ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’కు కొనసాగింపుగా మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఈ చిత్రం.. రిలీజైన తొలి రోజే పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఆరంభ సన్నివేశాలు, కొన్ని పాత్రలు గోద్రా అల్లర్లను గుర్తు చేసేలా ఉండడం.. బీజేపీని టార్గెట్ చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారం పార్లమెంటు వరకు వెళ్లింది. ఊహించని వ్యతిరేకతను గమనించిన మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడమే కాదు.. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను కూడా తీయించేశాడు. ఈ వివాదం వల్ల ఎంత నెగెటివిటీ వచ్చినప్పటికీ ‘ఎంపురాన్’ వసూళ్లకేమీ ఢోకా లేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ హిట్గా రికార్డు సృష్టించింది.
తొలి వారాంతంలోనే వంద కోట్ల వసూళ్లు సాధించిన ‘ఎంపురాన్’ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. తాజాగా ఈ చిత్రం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకుంది. ఇప్పటిదాకా ఏ మలయాళ చిత్రం ఈ మైలురాయిని అందుకోలేదు. రూ.242 కోట్లతో గత ఏడాది ఏడాది కిందట ‘మంజుమ్మల్ బాయ్స్’ నెలకొల్పిన రికార్డును ‘ఎంపురాన్’ దాటేసింది.
మోహన్ లాల్ ఇలా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఇది తొలిసారి కాదు. దృశ్యం, పులి మురగన్, లూసిఫర్.. ఇలా చాలా సినిమాలతో ఆయన పాత కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతూనే వస్తున్నారు. ఐతే ‘ఎంపురాన్’కు అంత గొప్ప టాక్ రాకపోయినా, వివాదాలు చుట్టుముట్టినా.. అన్నింటినీ దాటుకుని రికార్డు కొట్టడం మాత్రం విశేషమే. కాంట్రవర్శీ నేపథ్యంలో ముందు అనుకున్నట్లుగా ‘లూసిఫర్-3’ రాదేమో అన్న సందేహాలు నెలకొన్నాయి కానీ.. ఇటీవలే చిత్ర బృందం ఆ చిత్రం ఉంటుందని స్పష్టం చేసింది.
This post was last modified on April 5, 2025 6:59 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…