ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న స్పోర్ట్స్ స్టార్లతో తెలుగు సినిమాల్లో అతిథి పాత్రలను చేయించడం మంచి ఆలోచనే. కానీ కథకు ఎంత వరకు సూటవుతాయి, ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది బాగా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా నటించరు. కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చుకోవాలి. పైగా అదనపు ఖర్చులు. ఇవన్నీ తట్టుకోవడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నారంటే కారణం ఆయా దర్శకుల మీద నిర్మాతల నమ్మకమే. మూడేళ్ళ క్రితం విజయ్ దేవరకొండ లైగర్ కోసం సుప్రసిద్ధ బాక్సర్ మైక్ టైసన్ ని తీసుకొచ్చి మాములు హడావిడి చేయలేదు. తీరా చూస్తే ఆయన పాత్రే మూవీకి మైనస్ అయ్యింది.
నిన్న రాబిన్ హుడ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ దర్శనమిచ్చాడు. ఇదేదో వరల్డ్ వైడ్ సెన్సేషన్ అనే రేంజ్ లో ప్రమోషన్లలో ఈ క్యామియో గురించి ఊదరగొట్టారు. తనకోసమే థియేటర్లకొచ్చి టికెట్లు కొంటారనే రేంజ్ లో పబ్లిసిటీ చేసుకున్నారు. తీరా చూస్తే క్లైమాక్స్ లో వచ్చే వార్నర్ నిరాశపరిచాడు. అది కూడా కొన్ని నిమిషాల పాటే కావడం ఫ్యాన్స్ ని ఉసురూమనిపించింది. దానికి తోడు రాబిన్ హుడ్ రిపోర్ట్స్ కూడా మిశ్రమంగా ఉండటంతో ఫైనల్ రిజల్ట్ గురించి టీమ్ ఆందోళనగా ఉంది. మార్నింగ్ షోలో `డేవిడ్ వార్నర్ ఎంట్రీకి భీభత్సమైన రెస్పాన్స్ కనిపించలేదు. కంటెంట్ వల్ల అప్పటికే కలిగిన ఫీలింగ్ దాన్ని తగ్గించేసింది.
దర్శకులు ఒకటి గుర్తుంచుకోవడం అవసరం. ఎంత ఇంటర్నేషనల్ స్టార్స్ అయినా సరే వాళ్లకు తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఇప్పటి తరంలో ఎంత ఫాలోయింగ్ ఉందో గుర్తు చేసుకోవడం అవసరం. మైక్ టైసన్ పాత జనరేషన్ కు ఆరాధ్యుడే కానీ ఇప్పుడు కాదు. పైగా వివాదాల్లోనూ ఉన్నాడు. డేవిడ్ వార్నర్ కు మన దగ్గర ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ కున్నంత అభిమాన గణం లేదు. అలాంటప్పుడు అతన్ని చూసి తెలుగు ఆడియెన్స్ ఊగిపోతారనుకోవడం లాజిక్ కు అందనిది. అంతగా క్రికెట్ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలంటే మనోళ్లను తీసుకున్నా ఓ రేంజ్ లో ప్లస్ అయ్యేది కానీ ఆస్ట్రేలియా నుంచి పట్టుకురావడం వల్ల ఒరిగింది శూన్యం.
This post was last modified on March 29, 2025 11:12 am
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…