ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న స్పోర్ట్స్ స్టార్లతో తెలుగు సినిమాల్లో అతిథి పాత్రలను చేయించడం మంచి ఆలోచనే. కానీ కథకు ఎంత వరకు సూటవుతాయి, ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది బాగా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా నటించరు. కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చుకోవాలి. పైగా అదనపు ఖర్చులు. ఇవన్నీ తట్టుకోవడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నారంటే కారణం ఆయా దర్శకుల మీద నిర్మాతల నమ్మకమే. మూడేళ్ళ క్రితం విజయ్ దేవరకొండ లైగర్ కోసం సుప్రసిద్ధ బాక్సర్ మైక్ టైసన్ ని తీసుకొచ్చి మాములు హడావిడి చేయలేదు. తీరా చూస్తే ఆయన పాత్రే మూవీకి మైనస్ అయ్యింది.
నిన్న రాబిన్ హుడ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ దర్శనమిచ్చాడు. ఇదేదో వరల్డ్ వైడ్ సెన్సేషన్ అనే రేంజ్ లో ప్రమోషన్లలో ఈ క్యామియో గురించి ఊదరగొట్టారు. తనకోసమే థియేటర్లకొచ్చి టికెట్లు కొంటారనే రేంజ్ లో పబ్లిసిటీ చేసుకున్నారు. తీరా చూస్తే క్లైమాక్స్ లో వచ్చే వార్నర్ నిరాశపరిచాడు. అది కూడా కొన్ని నిమిషాల పాటే కావడం ఫ్యాన్స్ ని ఉసురూమనిపించింది. దానికి తోడు రాబిన్ హుడ్ రిపోర్ట్స్ కూడా మిశ్రమంగా ఉండటంతో ఫైనల్ రిజల్ట్ గురించి టీమ్ ఆందోళనగా ఉంది. మార్నింగ్ షోలో `డేవిడ్ వార్నర్ ఎంట్రీకి భీభత్సమైన రెస్పాన్స్ కనిపించలేదు. కంటెంట్ వల్ల అప్పటికే కలిగిన ఫీలింగ్ దాన్ని తగ్గించేసింది.
దర్శకులు ఒకటి గుర్తుంచుకోవడం అవసరం. ఎంత ఇంటర్నేషనల్ స్టార్స్ అయినా సరే వాళ్లకు తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఇప్పటి తరంలో ఎంత ఫాలోయింగ్ ఉందో గుర్తు చేసుకోవడం అవసరం. మైక్ టైసన్ పాత జనరేషన్ కు ఆరాధ్యుడే కానీ ఇప్పుడు కాదు. పైగా వివాదాల్లోనూ ఉన్నాడు. డేవిడ్ వార్నర్ కు మన దగ్గర ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ కున్నంత అభిమాన గణం లేదు. అలాంటప్పుడు అతన్ని చూసి తెలుగు ఆడియెన్స్ ఊగిపోతారనుకోవడం లాజిక్ కు అందనిది. అంతగా క్రికెట్ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలంటే మనోళ్లను తీసుకున్నా ఓ రేంజ్ లో ప్లస్ అయ్యేది కానీ ఆస్ట్రేలియా నుంచి పట్టుకురావడం వల్ల ఒరిగింది శూన్యం.
This post was last modified on March 29, 2025 11:12 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…