‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఉత్తరాది అమ్మాయి.. షాలిని పాండే. మన సినిమాల్లో మామూలుగా కనిపించే గ్లామర్ హీరోయిన్లకు భిన్నమైన పాత్రలో ఆమె సటిల్గా యాక్ట్ చేసి మెప్పించింది. బోల్డ్ సీన్లలోనూ ధైర్యంగా నటించింది. ఐతే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్నప్పటికీ షాలిని కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు.
మహానటి, యన్.టి.ఆర్ లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన ఆమె.. 118, ఇద్దరి లోకం ఒకటే లాంటి చిత్రాల్లో కథానాయికగా చేసింది. తొలి సినిమా తర్వాత సరైన బ్రేక్ రాకపోవడంతో ఆమె కనుమరుగైపోయింది. మధ్యలో 100 పర్సంట్ కాదల్ (100 పర్సంట్ లవ్ రీమేక్), గొరిల్లా లాంటి తెలుగు చిత్రాల్లో సైతం నటించింది. ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లు చేసుకుంటున్న షాలిని.. ఓ ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయంతో వార్తల్లోకి వచ్చింది.
తాను నటించిన ఓ దక్షిణాది చిత్రం షూటింగ్ సందర్భంగా దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించింది. తాను వ్యానిటీ వ్యాన్లో బట్టలు మార్చుకుంటుండగా.. కనీసం డోర్ కొట్టకుండా ఆ దర్శకుడు లోపలికి వచ్చేశాడని ఆమె వెల్లడించింది. తన వయసు అప్పుడు 22 ఏళ్లని, ఓ సగటు అమ్మాయిలా అప్పుడు ప్రవర్తించానని.. గట్టిగా అరిచేశానని.. ఆ దర్శకుడిని చెడామడా తిట్టేశానని ఆమె తెలిపింది. అది దక్షిణాది చిత్రం అని మాత్రమే అని చెప్పిన షాలిని.. తెలుగా, తమిళమా అన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో షాలినితో అలా ప్రవర్తించిన దర్శకుడెవరన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
షాలిని నటించిన తెలుగు, తమిళ చిత్రాల లిస్ట్ తీసి.. వాటి దర్శకుల గురించి ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు. షాలిని నటించిన ‘డబ్బా కార్టెల్’ సిరీస్ ఇటీవలే హాట్ స్టార్లో రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంది. ప్రస్తుతం దక్షిణాదిన ఆమెకు అవకాశాలేమీ రావట్లేదు.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…