Movie News

చైతూ మైల్‌స్టోన్ మూవీ.. కొత్త దర్శకుడితో?

అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత చైతూ నుంచి ఈ ఏడాది వచ్చిన ‘తండేల్’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ ఉత్సాహంలో చైతూ తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘విరూపాక్ష’ తరహాలోనే ఇది కూడా మిస్టిక్ థ్రిల్లరే. ఇది చైతూకు 24వ చిత్రం.

దీని తర్వాత చైతూ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ అయిన 25వ చిత్రానికి దర్శకుడు ఖరారైనట్లు సమాచారం. ఈ స్పెషల్ ప్రాజెక్టును కిిశోర్ అనే కొత్త దర్శకుడి చేతికి అప్పగించారట. అతను చెప్పిన కథకు ఇటీవలే చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచాచారం. 25వ చిత్రం కోసం కొంత కాలంగా కథలు వింటున్నాడు చైతూ. ఐతే కొత్త దర్శకుడైన కిశోర్ ఓ వెరైటీ కథతో చైతూను మెప్పించినట్లు సమాచారం. కమర్షియల్ టచ్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇదట. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే చేద్దామని కూడా చూస్తున్నారట. లేదంటే ఏదైనా బయటి బేనర్ కూడా రంగంలోకి దిగొచ్చు.

మరోవైపు చైతూ తండ్రి నాగార్జున ఇంకా పెద్ద మైలురాయి ముంగిట నిలిచారు. హీరోగా ఆయన వందో చిత్రం గురించి చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. తమిళ దర్శకుడైన నవీన్ ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. నాగ్ 100వ సినిమా, చైతూ 25వ సినిమా దాదాపుగా ఒకే సమయంలో సెట్స్ మీదికి వెళ్లేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఇవి పట్టాలెక్కొచ్చు.

This post was last modified on April 2, 2025 6:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అప్పుడు ఫైబ‌ర్ నెట్ ఇప్పుడు శాప్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాదికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ ర‌వినాయుడు.. వ‌ర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మ‌ధ్య ఇప్పుడు రాజ‌కీయం జోరుగా సాగుతోంది.…

36 minutes ago

అమెరికా టారిఫ్‌… కేంద్రానికి చంద్ర‌బాబు లేఖ‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ప్ర‌పంచ దేశాల దిగుమ‌తుల‌పై భారీఎత్తున సుంకాలు (టారిఫ్‌లు)…

3 hours ago

భైరవం మంచి ఛాన్సులు వదిలేసుకుంది

అల్లుడు అదుర్స్ తర్వాత హిందీ ఛత్రపతి కోసం మూడేళ్లు టాలీవుడ్ కు దూరమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పుడు ప్రభాస్ రేంజ్…

4 hours ago

ఏపీ రైజింగ్… వృద్ధిలో దేశంలోనే రెండో స్థానం

ఏపీ వృద్ధి రేటులో దూసుకుపోతోంది. కూటమి పాలనలో గడచిన 10 నెలల్లోనే ఏపీ గణనీయ వృద్ధి రేటును సాధించింది. దేశంలోని అత్యధిక…

4 hours ago

సెలబ్రేషన్‌కి ఫైన్.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాథి మరోసారి తన వివాదాస్పద నోట్‌బుక్ సెలబ్రేషన్‌తో వార్తల్లోకెక్కాడు.…

5 hours ago

చరణ్ VS నాని : క్లాష్ ఈజీ కాదు

ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో ది ప్యారడైజ్, పెద్దిలు క్లాష్ కానుండటం ట్రేడ్…

5 hours ago