ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’కు కొనసాగింపుగా మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఈ చిత్రం.. రిలీజైన తొలి రోజే పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఆరంభ సన్నివేశాలు, కొన్ని పాత్రలు గోద్రా అల్లర్లను గుర్తు చేసేలా ఉండడం.. బీజేపీని టార్గెట్ చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారం పార్లమెంటు వరకు వెళ్లింది. ఊహించని వ్యతిరేకతను గమనించిన మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడమే కాదు.. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను కూడా తీయించేశాడు. ఈ వివాదం వల్ల ఎంత నెగెటివిటీ వచ్చినప్పటికీ ‘ఎంపురాన్’ వసూళ్లకేమీ ఢోకా లేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ హిట్గా రికార్డు సృష్టించింది.
తొలి వారాంతంలోనే వంద కోట్ల వసూళ్లు సాధించిన ‘ఎంపురాన్’ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. తాజాగా ఈ చిత్రం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకుంది. ఇప్పటిదాకా ఏ మలయాళ చిత్రం ఈ మైలురాయిని అందుకోలేదు. రూ.242 కోట్లతో గత ఏడాది ఏడాది కిందట ‘మంజుమ్మల్ బాయ్స్’ నెలకొల్పిన రికార్డును ‘ఎంపురాన్’ దాటేసింది.
మోహన్ లాల్ ఇలా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఇది తొలిసారి కాదు. దృశ్యం, పులి మురగన్, లూసిఫర్.. ఇలా చాలా సినిమాలతో ఆయన పాత కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతూనే వస్తున్నారు. ఐతే ‘ఎంపురాన్’కు అంత గొప్ప టాక్ రాకపోయినా, వివాదాలు చుట్టుముట్టినా.. అన్నింటినీ దాటుకుని రికార్డు కొట్టడం మాత్రం విశేషమే. కాంట్రవర్శీ నేపథ్యంలో ముందు అనుకున్నట్లుగా ‘లూసిఫర్-3’ రాదేమో అన్న సందేహాలు నెలకొన్నాయి కానీ.. ఇటీవలే చిత్ర బృందం ఆ చిత్రం ఉంటుందని స్పష్టం చేసింది.
This post was last modified on April 5, 2025 6:59 pm
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…