Movie News

చైతూ మైల్‌స్టోన్ మూవీ.. కొత్త దర్శకుడితో?

అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత చైతూ నుంచి ఈ ఏడాది వచ్చిన ‘తండేల్’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ ఉత్సాహంలో చైతూ తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘విరూపాక్ష’ తరహాలోనే ఇది కూడా మిస్టిక్ థ్రిల్లరే. ఇది చైతూకు 24వ చిత్రం.

దీని తర్వాత చైతూ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ అయిన 25వ చిత్రానికి దర్శకుడు ఖరారైనట్లు సమాచారం. ఈ స్పెషల్ ప్రాజెక్టును కిిశోర్ అనే కొత్త దర్శకుడి చేతికి అప్పగించారట. అతను చెప్పిన కథకు ఇటీవలే చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచాచారం. 25వ చిత్రం కోసం కొంత కాలంగా కథలు వింటున్నాడు చైతూ. ఐతే కొత్త దర్శకుడైన కిశోర్ ఓ వెరైటీ కథతో చైతూను మెప్పించినట్లు సమాచారం. కమర్షియల్ టచ్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇదట. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే చేద్దామని కూడా చూస్తున్నారట. లేదంటే ఏదైనా బయటి బేనర్ కూడా రంగంలోకి దిగొచ్చు.

మరోవైపు చైతూ తండ్రి నాగార్జున ఇంకా పెద్ద మైలురాయి ముంగిట నిలిచారు. హీరోగా ఆయన వందో చిత్రం గురించి చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. తమిళ దర్శకుడైన నవీన్ ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. నాగ్ 100వ సినిమా, చైతూ 25వ సినిమా దాదాపుగా ఒకే సమయంలో సెట్స్ మీదికి వెళ్లేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఇవి పట్టాలెక్కొచ్చు.

This post was last modified on April 2, 2025 6:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అంతమంది హిట్టర్లు ఉన్నా… ఇదేం ఆట?

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన…

2 hours ago

‘గుడ్’ ప్రమోషన్లు చేసుకోవాలి ‘కార్తీక్’

టైటిల్ లో బ్యాడ్ అని పెట్టుకున్నారు కానీ దానికి తగ్గట్టే ప్రమోషన్లలో బాగా వెనుకబడిపోయింది బ్యాడ్ బాయ్ కార్తీక్. శుక్రవారం…

3 hours ago

ప్రతాప్ కష్టం చూస్తే పాపం అనాల్సిందే

ఈ శుక్రవారం అన్నీ చిన్న సినిమాలే విడుదల కాబోతున్నాయి. వాటిలో పాపం ప్రతాప్ ఒకటి. తిరువీర్ హీరోగా నటించిన ఈ…

4 hours ago

క్వాంటం కంప్యూటింగ్‌లో మనదే తొలి అడుగు

అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయ‌నున్న క్వాంటం కంప్యూటింగ్‌లో తొలి అడుగు విజ‌య‌వంతంగా ప‌డింద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. రాజ‌ధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం…

4 hours ago

ఏ కాలంలో ఉన్నారు ధావన్ సాబ్

హీరో వరుణ్ ధావన్ కు అంతో ఇంతో చెప్పుకోదగ్గ ఇమేజ్ ఉంది. అందుకే దర్శకుడు అట్లీ  నిర్మాతగా మారి ఏరికోరి…

5 hours ago

సీట్ల పెంపు… ఒకేసారి 300 సీట్లా?

నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఓ అవగాహనకు వచ్చింది. ఈ నెల 16న మహిళా రిజర్వేషన్ బిల్లుతో…

5 hours ago