హర్షవర్ధన్ రాణె గుర్తున్నాడా.. నటి భూమిక నిర్మించిన ‘తకిట తకిట’తో అతను హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘మాయ’ అనే నీలకంఠ సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు. ఉత్తరాది వాడే అయినా ఎక్కువగా సినిమాలు చేసింది తెలుగులోనే. మధ్యలో బాలీవుడ్లో అవకాశాలు వస్తే అటు వెళ్లిపోయాడు. హీరోగా అక్కడ కొన్ని సినిమాలు చేశాడు.
ఐతే సినిమాలతో కంటే వ్యక్తిగత వ్యవహారాలతోనే రాణె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. మంచి ఫిజిక్ ఉన్న, అందగాడైన రాణెతో కొంత కాలం బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల డేటింగ్ చేసింది. వాళ్లు ఒక దశలో పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ తన బేస్ను ముంబయికి మార్చాక రాణె.. జ్వాలకు దూరమయ్యాడు. ఆమె కూడా కొత్త తోడును వెతుక్కుంది. తమిళ నటుడు విష్ణు విశాల్తో ప్రేమలో పడి.. ఇటీవలే అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది.
రాణె విషయానికి వస్తే.. ముంబయికి వెళ్లిన కొంత కాలానికే ఒకప్పటి కథానాయిక ‘ఖడ్గం’లోనూ నటించిన కిమ్ శర్మతో ప్రేమలో పడ్డాడు. ఆమె ఒకప్పుడు క్రికెటర్ యువరాజ్ సింగ్తో డేటింగ్ చేసింది. తర్వాత ఇంకెవరితోనో రిలేషన్షిప్ అన్నారు. రాణె పరిచయమయ్యాక ఇద్దరూ బాగా దగ్గరైపోయారు. ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమైనట్లు కూడా కనిపించారు. కానీ చివరికి ఈ బంధం కూడా నిలబడలేదు. కిమ్ నుంచి తాను విడిపోయినట్లు రాణె స్వయంగా సోషల్ మీడియా పోస్టుతో వెల్లడించాడు.
‘‘నీతో గడిపిన సమయం అద్భుతంగా సాగింది. ఆ దేవుడు నిన్నూ, నన్ను దీవించాలని కోరుకుంటున్నా. సెలవు’’ అనే మెసేజ్తో కిమ్తో తన ప్రేమాయణం ముగిసిందని సంకేతాలిచ్చాడు రాణె. తాము విడిపోవడానికి బలమైన కారణమే ఉందని రాణె చెప్పాడు. కిమ్ నుంచి విడిపోతూ ఆమె గురించి చాలా మంచి మాటలే చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నాడు రాణె.
This post was last modified on October 30, 2020 6:31 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…