నందమూరి అభిమానులు ఎదురుచూసే కొద్దీ మోక్షజ్ఞ ఎంట్రీ లేట్ అవుతూనే ఉంది. గత ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ ప్రకటించి, ఫోటో షూట్ చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. రేపు పూజ అనగా ముందు రోజు రాత్రి క్యాన్సిల్ చేశారు. కొంత అనారోగ్యంతో పాటు మంచి ముహూర్తం కోసం వాయిదా వేశామని బాలయ్య చెప్పినప్పటికీ ఆ తర్వాత సంక్రాంతి, ఉగాది పండుగలు వచ్చి వెళ్లాయి కానీ ఫ్యాన్స్ ఎదురు చూసింది మాత్రం జరగలేదు. ఇంకోవైపు ప్రశాంత్ వర్మ తన ప్రొడక్షన్ సినిమాలతో పాటు జై హనుమాన్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఇంకో రెండేళ్ల వరకు దొరకడం అనుమానమే.
రెండో సినిమా టేకప్ చేస్తాడని ప్రచారం జరిగిన వెంకీ అట్లూరి కోలీవుడ్ హీరో సూర్యతో కమిటైపోయాడు. ఆ తర్వాత చిరంజీవి, దుల్కర్ సల్మాన్, ధనుష్ లకు వేర్వేరు కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. సో ఈ ఛాన్స్ లేనట్టే. మరో మోక్షజ్ఞ కోసం ఏ దర్శకుడు అందుబాటులో ఉంటాడంటే చెప్పడం కష్టమనేలా పరిస్థితి మారిపోయింది. ఇంతకు ముందు తరచు బయట కనిపించే మోక్షజ్ఞ ఇప్పుడు ఆ దర్శనం కూడా ఇవ్వడం లేదు. మూడు పదుల వయసు అందుకున్న మోక్షు ఇప్పటికే చాలా వెయిట్ చేయించాడని, ఇకనైనా త్వరగా నిర్ణయాలు తీసుకోమని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఆదిత్య 369 సీక్వెల్ తప్పకుండ ఉంటుందని బాలయ్య నిన్న రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అందులో మోక్షజ్ఞ ఉంటాడని నెలల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు కానీ నిన్న ఆ ప్రస్తావన రాలేదు. జస్ట్ సీక్వెల్ కన్ఫర్మ్ చేసి టాపిక్ అక్కడితో ముగించారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ నిజంగానే సీరియస్ గా పరిశ్రమలోకి రావాలనుకుంటున్నాడా లేదానేది వీలైనంత త్వరగా డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో మార్కెట్ సృష్టించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఒక్క సినిమాతో అయ్యేపని కాదు. బాలయ్య కార్డు డెబ్యూకి పనికొస్తుంది కానీ ఆ తర్వాత కష్టపడాల్సింది మోక్షజ్ఞనే. ఈ సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో.
This post was last modified on March 31, 2025 8:38 pm
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశాడో తెలిసిందే. ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి…
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…