Movie News

తమ్ముడు త్వరగా రావడం సేఫేనా

నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్ ని తీసుకొచ్చి పబ్లిసిటీలో భాగం చేసినా లాభం లేకపోయింది. మంచి వినోదం ఇస్తాడని పేరు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ కుడుముల నుంచి ఇలాంటి అవుట్ పుట్ రావడం చూసి ఇండస్ట్రీ జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి తర్వాత ఎంటర్ టైన్మెంట్ పరంగా అంత ముద్ర ఇతను వేయగలడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పుడది తగ్గింది. ఇంకోవైపు ఫ్లాపులకు అడ్డుకట్ట పడుతుందనుకున్న నితిన్ మళ్ళీ ఎదురుచూపుల్లో ఉండాల్సి వస్తోంది.

దీని సంగతలా ఉంచితే నితిన్ తర్వాతి సినిమా తమ్ముడు సిద్ధమవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో పెద్ద బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసమే రెండు కోట్లు ఖర్చు పెట్టారనే వార్త ఆ మధ్య హాట్ టాపిక్ గా మారింది. వకీల్ సాబ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈసారి ఫ్యామిలీ ఎలిమెంట్స్, యాక్షన్ మిక్స్ చేసుకుని తమ్ముడు రాసుకున్నాడు. అక్క తమ్ముడు సెంటిమెంట్ ఓ రేంజ్ లో పేలుతుందని ఇన్ సైడ్ టాక్. సీనియర్ నటి లయ, నితిన్ కాంబో చాలా బాగా వచ్చిందని అంటున్నారు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.

ఇక్కడిదాకా బాగానే ఉంది తమ్ముడుని త్వరగా తీసుకురావడం సేఫేనా అంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే నితిన్ కు అర్జెంట్ గా డ్యామేజ్ రిపేర్ జరగాలి. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో మళ్ళీ రేసులోకి తిరిగి రావాలి. ఎలాగూ ఎల్లమ్మకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈలోగా ఒక పెద్ద హిట్టుతో బ్రేక్ తీసుకుంటే బిజినెస్ పరంగా తర్వాతి చిత్రాలకు ఉపయోగపడుతుంది. ట్రైలర్ చూశాక అంచనాలు మారిపోతాయని దిల్ రాజు తన సన్నిహితులతో అంటున్న మాట హైప్ పెంచుతోంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల హరిహర వీరమల్లు కనక మే 9 రాకపోతే తమ్ముడుని అదే డేట్ కి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

This post was last modified on March 30, 2025 8:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago