకు ఇలాంటి కథ చేయలేదు అని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో విజయశాంతి నటించిన సంగతి తెలిసిందే. ఆమెది పోలీసాఫీసర్ పాత్ర. కొడుకు చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తుంటే.. అతణ్ని పట్టుకోవడానికి ప్రయత్నించే పాత్ర తనది. ఈ కాన్ఫ్లిక్ట్ పాయింటే సినిమాలో హైలైట్గా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నటించింది.
This post was last modified on April 6, 2025 11:26 pm
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…