ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం మామూలే. ముఖ్యంగా నిర్మాతలను ముందు చిత్రాల నష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన బీవీఎస్ఎన్ ప్రసాద్కు గత కొన్నేళ్లలో పెద్ద షాక్ అంటే.. ‘గాండీవధారి అర్జున’నే. వరుణ్ తేజ్ హీరోగా పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను పెద్ద బడ్జెట్లో నిర్మించారు ప్రసాద్. కానీ ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. పెట్టుబడి పూర్తిగా వేస్ట్ అయింది. థియేటర్ల నుంచి అయితే పైసా ఆదాయం రాలేదు.
దీంతో కొంత కాలం ప్రొడక్షనే ఆపేశారు ప్రసాద్. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఆయన నిర్మాణంలో ‘జాక్’ మూవీ తెరకెక్కింది. ఇది కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఏప్రిల్ 10న ‘జాక్’ను రిలీజ్ చేయాలని చూస్తుండగా.. ‘గాండీవధారి’ నష్టాలు దీనికి అడ్డం పడుతున్నాయి. ఈ సినిమాను కొని నష్టపోయిన గోదావరి ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారట.
రికవరబుల్ అడ్వాన్స్ కింద సినిమాను కొన్న తాము పూర్తిగా పెట్టుబడి నష్టపోయామని.. తమకు డబ్బులు వెనక్కివ్వలేదని.. ఆ సెటిల్మెంట్ జరిగే వరకు ‘జాక్’ మూవీని రిలీజ్ చేయొద్దని పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ఇలాంటి సెటిల్మెంట్ల విషయంలో ఛాంబర్ సీరియస్గానే ఉంటుంది. కాబట్టి ఆ వ్యవహారం తేలితే తప్ప ‘జాక్’ను రిలీజ్ చేయడానికి ఉండదు. సిద్ధు సినిమా కావడం వల్ల ‘జాక్’ఖు బిజినెస్ పర్వాలేదనిపించే లాగే జరుగుతున్నట్లు సమాచారం. కాబట్టి నిర్మాత సెటిల్మెంట్కు వెళ్లొచ్చు. కానీ మిగతా బయ్యర్లు కూడా ఇదే బాటపడితేనే కష్టం.
This post was last modified on April 4, 2025 6:17 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…