టాలీవుడ్లో ఎవ్వరూ ఊహించని ఒక కాంబినేషన్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ కింగ్గా అభిమానులు పిలుచుకునే తమిళ సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటించనున్నాడట. చైతూ హీరోగా ఒక భారీ యాక్షన్ సినిమా చేయాలని అర్జున్ భావిస్తున్నాడట. అక్కినేని వారసుడికి కథ కూడా చెప్పాడని.. అతను ఆసక్తితోనే ఉన్నాడని.. త్వరలోనే దీని గురించి ప్రకటన ఉండొచ్చని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇది చూసి అర్జున్ ఏంటి.. చైతూను డైరెక్ట్ చేయడమేంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అర్జున్కు దర్శకత్వంలో అనుభవం లేకుండా ఏమీ లేదు. ‘జైహింద్’తో పాటు తాను హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా వరకు పోలీస్-దేశభక్తి కథలే. ఐతే హీరోగా సినిమాలు తగ్గించేశాక దర్శకత్వానికి దూరం అయిపోయాడు అర్జున్. ఇప్పుడు అర్జున్ నటించడమే తగ్గిపోయింది.
ఇలాంటి సమయంలో మళ్లీ దర్శకత్వం అంటుండటం, అది కూడా మన చైతన్యను హీరోగా పెట్టి యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడన్న ప్రచారం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైతూకు యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని మహా సరదా. కెరీర్ ఆరంభం నుంచి ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురవుతోంది. దీంతో తనకు సెట్టయ్యే లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పరిమితం అవుతున్నాడు.
చివరగా చైతూ చేసిన యాక్షన్ మూవీ ‘యుద్ధం శరణం’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ తర్వాత ఆ జానర్ జోలికి వెళ్లలేదు. గత ఏడాది ‘మజిలీ’తో విజయాన్నందుకున్న అతను.. ‘లవ్ స్టోరి’ పేరుతో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో ప్రేమకథ చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఇటీవలే ‘థ్యాంక్యూ’ సినిమాను కూడా మొదలుపెట్టాడు. మరి అర్జున్తో అతడి సినిమా అంటూ వస్తున్న వార్తలు ఎంత వరకు నిజమో చూడాలి.
This post was last modified on October 30, 2020 6:31 pm
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…