కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా మిగిలిపోవాలనే తాపత్రయం వేరే రాష్ట్రాలకు అంటుకుంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ విడుదల సమయంలో 256 అడుగుల కటవుట్ ని విజయవాడలో ఏర్పాటు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియాలోనే అత్యంత పొడవైనదిగా కొత్త మైలురాయి నమోదు చేసుకుంది. అంతకు ముందు సలార్ (236), కెజిఎఫ్ 2 (216), ఎన్జికె (215), విశ్వాసం (185) తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సరే లేనిది మాకేనా అని అజిత్ ఫ్యాన్స్ అనుకున్నారేమో వెంటనే గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం రెడీ అయిపోయారు.
ఏకంగా 285 అడుగుల కటవుట్ ని రెడీ చేసి తమిళనాడు తెంకాశిలోని ఒక థియేటర్ కు ప్రతిష్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మెటల్ ఫెన్సింగ్ తో గ్రిల్స్ ఏర్పాటు చేసి ఒక్కో భాగాన్ని పెడుతూ వెళ్లారు. అజిత్ తల సెట్ అయిన కాసేపటి తర్వాత క్రమంగా అది కూలిపోయే దిశగా ఉండటం గమనించిన జనం వెంటనే అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి తప్పుకున్నారు. చూస్తుండగానే మొత్తం హాలు బయటి ప్రాంగణంలో కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కావడం కానీ, ప్రాణాలు పోవడం కాని జరగలేదు. ఆ సమయంలో పైన ఎవరూ లేకపోవడం పెద్ద గండాన్ని తప్పించింది.
ఇదే తరహాలో 2019 విశ్వాసం టైంలో పాలాభిషేకం చేయబోతూ అయిదుగురు ఫ్యాన్స్ కిందపడి తీవ్రంగా గాయపడటం పట్ల అజిత్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను అసోసియేషన్లు లేవని, తల లాంటి బిరుదులు పెట్టొద్దని ఎంత చెప్పినా సరే అభిమానులు మాత్రం వాటిని మానడం లేదు. అయినా చెక్క లాంటి పదార్థాలతో తయారయ్యే కటవుట్లకు అంతేసి ఎత్తుని పెంచుకుంటూ పోవడం క్షేమం కాదు. చుట్టుపక్కల వాళ్లకు రిస్క్. ఏ మాత్రం గాలి హోరుగా వీచినా ప్రమాదం పొంచి ఉంటుంది. అజిత్ దీని గురించి ఇంకా స్పందించలేదు. వీడియో చూస్తే మాత్రం ఈసారి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం ఖాయమని చెన్నై టాక్.
This post was last modified on April 6, 2025 11:10 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…