Movie News

భైరవం మంచి ఛాన్సులు వదిలేసుకుంది

అల్లుడు అదుర్స్ తర్వాత హిందీ ఛత్రపతి కోసం మూడేళ్లు టాలీవుడ్ కు దూరమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పుడు ప్రభాస్ రేంజ్ లో వేగంగా సినిమాలు చేస్తున్నాడు. సింగల్ టైం మల్టీపుల్ మూవీస్ సూత్రాన్ని పాటిస్తూ స్పీడ్ పెంచాడు. వీటిలో ముందు వరసలో ఉన్నది భైరవం. తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందిన ఈ విలేజ్ డ్రామాకు సంబంధించిన టీజర్, లిరికల్ వీడియోస్ వచ్చి వారాలు, నెలలు గడిచిపోయాయి. వాస్తవానికి సంక్రాంతికి అనుకున్నారు. కానీ పోటీ వల్ల తప్పుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి అయిపోయి ఏప్రిల్ కూడా వచ్చేసింది. కానీ భైరవం అప్డేట్ లేదు.

ఇంకొంత భాగం మాత్రమే పెండింగ్ ఉందని, టైసన్ నాయుడు కోసం సాయిశ్రీనివాస్ చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల భైరవం వెయిట్ చేయాల్సి వస్తోందని ఇన్ సైడ్ టాక్. నారా రోహిత్, మంచు మనోజ్ లు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఓ వెన్నెల సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హుషారుగా ఆడిపాడి జనాల దృష్టిలో పడింది. కన్నప్పతో పాటుగా ఏప్రిల్ 25 రావొచ్చనే లీక్ గతంలో వచ్చింది. కానీ మంచు విష్ణు పోస్ట్ ప్రొడక్షన్ వల్ల వాయిదా వేసుకున్నాడు. అలాంటప్పుడు భైరవం ఈ ఛాన్స్ వాడుకుని ఉండాల్సింది.

అనుష్క ఘాటీ తప్పుకోవడం లాంటి అడ్వాంటేజ్ ని సైతం భైరవం ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మేకి వెళ్ళిపోవాలి. 9న హరిహర వీరమల్లు ఉంది. చూస్తుంటే ఇది రావడం అనుమానంగానే ఉందని ట్రేడ్ రిపోర్ట్. అదే కనక జరిగితే ఆ స్లాట్ ని తీసుకునేందుకు భైరవం సిద్ధంగా ఉందని సమాచారం. పబ్లిసిటీ ఆపేసి రోజులు గడుస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సరైన మాస్ సినిమా లేని గ్యాప్ ని చేతులారా వదులుకున్నట్టు అయ్యింది. బలమైన కంబ్యాక్ గా ఈ సినిమా నిలుస్తుందని సాయిశ్రీనివాస్ చాలా నమ్మకంగా ఉన్నాడు. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవంకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

This post was last modified on April 6, 2025 6:00 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Bhairavam

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

49 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago