నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్ ని తీసుకొచ్చి పబ్లిసిటీలో భాగం చేసినా లాభం లేకపోయింది. మంచి వినోదం ఇస్తాడని పేరు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ కుడుముల నుంచి ఇలాంటి అవుట్ పుట్ రావడం చూసి ఇండస్ట్రీ జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి తర్వాత ఎంటర్ టైన్మెంట్ పరంగా అంత ముద్ర ఇతను వేయగలడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పుడది తగ్గింది. ఇంకోవైపు ఫ్లాపులకు అడ్డుకట్ట పడుతుందనుకున్న నితిన్ మళ్ళీ ఎదురుచూపుల్లో ఉండాల్సి వస్తోంది.
దీని సంగతలా ఉంచితే నితిన్ తర్వాతి సినిమా తమ్ముడు సిద్ధమవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో పెద్ద బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసమే రెండు కోట్లు ఖర్చు పెట్టారనే వార్త ఆ మధ్య హాట్ టాపిక్ గా మారింది. వకీల్ సాబ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈసారి ఫ్యామిలీ ఎలిమెంట్స్, యాక్షన్ మిక్స్ చేసుకుని తమ్ముడు రాసుకున్నాడు. అక్క తమ్ముడు సెంటిమెంట్ ఓ రేంజ్ లో పేలుతుందని ఇన్ సైడ్ టాక్. సీనియర్ నటి లయ, నితిన్ కాంబో చాలా బాగా వచ్చిందని అంటున్నారు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.
ఇక్కడిదాకా బాగానే ఉంది తమ్ముడుని త్వరగా తీసుకురావడం సేఫేనా అంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే నితిన్ కు అర్జెంట్ గా డ్యామేజ్ రిపేర్ జరగాలి. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో మళ్ళీ రేసులోకి తిరిగి రావాలి. ఎలాగూ ఎల్లమ్మకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈలోగా ఒక పెద్ద హిట్టుతో బ్రేక్ తీసుకుంటే బిజినెస్ పరంగా తర్వాతి చిత్రాలకు ఉపయోగపడుతుంది. ట్రైలర్ చూశాక అంచనాలు మారిపోతాయని దిల్ రాజు తన సన్నిహితులతో అంటున్న మాట హైప్ పెంచుతోంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల హరిహర వీరమల్లు కనక మే 9 రాకపోతే తమ్ముడుని అదే డేట్ కి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…