బాలీవుడ్ ఆల్ టైం టాప్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. 90వ దశకంలో ‘మై నే ప్యార్ కియా’తో మొదలుపెట్టి ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఒక దశలో సల్మాన్ యావరేజ్ సినిమాలు చేసి కూడా భారీ వసూళ్లు రాబట్టేవారు. ఆయన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మూణ్నాలుగొందల కోట్ల వసూళ్లు వచ్చేవి. కానీ గత కొన్నేళ్లుగా సల్మాన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయన సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. మార్కెట్ అంతకంతకూ పడిపోతోంది. తాజాగా సల్మాన్ నుంచి వచ్చిన ‘సికందర్’ సైతం డిజాస్టర్ బాటే పట్టింది.
ఈ నేపథ్యంలో సల్మాన్ స్క్రిప్ట్ సెలక్షన్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సినిమాలో సల్మాన్ సరిగా ఇన్వాల్వ్ అయినట్లు కనిపించలేదని.. నటన పేలవమని.. ఆయనకు కమిట్మెంట్ లేదని.. ప్రమోషన్లు కూడా మొక్కుబడిగా సాగాయని.. ఇలా రకరకాల విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందించాడు. తాను పెద్ద స్టార్ కాబట్టి తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని చాలామంది అనుకుంటారని.. కానీ అది తప్పని సల్మాన్ వ్యాఖ్యానించాడు. తనకు కమిట్మెంట్ లేదన్న వ్యాఖ్యల మీదా సల్మాన్ స్పందించాడు.
‘‘సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను భాగమవుతాను. నాకు కమిట్మెంట్ లేకపోతే ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడిని కాదు. బహుశా బాలీవుడ్లోని వారంతా నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని అనుకుంటున్నారేమో. అందుకే నా సినిమా విషయంలో ఎవరూ స్పందించలేదు. కానీ ప్రతి మనిషికీ మద్దతు కావాలి. నాకూ ఆ రకమైన సపోర్ట్ కావాలి’’ అని సల్మాన్ పేర్కొన్నాడు. మరోవైపు ‘సికందర్’ సినిమాను విమర్శిస్తున్న వారిపై నిర్మాత సాజిద్ నడియాడ్వాలా సతీమణి వార్దా ఖాన్ సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. సాజిద్.. సల్మాన్ కెరీర్ను నాశనం చేస్తున్నాడన్న విమర్శలపై ఆమె మండిపడ్డారు. మీరు త్వరగా కోలుకోవాలంటూ సెటైరిగ్గా పోస్టులు పెట్టి.. తర్వాత వాటిని డెలీట్ చేశారు.
This post was last modified on April 3, 2025 2:22 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…