ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్ ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం దర్శక నిర్మాతల్లో కనిపించింది. అయితే ఇండియాలో మొదటి షో పడకముందే అర్ధరాత్రి పైరసీ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ తిన్నారు. సమాచారం అందుకున్న నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా వేంటనే రంగంలోకి దిగి తన బృందం సహాయంతో ఆరు వందలకు పైగా సైట్లలో లింకులు తీయించినా సరే అప్పటికే ప్రింట్ రకరకాల మాధ్యమాల ద్వారా వైరలైపోయి చాలా దూరం వెళ్ళింది.
ఇది ఒకరకంగా ఇండస్ట్రీ చివరి ప్రమాద హెచ్చరికగా చెప్పాలి. ఎందుకంటే నిర్మాతలు ఇప్పటికైనా తమకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించకపోతే భవిష్యత్తులో ఇవాళ మౌనంగా ఉన్న వాళ్లే బాధితులుగా మారొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే అసలు మూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి. విదేశీ సర్వర్లు అయినా సరే ఐపి అడ్రెస్ ద్వారా అక్కడి ప్రభుత్వాలకు సమస్యని విన్నవించి నిందితులకు శిక్షలు పడేలా చూడాలి. స్పష్టమైన ఆడియోతో హెచ్డి ప్రింట్లు ఇలా వచ్చేయడం గత ఆరేడు నెలల నుంచి ఎక్కువయ్యింది. గేమ్ ఛేంజర్, పుష్ప 2, డాకు మహారాజ్ ఇలా అన్ని వీటిబారిన పడి నష్టపోయినవే.
గతంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సైతం రిలీజ్ కు ముందే ప్రింట్ బయటికి రావడం అప్పట్లో సంచలనం. ఆ టైంలో ఫైవ్ జి, ఇంటర్ నెట్ ఇప్పుడంతా స్పీడ్ తో అందరికి అందుబాటులో లేవు. కానీ ఇప్పుడలా కాదు. టెలిగ్రామ్ లాంటి ఒక యాప్ ఉంటే చాలు సర్వం వచ్చి పడుతోంది. సికందర్ కు నెగటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో వచ్చే వసూళ్లను కాపాడుకోవాలి అంటే ముందా పైరసీకి అడ్డుకట్ట చేయాలి. వందల కోట్లుపెట్టువాడి పెట్టే నిర్మాత, కష్టపడే తత్వమున్న దర్శకులు ఇలా వీళ్ళ శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇప్పటికైనా అందరూ పైరసీ తీవ్రతన గుర్తించడం అత్యవసరం.
This post was last modified on March 30, 2025 1:45 pm
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…