Movie News

మోక్షజ్ఞ ప్రవేశం ఇంకాస్త ఆలస్యం

నందమూరి అభిమానులు ఎదురుచూసే కొద్దీ మోక్షజ్ఞ ఎంట్రీ లేట్ అవుతూనే ఉంది. గత ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ ప్రకటించి, ఫోటో షూట్ చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. రేపు పూజ అనగా ముందు రోజు రాత్రి క్యాన్సిల్ చేశారు. కొంత అనారోగ్యంతో పాటు మంచి ముహూర్తం కోసం వాయిదా వేశామని బాలయ్య చెప్పినప్పటికీ ఆ తర్వాత సంక్రాంతి, ఉగాది పండుగలు వచ్చి వెళ్లాయి కానీ ఫ్యాన్స్ ఎదురు చూసింది మాత్రం జరగలేదు. ఇంకోవైపు ప్రశాంత్ వర్మ తన ప్రొడక్షన్ సినిమాలతో పాటు జై హనుమాన్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఇంకో రెండేళ్ల వరకు దొరకడం అనుమానమే.

రెండో సినిమా టేకప్ చేస్తాడని ప్రచారం జరిగిన వెంకీ అట్లూరి కోలీవుడ్ హీరో సూర్యతో కమిటైపోయాడు. ఆ తర్వాత చిరంజీవి, దుల్కర్ సల్మాన్, ధనుష్ లకు వేర్వేరు కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. సో ఈ ఛాన్స్ లేనట్టే. మరో మోక్షజ్ఞ కోసం ఏ దర్శకుడు అందుబాటులో ఉంటాడంటే చెప్పడం కష్టమనేలా పరిస్థితి మారిపోయింది. ఇంతకు ముందు తరచు బయట కనిపించే మోక్షజ్ఞ ఇప్పుడు ఆ దర్శనం కూడా ఇవ్వడం లేదు. మూడు పదుల వయసు అందుకున్న మోక్షు ఇప్పటికే చాలా వెయిట్ చేయించాడని, ఇకనైనా త్వరగా నిర్ణయాలు తీసుకోమని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఆదిత్య 369 సీక్వెల్ తప్పకుండ ఉంటుందని బాలయ్య నిన్న రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అందులో మోక్షజ్ఞ ఉంటాడని నెలల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు కానీ నిన్న ఆ ప్రస్తావన రాలేదు. జస్ట్ సీక్వెల్ కన్ఫర్మ్ చేసి టాపిక్ అక్కడితో ముగించారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ నిజంగానే సీరియస్ గా పరిశ్రమలోకి రావాలనుకుంటున్నాడా లేదానేది వీలైనంత త్వరగా డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో మార్కెట్ సృష్టించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఒక్క సినిమాతో అయ్యేపని కాదు. బాలయ్య కార్డు డెబ్యూకి పనికొస్తుంది కానీ ఆ తర్వాత కష్టపడాల్సింది మోక్షజ్ఞనే. ఈ సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో.

This post was last modified on March 31, 2025 8:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

44 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago