Movie News

నవీన్ పోలిశెట్టి సినిమాకు త్రివిక్రమ్ చేయూత

ఇప్పుడున్న యూత్ హీరోల్లో తనదైన టైమింగ్ తో ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. కాకపోతే ప్రతి సినిమాకి ఎక్కువ గ్యాప్ ఉంటుందనే కంప్లయింట్ అభిమానుల నుంచి ఉన్నప్పటికీ క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని పాటించే తన నుంచి ఎక్కువ వేగం ఆశించలేం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ చేస్తున్న మూవీ అనగనగా ఒక రోజు. మారి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. మూడు నెలల క్రితం వచ్చిన అనౌన్స్ మెంట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మ్యాడ్ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం దీని వెనుక పెద్ద కథే ఉంది.

జాతిరత్నాలు బ్లాక్ బస్టరయ్యాక నవీన్ పోలిశెట్టికి డైరెక్టర్ గా డెబ్యూ చేసే ప్రయత్నాల్లో ఉన్న ఉన్న కళ్యాణ్ శంకర్ చెప్పిన కథ అనగనగా ఒక రాజు. సెకండాఫ్ కు సంబంధించి కొన్ని కరెక్షన్లు అవసరమై అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఈలోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మొదలైపోయింది. రెండూ ఒకేసారి జరగడంలోని ఇబ్బందులు గుర్తించిన కళ్యాణ్ శంకర్ ఇంకోవైపు మ్యాడ్ సిద్ధం చేసుకోవడం, అది నాగవంశీకి వినిపించి, ఆయనకు నచ్చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చి చకచకా పూర్తయిపోవడం జరిగింది. అలా మూడేళ్ళ కాలం గడిచిపోయినా అనగనగా ఒక రాజు మీదున్న నవీన్ నమ్మకం ఆ సబ్జెక్టుని వదలకుండా చేసింది.

దీంతో ఆలస్యమైనా సరే మారితో శ్రీకారం చుట్టారు. కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ తయారు చేస్తున్న దశలో ఒక రోజు మొత్తం దీనికి కేటాయించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని కీలక మార్పులు, సలహాలు సూచనలు అందివ్వడంతో మరింత మెరుగ్గా తయారయ్యేందుకు ఉపయోగపడింది. ఇప్పుడు తీస్తున్న వెర్షన్ లోనూ అవి ఉండబోతున్నాయి. సో నవీన్ తో కలిపి మొత్తం నలుగురు క్రియేటర్స్ ఇందులో భాగమయ్యారన్న మాట. అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అనగనగా ఒక రోజు 2026 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు కానీ సితార టీమ్ చెబుతున్న దాని ప్రకారమైతే పండగ బరిలో ఉన్నట్టే.

This post was last modified on April 2, 2025 11:51 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

8 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

9 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

13 hours ago