ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం మామూలే. ముఖ్యంగా నిర్మాతలను ముందు చిత్రాల నష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన బీవీఎస్ఎన్ ప్రసాద్కు గత కొన్నేళ్లలో పెద్ద షాక్ అంటే.. ‘గాండీవధారి అర్జున’నే. వరుణ్ తేజ్ హీరోగా పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను పెద్ద బడ్జెట్లో నిర్మించారు ప్రసాద్. కానీ ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. పెట్టుబడి పూర్తిగా వేస్ట్ అయింది. థియేటర్ల నుంచి అయితే పైసా ఆదాయం రాలేదు.
దీంతో కొంత కాలం ప్రొడక్షనే ఆపేశారు ప్రసాద్. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఆయన నిర్మాణంలో ‘జాక్’ మూవీ తెరకెక్కింది. ఇది కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఏప్రిల్ 10న ‘జాక్’ను రిలీజ్ చేయాలని చూస్తుండగా.. ‘గాండీవధారి’ నష్టాలు దీనికి అడ్డం పడుతున్నాయి. ఈ సినిమాను కొని నష్టపోయిన గోదావరి ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారట.
రికవరబుల్ అడ్వాన్స్ కింద సినిమాను కొన్న తాము పూర్తిగా పెట్టుబడి నష్టపోయామని.. తమకు డబ్బులు వెనక్కివ్వలేదని.. ఆ సెటిల్మెంట్ జరిగే వరకు ‘జాక్’ మూవీని రిలీజ్ చేయొద్దని పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ఇలాంటి సెటిల్మెంట్ల విషయంలో ఛాంబర్ సీరియస్గానే ఉంటుంది. కాబట్టి ఆ వ్యవహారం తేలితే తప్ప ‘జాక్’ను రిలీజ్ చేయడానికి ఉండదు. సిద్ధు సినిమా కావడం వల్ల ‘జాక్’ఖు బిజినెస్ పర్వాలేదనిపించే లాగే జరుగుతున్నట్లు సమాచారం. కాబట్టి నిర్మాత సెటిల్మెంట్కు వెళ్లొచ్చు. కానీ మిగతా బయ్యర్లు కూడా ఇదే బాటపడితేనే కష్టం.
This post was last modified on April 4, 2025 6:17 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…