లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డబుల్ షాక్ తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ దెబ్బతో ఆయనకు సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఎంత వైభవం చూసినా సరే.. ప్రస్తుతం ఆయన ఫామ్ చూసి హీరోలు భయపడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ స్థితిలో పూరి కొత్త స్క్రిప్టులు రెడీ చేసుకుని వేరే ఇండస్ట్రీల హీరోలను కలవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సీనియర్ డైరెక్టర్తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.
ఇది తమిళ ఇండస్ట్రీలో చాలామందికి నచ్చకపోయినా సేతుపతి మాత్రం ఈ చిత్రం మీద ధీమాగానే ఉన్నాడు. ఈ చిత్రానికి నిర్మాతలుగా పూరి, చార్మి లే వ్యవహరించనున్నారు. ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ ఎంపిక పనిలో బిజీ అయ్యాడు పూరి. ఈ ప్రాజెక్టుకు ఒక క్రేజీ అడిషన్ తోడైనట్లు తాజా సమాచారం. బహు భాషా చిత్రాలతో దేశం గర్వించదగ్గ నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న టబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయబోతోంది. టబు మాత్రమే చేయదగ్గ పాత్ర ఇదట. పూరి తన పాత్రను డిజైన్ చేసిన తీరు, కథ నచ్చి ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
టబు చేస్తోందంటే ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చేసినట్లే. ఇటు సేతుపతి, అటు టబు లాంటి పెర్ఫామర్లు ముఖ్య పాత్రలు పోషిస్తే సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. ఈ చిత్రంలో సేతుపతి బిచ్చగాడి పాత్రను చేస్తున్నాడట. వ్యవస్థ మీద సెటైర్లతో హార్డ్ హిట్టింగ్గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈసారి పూరి పూర్తి స్క్రిప్టు రెడీ చేయలేదు. బేసిక్ ఐడియా మాత్రమే ఆయనది. ఇద్దరు కొత్త రచయితలు దాన్ని పకడ్బందీ స్క్రిప్టుగా మార్చారు. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందని సమాచారం.
This post was last modified on April 6, 2025 11:10 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…