ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’కు కొనసాగింపుగా మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఈ చిత్రం.. రిలీజైన తొలి రోజే పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఆరంభ సన్నివేశాలు, కొన్ని పాత్రలు గోద్రా అల్లర్లను గుర్తు చేసేలా ఉండడం.. బీజేపీని టార్గెట్ చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారం పార్లమెంటు వరకు వెళ్లింది. ఊహించని వ్యతిరేకతను గమనించిన మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడమే కాదు.. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను కూడా తీయించేశాడు. ఈ వివాదం వల్ల ఎంత నెగెటివిటీ వచ్చినప్పటికీ ‘ఎంపురాన్’ వసూళ్లకేమీ ఢోకా లేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ హిట్గా రికార్డు సృష్టించింది.
తొలి వారాంతంలోనే వంద కోట్ల వసూళ్లు సాధించిన ‘ఎంపురాన్’ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. తాజాగా ఈ చిత్రం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకుంది. ఇప్పటిదాకా ఏ మలయాళ చిత్రం ఈ మైలురాయిని అందుకోలేదు. రూ.242 కోట్లతో గత ఏడాది ఏడాది కిందట ‘మంజుమ్మల్ బాయ్స్’ నెలకొల్పిన రికార్డును ‘ఎంపురాన్’ దాటేసింది.
మోహన్ లాల్ ఇలా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఇది తొలిసారి కాదు. దృశ్యం, పులి మురగన్, లూసిఫర్.. ఇలా చాలా సినిమాలతో ఆయన పాత కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతూనే వస్తున్నారు. ఐతే ‘ఎంపురాన్’కు అంత గొప్ప టాక్ రాకపోయినా, వివాదాలు చుట్టుముట్టినా.. అన్నింటినీ దాటుకుని రికార్డు కొట్టడం మాత్రం విశేషమే. కాంట్రవర్శీ నేపథ్యంలో ముందు అనుకున్నట్లుగా ‘లూసిఫర్-3’ రాదేమో అన్న సందేహాలు నెలకొన్నాయి కానీ.. ఇటీవలే చిత్ర బృందం ఆ చిత్రం ఉంటుందని స్పష్టం చేసింది.
This post was last modified on April 5, 2025 6:59 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…