కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా మిగిలిపోవాలనే తాపత్రయం వేరే రాష్ట్రాలకు అంటుకుంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ విడుదల సమయంలో 256 అడుగుల కటవుట్ ని విజయవాడలో ఏర్పాటు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియాలోనే అత్యంత పొడవైనదిగా కొత్త మైలురాయి నమోదు చేసుకుంది. అంతకు ముందు సలార్ (236), కెజిఎఫ్ 2 (216), ఎన్జికె (215), విశ్వాసం (185) తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సరే లేనిది మాకేనా అని అజిత్ ఫ్యాన్స్ అనుకున్నారేమో వెంటనే గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం రెడీ అయిపోయారు.
ఏకంగా 285 అడుగుల కటవుట్ ని రెడీ చేసి తమిళనాడు తెంకాశిలోని ఒక థియేటర్ కు ప్రతిష్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మెటల్ ఫెన్సింగ్ తో గ్రిల్స్ ఏర్పాటు చేసి ఒక్కో భాగాన్ని పెడుతూ వెళ్లారు. అజిత్ తల సెట్ అయిన కాసేపటి తర్వాత క్రమంగా అది కూలిపోయే దిశగా ఉండటం గమనించిన జనం వెంటనే అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి తప్పుకున్నారు. చూస్తుండగానే మొత్తం హాలు బయటి ప్రాంగణంలో కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కావడం కానీ, ప్రాణాలు పోవడం కాని జరగలేదు. ఆ సమయంలో పైన ఎవరూ లేకపోవడం పెద్ద గండాన్ని తప్పించింది.
ఇదే తరహాలో 2019 విశ్వాసం టైంలో పాలాభిషేకం చేయబోతూ అయిదుగురు ఫ్యాన్స్ కిందపడి తీవ్రంగా గాయపడటం పట్ల అజిత్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను అసోసియేషన్లు లేవని, తల లాంటి బిరుదులు పెట్టొద్దని ఎంత చెప్పినా సరే అభిమానులు మాత్రం వాటిని మానడం లేదు. అయినా చెక్క లాంటి పదార్థాలతో తయారయ్యే కటవుట్లకు అంతేసి ఎత్తుని పెంచుకుంటూ పోవడం క్షేమం కాదు. చుట్టుపక్కల వాళ్లకు రిస్క్. ఏ మాత్రం గాలి హోరుగా వీచినా ప్రమాదం పొంచి ఉంటుంది. అజిత్ దీని గురించి ఇంకా స్పందించలేదు. వీడియో చూస్తే మాత్రం ఈసారి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం ఖాయమని చెన్నై టాక్.
This post was last modified on April 6, 2025 11:10 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…