లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డబుల్ షాక్ తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ దెబ్బతో ఆయనకు సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఎంత వైభవం చూసినా సరే.. ప్రస్తుతం ఆయన ఫామ్ చూసి హీరోలు భయపడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ స్థితిలో పూరి కొత్త స్క్రిప్టులు రెడీ చేసుకుని వేరే ఇండస్ట్రీల హీరోలను కలవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సీనియర్ డైరెక్టర్తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.
ఇది తమిళ ఇండస్ట్రీలో చాలామందికి నచ్చకపోయినా సేతుపతి మాత్రం ఈ చిత్రం మీద ధీమాగానే ఉన్నాడు. ఈ చిత్రానికి నిర్మాతలుగా పూరి, చార్మి లే వ్యవహరించనున్నారు. ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ ఎంపిక పనిలో బిజీ అయ్యాడు పూరి. ఈ ప్రాజెక్టుకు ఒక క్రేజీ అడిషన్ తోడైనట్లు తాజా సమాచారం. బహు భాషా చిత్రాలతో దేశం గర్వించదగ్గ నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న టబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయబోతోంది. టబు మాత్రమే చేయదగ్గ పాత్ర ఇదట. పూరి తన పాత్రను డిజైన్ చేసిన తీరు, కథ నచ్చి ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
టబు చేస్తోందంటే ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చేసినట్లే. ఇటు సేతుపతి, అటు టబు లాంటి పెర్ఫామర్లు ముఖ్య పాత్రలు పోషిస్తే సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. ఈ చిత్రంలో సేతుపతి బిచ్చగాడి పాత్రను చేస్తున్నాడట. వ్యవస్థ మీద సెటైర్లతో హార్డ్ హిట్టింగ్గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈసారి పూరి పూర్తి స్క్రిప్టు రెడీ చేయలేదు. బేసిక్ ఐడియా మాత్రమే ఆయనది. ఇద్దరు కొత్త రచయితలు దాన్ని పకడ్బందీ స్క్రిప్టుగా మార్చారు. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందని సమాచారం.
This post was last modified on April 6, 2025 11:10 am
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…