లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డబుల్ షాక్ తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ దెబ్బతో ఆయనకు సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఎంత వైభవం చూసినా సరే.. ప్రస్తుతం ఆయన ఫామ్ చూసి హీరోలు భయపడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ స్థితిలో పూరి కొత్త స్క్రిప్టులు రెడీ చేసుకుని వేరే ఇండస్ట్రీల హీరోలను కలవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సీనియర్ డైరెక్టర్తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.
ఇది తమిళ ఇండస్ట్రీలో చాలామందికి నచ్చకపోయినా సేతుపతి మాత్రం ఈ చిత్రం మీద ధీమాగానే ఉన్నాడు. ఈ చిత్రానికి నిర్మాతలుగా పూరి, చార్మి లే వ్యవహరించనున్నారు. ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ ఎంపిక పనిలో బిజీ అయ్యాడు పూరి. ఈ ప్రాజెక్టుకు ఒక క్రేజీ అడిషన్ తోడైనట్లు తాజా సమాచారం. బహు భాషా చిత్రాలతో దేశం గర్వించదగ్గ నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న టబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయబోతోంది. టబు మాత్రమే చేయదగ్గ పాత్ర ఇదట. పూరి తన పాత్రను డిజైన్ చేసిన తీరు, కథ నచ్చి ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
టబు చేస్తోందంటే ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చేసినట్లే. ఇటు సేతుపతి, అటు టబు లాంటి పెర్ఫామర్లు ముఖ్య పాత్రలు పోషిస్తే సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. ఈ చిత్రంలో సేతుపతి బిచ్చగాడి పాత్రను చేస్తున్నాడట. వ్యవస్థ మీద సెటైర్లతో హార్డ్ హిట్టింగ్గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈసారి పూరి పూర్తి స్క్రిప్టు రెడీ చేయలేదు. బేసిక్ ఐడియా మాత్రమే ఆయనది. ఇద్దరు కొత్త రచయితలు దాన్ని పకడ్బందీ స్క్రిప్టుగా మార్చారు. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందని సమాచారం.
This post was last modified on April 6, 2025 11:10 am
విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద…
ఏపీ సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జరుగుతుందో తాజాగా అదే జరిగింది. ఒక్క దెబ్బకు 284 మంది ఔట్ సోర్సింగ్…
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది.…
వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కీలక నాయకులు…
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. ``అడవుల్లోకి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు.…