బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. మాములుగా మన దగ్గర స్టార్ హీరో రిలీజ్ ఉందంటే టికెట్ రేట్లు రెండు మూడు వందలు పెంచినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే కొనేస్తాం. ఆ మధ్య పుష్ప 2 ప్రీమియర్లు ఎనిమిది వందలన్నా సై అన్న అభిమానులు లక్షల్లో ఉన్నారు. కానీ హిందీలో అలా ఉండదు. సల్మాన్ ఖాన్ ఎంత పెద్ద స్టారో చెప్పనక్కర్లేదు. సికందర్ విడుదలంటే హడావిడి ఓ రేంజ్ లో ఉండాలి. ఓపెనింగ్స్ అదిరిపోవాలి. టికెట్లు కొనేందుకు పబ్లిక్ ఎగబడాలి. కానీ ఇంత పెద్ద స్టార్ కు సైతం జనాలను రప్పించేందుకు ఆఫర్లు ఇవ్వక తప్పడం లేదు.
మ్యాటర్ ఏంటంటే సికందర్ మొదటి రోజే చూడాలన్నా స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఉదాహరణకు డిస్ట్రిక్ట్ యాప్ లో ఒక్కో యుజర్ కి ఫ్లాట్ 150 రూపాయలు కూపన్ ఇచ్చేస్తున్నారు. రెండు టికెట్లు కొంటే ఇది వర్తిస్తుందన్న మాట. బిసి సెంటర్స్ లో ఈ లెక్క ప్రకారం ఒక టికెట్ ఉచితంగా వచ్చినట్టే. అసలు సల్మాన్ రేంజుకు ఇలా చేయాల్సిన అవసరం ఉందా అంటే బజ్ తక్కువగా ఉన్నప్పుడు తప్పదు మరి. అయినా ఇలా జరగడం అక్కడ కొత్తేమి కాదు. ఆ మధ్య స్కై ఫోర్స్ కు కార్పొరేట్ బుకింగ్స్ చేశారనే కామెంట్స్ జోరుగా వినిపించాయి. రోజుల తరబడి చేసినా అది బ్లాక్ బస్టర్ కాలేకపోవడం వేరే స్టోరీ.
వన్ ప్లస్ వన్, కేవలం వంద రూపాయల మల్టీప్లెక్స్ టికెట్, నేషనల్ సినిమా డే ఇలా రకరకాల పేర్లతో పబ్లిక్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం నార్త్ లో సర్వ సాధారణం అయిపోయింది. ఇంత చేసినా థియేటర్లు కిక్కిరిసిపోవడం లేదు. చావా, స్త్రీ 2, యానిమల్ లాగా యునానిమస్ టాక్ వస్తే ఏ ఇబ్బంది లేదు కానీ యావరేజ్ అన్నా సరే టికెట్లు తెగడం మహా కష్టంగా మారిపోయింది. మన సౌత్ లోనూ చిన్న సినిమాలకు ఇలాంటి స్ట్రాటజీలు ప్రయత్నించాలి. పెద్ద వాటికి అవసరం లేదు కానీ హైప్ లేని చిత్రాలకు ఆఫర్లు ఇవ్వడం ద్వారా అంతో ఇంతో ఆక్యుపెన్సీని పెంచొచ్చు. ఆ దిశగా ఆలోచిస్తే ఫలితాలు అందుకోవచ్చు.
This post was last modified on March 28, 2025 10:22 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…