ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’కు కొనసాగింపుగా మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఈ చిత్రం.. రిలీజైన తొలి రోజే పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఆరంభ సన్నివేశాలు, కొన్ని పాత్రలు గోద్రా అల్లర్లను గుర్తు చేసేలా ఉండడం.. బీజేపీని టార్గెట్ చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారం పార్లమెంటు వరకు వెళ్లింది. ఊహించని వ్యతిరేకతను గమనించిన మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడమే కాదు.. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను కూడా తీయించేశాడు. ఈ వివాదం వల్ల ఎంత నెగెటివిటీ వచ్చినప్పటికీ ‘ఎంపురాన్’ వసూళ్లకేమీ ఢోకా లేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ హిట్గా రికార్డు సృష్టించింది.
తొలి వారాంతంలోనే వంద కోట్ల వసూళ్లు సాధించిన ‘ఎంపురాన్’ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. తాజాగా ఈ చిత్రం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకుంది. ఇప్పటిదాకా ఏ మలయాళ చిత్రం ఈ మైలురాయిని అందుకోలేదు. రూ.242 కోట్లతో గత ఏడాది ఏడాది కిందట ‘మంజుమ్మల్ బాయ్స్’ నెలకొల్పిన రికార్డును ‘ఎంపురాన్’ దాటేసింది.
మోహన్ లాల్ ఇలా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఇది తొలిసారి కాదు. దృశ్యం, పులి మురగన్, లూసిఫర్.. ఇలా చాలా సినిమాలతో ఆయన పాత కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతూనే వస్తున్నారు. ఐతే ‘ఎంపురాన్’కు అంత గొప్ప టాక్ రాకపోయినా, వివాదాలు చుట్టుముట్టినా.. అన్నింటినీ దాటుకుని రికార్డు కొట్టడం మాత్రం విశేషమే. కాంట్రవర్శీ నేపథ్యంలో ముందు అనుకున్నట్లుగా ‘లూసిఫర్-3’ రాదేమో అన్న సందేహాలు నెలకొన్నాయి కానీ.. ఇటీవలే చిత్ర బృందం ఆ చిత్రం ఉంటుందని స్పష్టం చేసింది.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…