ఇటీవలే విడుదలైన వీరధీరశూర పార్ట్ 2కు పాజిటివ్ టాక్, రివ్యూస్ వచ్చిన మాట వాస్తవం. చూసింది తక్కువ ప్రేక్షకులే అయినా అధిక శాతం బాగుంది ఓసారి చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కలెక్షన్లు ఆ దిశగా లేకపోవడం చియాన్ అభిమానులను తెగ బాధిస్తోంది. తమిళంలో వసూళ్లు బాగానే ఉన్నాయి కానీ మరీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో లేకపోవడం కోలీవుడ్ ట్రేడ్ ని ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి రోజు ఆర్థిక కారణాల వల్ల ఉదయం, మధ్యాన్నం రెండు మూడు షోలు దేశవ్యాప్తంగా క్యాన్సిల్ కావడం చాలా తీవ్ర ప్రభావం చూపించింది. బుక్ చేసుకుని రీ ఫండ్ అందుకున్న చాలామంది మళ్ళీ టికెట్లు కొనలేదు.
నిజం చెప్పాలంటే చాలా గ్యాప్ తర్వాత విక్రమ్ ఒక ప్రాపర్ మాస్ మూవీలో కనిపించాడు. కంటెంట్ పరంగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అవి మరీ తీవ్రంగా లేనందు వల్ల డీసెంట్ టాక్ సాధ్యమయ్యింది. కానీ అది బాక్సాఫీస్ దగ్గర టికెట్లు తెంపేందుకు ఉపయోగపడలేదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో వీరధీరశూర ఎదురీదుతోంది. మ్యాడ్ స్క్వేర్ ప్రభంజనం ఒకవైపు, ఎల్2 ఎంపురాన్ కు దక్కిన మంచి రిలీజ్, రాబిన్ హుడ్ థియేటర్ల కేటాయింపు తదితర కారణాలు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ చూపించాయి. మెల్లగా అయినా పికప్ అవుతుందనే అంచనాలకు భిన్నంగా ఆది సోమవారం సెలవుల్లో ఏ మేజిక్ జరగలేదు.
ఫైనల్ గా చెప్పాలంటే విక్రమ్ కష్టమైతే పడ్డాడు కానీ మళ్ళీ దెబ్బ తిన్నాడు. పోనీ తమిళంలో రికార్డులు బద్దలు కొడితే సంతోషించే వాడేమో కానీ అక్కడా డీసెంట్ హిట్ దగ్గరే ఆగిపోయేలా ఉందని ట్రేడ్ అభిప్రాయం. పోటీ వల్ల ఇలా జరిగిందా లేక ఇంకేదైనా కారణమా అనేది పక్కనపెడితే విక్రమ్ శ్రమ మాత్రం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. తంగలాన్ దర్శకుడి వల్ల, కోబ్రా కంటెంట్ లో కన్ఫ్యూజన్ వల్ల, పొన్నియిన్ సెల్వన్ మల్టీస్టారర్ కావడం వల్ల ఇలా ఎన్నో కారణాలు విక్రమ్ కు సోలో క్రెడిట్ రాకుండా అడ్డుపడ్డాయి. గౌతమ్ మీనన్ ధృవ నక్షత్రం అసలు ఏడు సంవత్సరాల నుంచి ల్యాబులోనే మగ్గిపోవడం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on April 1, 2025 3:44 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…