Movie News

అర్ధరాత్రి వేళ సికందర్ పైరసీ కలకలం

ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్ ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం దర్శక నిర్మాతల్లో కనిపించింది. అయితే ఇండియాలో మొదటి షో పడకముందే అర్ధరాత్రి పైరసీ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ తిన్నారు. సమాచారం అందుకున్న నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా వేంటనే రంగంలోకి దిగి తన బృందం సహాయంతో ఆరు వందలకు పైగా సైట్లలో లింకులు తీయించినా సరే అప్పటికే ప్రింట్ రకరకాల మాధ్యమాల ద్వారా వైరలైపోయి చాలా దూరం వెళ్ళింది.

ఇది ఒకరకంగా ఇండస్ట్రీ చివరి ప్రమాద హెచ్చరికగా చెప్పాలి. ఎందుకంటే నిర్మాతలు ఇప్పటికైనా తమకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించకపోతే భవిష్యత్తులో ఇవాళ మౌనంగా ఉన్న వాళ్లే బాధితులుగా మారొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే అసలు మూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి. విదేశీ సర్వర్లు అయినా సరే ఐపి అడ్రెస్ ద్వారా అక్కడి ప్రభుత్వాలకు సమస్యని విన్నవించి నిందితులకు శిక్షలు పడేలా చూడాలి. స్పష్టమైన ఆడియోతో హెచ్డి ప్రింట్లు ఇలా వచ్చేయడం గత ఆరేడు నెలల నుంచి ఎక్కువయ్యింది. గేమ్ ఛేంజర్, పుష్ప 2, డాకు మహారాజ్ ఇలా అన్ని వీటిబారిన పడి నష్టపోయినవే.

గతంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సైతం రిలీజ్ కు ముందే ప్రింట్ బయటికి రావడం అప్పట్లో సంచలనం. ఆ టైంలో ఫైవ్ జి, ఇంటర్ నెట్ ఇప్పుడంతా స్పీడ్ తో అందరికి అందుబాటులో లేవు. కానీ ఇప్పుడలా కాదు. టెలిగ్రామ్ లాంటి ఒక యాప్ ఉంటే చాలు సర్వం వచ్చి పడుతోంది. సికందర్ కు నెగటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో వచ్చే వసూళ్లను కాపాడుకోవాలి అంటే ముందా పైరసీకి అడ్డుకట్ట చేయాలి. వందల కోట్లుపెట్టువాడి పెట్టే నిర్మాత, కష్టపడే తత్వమున్న దర్శకులు ఇలా వీళ్ళ శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇప్పటికైనా అందరూ పైరసీ తీవ్రతన గుర్తించడం అత్యవసరం.

Kumar

Recent Posts

1500 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…

3 minutes ago

విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…

23 minutes ago

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

2 hours ago

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

8 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

8 hours ago

రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు..…

9 hours ago