నందమూరి అభిమానులు ఎదురుచూసే కొద్దీ మోక్షజ్ఞ ఎంట్రీ లేట్ అవుతూనే ఉంది. గత ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ ప్రకటించి, ఫోటో షూట్ చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. రేపు పూజ అనగా ముందు రోజు రాత్రి క్యాన్సిల్ చేశారు. కొంత అనారోగ్యంతో పాటు మంచి ముహూర్తం కోసం వాయిదా వేశామని బాలయ్య చెప్పినప్పటికీ ఆ తర్వాత సంక్రాంతి, ఉగాది పండుగలు వచ్చి వెళ్లాయి కానీ ఫ్యాన్స్ ఎదురు చూసింది మాత్రం జరగలేదు. ఇంకోవైపు ప్రశాంత్ వర్మ తన ప్రొడక్షన్ సినిమాలతో పాటు జై హనుమాన్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఇంకో రెండేళ్ల వరకు దొరకడం అనుమానమే.
రెండో సినిమా టేకప్ చేస్తాడని ప్రచారం జరిగిన వెంకీ అట్లూరి కోలీవుడ్ హీరో సూర్యతో కమిటైపోయాడు. ఆ తర్వాత చిరంజీవి, దుల్కర్ సల్మాన్, ధనుష్ లకు వేర్వేరు కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. సో ఈ ఛాన్స్ లేనట్టే. మరో మోక్షజ్ఞ కోసం ఏ దర్శకుడు అందుబాటులో ఉంటాడంటే చెప్పడం కష్టమనేలా పరిస్థితి మారిపోయింది. ఇంతకు ముందు తరచు బయట కనిపించే మోక్షజ్ఞ ఇప్పుడు ఆ దర్శనం కూడా ఇవ్వడం లేదు. మూడు పదుల వయసు అందుకున్న మోక్షు ఇప్పటికే చాలా వెయిట్ చేయించాడని, ఇకనైనా త్వరగా నిర్ణయాలు తీసుకోమని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఆదిత్య 369 సీక్వెల్ తప్పకుండ ఉంటుందని బాలయ్య నిన్న రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అందులో మోక్షజ్ఞ ఉంటాడని నెలల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు కానీ నిన్న ఆ ప్రస్తావన రాలేదు. జస్ట్ సీక్వెల్ కన్ఫర్మ్ చేసి టాపిక్ అక్కడితో ముగించారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ నిజంగానే సీరియస్ గా పరిశ్రమలోకి రావాలనుకుంటున్నాడా లేదానేది వీలైనంత త్వరగా డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో మార్కెట్ సృష్టించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఒక్క సినిమాతో అయ్యేపని కాదు. బాలయ్య కార్డు డెబ్యూకి పనికొస్తుంది కానీ ఆ తర్వాత కష్టపడాల్సింది మోక్షజ్ఞనే. ఈ సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో.
This post was last modified on March 31, 2025 8:38 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…