Movie News

ఆఫర్లు ఇస్తే తప్ప టికెట్లు కొనరా

బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. మాములుగా మన దగ్గర స్టార్ హీరో రిలీజ్ ఉందంటే టికెట్ రేట్లు రెండు మూడు వందలు పెంచినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే కొనేస్తాం. ఆ మధ్య పుష్ప 2 ప్రీమియర్లు ఎనిమిది వందలన్నా సై అన్న అభిమానులు లక్షల్లో ఉన్నారు. కానీ హిందీలో అలా ఉండదు. సల్మాన్ ఖాన్ ఎంత పెద్ద స్టారో చెప్పనక్కర్లేదు. సికందర్ విడుదలంటే హడావిడి ఓ రేంజ్ లో ఉండాలి. ఓపెనింగ్స్ అదిరిపోవాలి. టికెట్లు కొనేందుకు పబ్లిక్ ఎగబడాలి. కానీ ఇంత పెద్ద స్టార్ కు సైతం జనాలను రప్పించేందుకు ఆఫర్లు ఇవ్వక తప్పడం లేదు.

మ్యాటర్ ఏంటంటే సికందర్ మొదటి రోజే చూడాలన్నా స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఉదాహరణకు డిస్ట్రిక్ట్ యాప్ లో ఒక్కో యుజర్ కి ఫ్లాట్ 150 రూపాయలు కూపన్ ఇచ్చేస్తున్నారు. రెండు టికెట్లు కొంటే ఇది వర్తిస్తుందన్న మాట. బిసి సెంటర్స్ లో ఈ లెక్క ప్రకారం ఒక టికెట్ ఉచితంగా వచ్చినట్టే. అసలు సల్మాన్ రేంజుకు ఇలా చేయాల్సిన అవసరం ఉందా అంటే బజ్ తక్కువగా ఉన్నప్పుడు తప్పదు మరి. అయినా ఇలా జరగడం అక్కడ కొత్తేమి కాదు. ఆ మధ్య స్కై ఫోర్స్ కు కార్పొరేట్ బుకింగ్స్ చేశారనే కామెంట్స్ జోరుగా వినిపించాయి. రోజుల తరబడి చేసినా అది బ్లాక్ బస్టర్ కాలేకపోవడం వేరే స్టోరీ.

వన్ ప్లస్ వన్, కేవలం వంద రూపాయల మల్టీప్లెక్స్ టికెట్, నేషనల్ సినిమా డే ఇలా రకరకాల పేర్లతో పబ్లిక్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం నార్త్ లో సర్వ సాధారణం అయిపోయింది. ఇంత చేసినా థియేటర్లు కిక్కిరిసిపోవడం లేదు. చావా, స్త్రీ 2, యానిమల్ లాగా యునానిమస్ టాక్ వస్తే ఏ ఇబ్బంది లేదు కానీ యావరేజ్ అన్నా సరే టికెట్లు తెగడం మహా కష్టంగా మారిపోయింది. మన సౌత్ లోనూ చిన్న సినిమాలకు ఇలాంటి స్ట్రాటజీలు ప్రయత్నించాలి. పెద్ద వాటికి అవసరం లేదు కానీ హైప్ లేని చిత్రాలకు ఆఫర్లు ఇవ్వడం ద్వారా అంతో ఇంతో ఆక్యుపెన్సీని పెంచొచ్చు. ఆ దిశగా ఆలోచిస్తే ఫలితాలు అందుకోవచ్చు.

This post was last modified on March 28, 2025 10:22 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

35 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago