ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం మామూలే. ముఖ్యంగా నిర్మాతలను ముందు చిత్రాల నష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన బీవీఎస్ఎన్ ప్రసాద్కు గత కొన్నేళ్లలో పెద్ద షాక్ అంటే.. ‘గాండీవధారి అర్జున’నే. వరుణ్ తేజ్ హీరోగా పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను పెద్ద బడ్జెట్లో నిర్మించారు ప్రసాద్. కానీ ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. పెట్టుబడి పూర్తిగా వేస్ట్ అయింది. థియేటర్ల నుంచి అయితే పైసా ఆదాయం రాలేదు.
దీంతో కొంత కాలం ప్రొడక్షనే ఆపేశారు ప్రసాద్. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఆయన నిర్మాణంలో ‘జాక్’ మూవీ తెరకెక్కింది. ఇది కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఏప్రిల్ 10న ‘జాక్’ను రిలీజ్ చేయాలని చూస్తుండగా.. ‘గాండీవధారి’ నష్టాలు దీనికి అడ్డం పడుతున్నాయి. ఈ సినిమాను కొని నష్టపోయిన గోదావరి ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారట.
రికవరబుల్ అడ్వాన్స్ కింద సినిమాను కొన్న తాము పూర్తిగా పెట్టుబడి నష్టపోయామని.. తమకు డబ్బులు వెనక్కివ్వలేదని.. ఆ సెటిల్మెంట్ జరిగే వరకు ‘జాక్’ మూవీని రిలీజ్ చేయొద్దని పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ఇలాంటి సెటిల్మెంట్ల విషయంలో ఛాంబర్ సీరియస్గానే ఉంటుంది. కాబట్టి ఆ వ్యవహారం తేలితే తప్ప ‘జాక్’ను రిలీజ్ చేయడానికి ఉండదు. సిద్ధు సినిమా కావడం వల్ల ‘జాక్’ఖు బిజినెస్ పర్వాలేదనిపించే లాగే జరుగుతున్నట్లు సమాచారం. కాబట్టి నిర్మాత సెటిల్మెంట్కు వెళ్లొచ్చు. కానీ మిగతా బయ్యర్లు కూడా ఇదే బాటపడితేనే కష్టం.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…