‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఉత్తరాది అమ్మాయి.. షాలిని పాండే. మన సినిమాల్లో మామూలుగా కనిపించే గ్లామర్ హీరోయిన్లకు భిన్నమైన పాత్రలో ఆమె సటిల్గా యాక్ట్ చేసి మెప్పించింది. బోల్డ్ సీన్లలోనూ ధైర్యంగా నటించింది. ఐతే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్నప్పటికీ షాలిని కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు.
మహానటి, యన్.టి.ఆర్ లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన ఆమె.. 118, ఇద్దరి లోకం ఒకటే లాంటి చిత్రాల్లో కథానాయికగా చేసింది. తొలి సినిమా తర్వాత సరైన బ్రేక్ రాకపోవడంతో ఆమె కనుమరుగైపోయింది. మధ్యలో 100 పర్సంట్ కాదల్ (100 పర్సంట్ లవ్ రీమేక్), గొరిల్లా లాంటి తెలుగు చిత్రాల్లో సైతం నటించింది. ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లు చేసుకుంటున్న షాలిని.. ఓ ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయంతో వార్తల్లోకి వచ్చింది.
తాను నటించిన ఓ దక్షిణాది చిత్రం షూటింగ్ సందర్భంగా దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించింది. తాను వ్యానిటీ వ్యాన్లో బట్టలు మార్చుకుంటుండగా.. కనీసం డోర్ కొట్టకుండా ఆ దర్శకుడు లోపలికి వచ్చేశాడని ఆమె వెల్లడించింది. తన వయసు అప్పుడు 22 ఏళ్లని, ఓ సగటు అమ్మాయిలా అప్పుడు ప్రవర్తించానని.. గట్టిగా అరిచేశానని.. ఆ దర్శకుడిని చెడామడా తిట్టేశానని ఆమె తెలిపింది. అది దక్షిణాది చిత్రం అని మాత్రమే అని చెప్పిన షాలిని.. తెలుగా, తమిళమా అన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో షాలినితో అలా ప్రవర్తించిన దర్శకుడెవరన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
షాలిని నటించిన తెలుగు, తమిళ చిత్రాల లిస్ట్ తీసి.. వాటి దర్శకుల గురించి ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు. షాలిని నటించిన ‘డబ్బా కార్టెల్’ సిరీస్ ఇటీవలే హాట్ స్టార్లో రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంది. ప్రస్తుతం దక్షిణాదిన ఆమెకు అవకాశాలేమీ రావట్లేదు.
This post was last modified on April 1, 2025 3:36 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…