Movie News

నవీన్ పోలిశెట్టి సినిమాకు త్రివిక్రమ్ చేయూత

ఇప్పుడున్న యూత్ హీరోల్లో తనదైన టైమింగ్ తో ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. కాకపోతే ప్రతి సినిమాకి ఎక్కువ గ్యాప్ ఉంటుందనే కంప్లయింట్ అభిమానుల నుంచి ఉన్నప్పటికీ క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని పాటించే తన నుంచి ఎక్కువ వేగం ఆశించలేం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ చేస్తున్న మూవీ అనగనగా ఒక రోజు. మారి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. మూడు నెలల క్రితం వచ్చిన అనౌన్స్ మెంట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మ్యాడ్ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం దీని వెనుక పెద్ద కథే ఉంది.

జాతిరత్నాలు బ్లాక్ బస్టరయ్యాక నవీన్ పోలిశెట్టికి డైరెక్టర్ గా డెబ్యూ చేసే ప్రయత్నాల్లో ఉన్న ఉన్న కళ్యాణ్ శంకర్ చెప్పిన కథ అనగనగా ఒక రాజు. సెకండాఫ్ కు సంబంధించి కొన్ని కరెక్షన్లు అవసరమై అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఈలోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మొదలైపోయింది. రెండూ ఒకేసారి జరగడంలోని ఇబ్బందులు గుర్తించిన కళ్యాణ్ శంకర్ ఇంకోవైపు మ్యాడ్ సిద్ధం చేసుకోవడం, అది నాగవంశీకి వినిపించి, ఆయనకు నచ్చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చి చకచకా పూర్తయిపోవడం జరిగింది. అలా మూడేళ్ళ కాలం గడిచిపోయినా అనగనగా ఒక రాజు మీదున్న నవీన్ నమ్మకం ఆ సబ్జెక్టుని వదలకుండా చేసింది.

దీంతో ఆలస్యమైనా సరే మారితో శ్రీకారం చుట్టారు. కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ తయారు చేస్తున్న దశలో ఒక రోజు మొత్తం దీనికి కేటాయించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని కీలక మార్పులు, సలహాలు సూచనలు అందివ్వడంతో మరింత మెరుగ్గా తయారయ్యేందుకు ఉపయోగపడింది. ఇప్పుడు తీస్తున్న వెర్షన్ లోనూ అవి ఉండబోతున్నాయి. సో నవీన్ తో కలిపి మొత్తం నలుగురు క్రియేటర్స్ ఇందులో భాగమయ్యారన్న మాట. అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అనగనగా ఒక రోజు 2026 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు కానీ సితార టీమ్ చెబుతున్న దాని ప్రకారమైతే పండగ బరిలో ఉన్నట్టే.

This post was last modified on April 2, 2025 11:51 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

1 minute ago

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

2 hours ago

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

3 hours ago

ఎండలు…క్రికెట్ మ్యాచులు…థియేటర్లలో ఖాళీ కుర్చీలు

బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…

3 hours ago

అమ‌రావ‌తికి డ‌బ్బే డ‌బ్బు.. మాట‌లు కాదు చేత‌లే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. డ‌బ్బులు ఇచ్చే వారి కోసం స‌ర్కారు ఎదురు చూసింది. గ‌త వైసీపీ…

3 hours ago

అఖండ రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

4 hours ago