అల్లుడు అదుర్స్ తర్వాత హిందీ ఛత్రపతి కోసం మూడేళ్లు టాలీవుడ్ కు దూరమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పుడు ప్రభాస్ రేంజ్ లో వేగంగా సినిమాలు చేస్తున్నాడు. సింగల్ టైం మల్టీపుల్ మూవీస్ సూత్రాన్ని పాటిస్తూ స్పీడ్ పెంచాడు. వీటిలో ముందు వరసలో ఉన్నది భైరవం. తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందిన ఈ విలేజ్ డ్రామాకు సంబంధించిన టీజర్, లిరికల్ వీడియోస్ వచ్చి వారాలు, నెలలు గడిచిపోయాయి. వాస్తవానికి సంక్రాంతికి అనుకున్నారు. కానీ పోటీ వల్ల తప్పుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి అయిపోయి ఏప్రిల్ కూడా వచ్చేసింది. కానీ భైరవం అప్డేట్ లేదు.
ఇంకొంత భాగం మాత్రమే పెండింగ్ ఉందని, టైసన్ నాయుడు కోసం సాయిశ్రీనివాస్ చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల భైరవం వెయిట్ చేయాల్సి వస్తోందని ఇన్ సైడ్ టాక్. నారా రోహిత్, మంచు మనోజ్ లు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఓ వెన్నెల సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హుషారుగా ఆడిపాడి జనాల దృష్టిలో పడింది. కన్నప్పతో పాటుగా ఏప్రిల్ 25 రావొచ్చనే లీక్ గతంలో వచ్చింది. కానీ మంచు విష్ణు పోస్ట్ ప్రొడక్షన్ వల్ల వాయిదా వేసుకున్నాడు. అలాంటప్పుడు భైరవం ఈ ఛాన్స్ వాడుకుని ఉండాల్సింది.
అనుష్క ఘాటీ తప్పుకోవడం లాంటి అడ్వాంటేజ్ ని సైతం భైరవం ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మేకి వెళ్ళిపోవాలి. 9న హరిహర వీరమల్లు ఉంది. చూస్తుంటే ఇది రావడం అనుమానంగానే ఉందని ట్రేడ్ రిపోర్ట్. అదే కనక జరిగితే ఆ స్లాట్ ని తీసుకునేందుకు భైరవం సిద్ధంగా ఉందని సమాచారం. పబ్లిసిటీ ఆపేసి రోజులు గడుస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సరైన మాస్ సినిమా లేని గ్యాప్ ని చేతులారా వదులుకున్నట్టు అయ్యింది. బలమైన కంబ్యాక్ గా ఈ సినిమా నిలుస్తుందని సాయిశ్రీనివాస్ చాలా నమ్మకంగా ఉన్నాడు. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవంకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
This post was last modified on April 6, 2025 6:00 pm
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్కు…
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…