ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ధనుష్ ఇడ్లి కడై (ఇడ్లి కొట్టు) ఏకంగా అక్టోబర్ కు వెళ్ళిపోయింది. ఆ నెల ఒకటో తేదీన తమిళ తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇది ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా. ఇటీవలే జాబిలమ్మ నీకు అంత కోపమా రూపంలో ఫ్లాప్ చవి చూసిననప్పటికీ ఇడ్లి కొట్టు మీద బోలెడు నమ్మకం పెట్టుకున్నాడు. ఇందులో నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ విజయ్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్ లాంటి ఆసక్తికరమైన క్యాస్టింగ్ అంచనాలు పెంచుతోంది. అయితే డేట్ బాగానే ఉంది కాని పోటీ పరంగా ధనుష్ పెద్ద రిస్కుకు రెడీ అవుతున్నాడు.
ఎందుకంటే అక్టోబర్ 2 కాంతార చాప్టర్ వన్ వస్తుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని ఇటీవలే హోంబాలే ఫిలిమ్స్ ప్రకటించింది. సో దాంతో క్లాష్ అంటే ఆషామాషీ కాదు. ఇక్కడితో అయిపోలేదు. వీటికి వారం ముందు సెప్టెంబర్ 25 బాలకృష్ణ అఖండ 2 తాండవం వస్తుంది. ఇన్ సైడ్ టాక్ అయితే మాములుగా లేదు. బోయపాటి శీను పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా అదే రోజు రానుంది. ఒకవేళ ఏదైనా ఒకటి వాయిదా పడే పక్షంలో ప్రభాస్ ది రాజా సాబ్ వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కాకపోతే ఇంకా పాటల షూటింగ్ బాలన్స్ ఉండటంతో డేట్ ప్రకటించలేదు.
ఇవి కాకుండా జూన్ లేదా జూలై కనక విశ్వంభర మిస్ చేసుకుంటే అది కూడా దసరా పండగనే లక్ష్యంగా పెట్టుకుంటోంది. ఇదంతా చూసి కూడా ధనుష్ తన ఇడ్లి కడైని ఇంత కాంపిటీషన్ లో దింపడం ఆశ్చర్యమే. తాతల నుంచి సంక్రమించిన చిన్న ఇడ్లి కొట్టు నడుపుకునే ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ధనుష్ ఈ సబ్జెక్టు రాసుకున్నాడు. గత ఏడాది వచ్చిన రాయన్ కు భిన్నంగా ఇడ్లి కొట్టులో ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ ఉండవట. అలాంటప్పుడు ప్యాన్ ఇండియా మూవీస్ తో తలపడే రిస్కు చేస్తున్నాడంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టే. అన్నట్టు కుబేర జూన్ 20 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…