అంతా సిద్దమనుకుని ఇంకాసేపట్లో షోలు పడతాయన్న టైంలో హఠాత్తుగా విడుదల ఆగిపోతే ఆ నిర్మాతలు పడే నరకం అంతా ఇంతా కాదు. ఇవాళ రిలీజైన వీర ధీర శూర పార్ట్ 2 మార్నింగ్ షోలు క్యాన్సిల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు ఖంగారు పడ్డారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ బి4యు కోర్టులో దాఖలు చేసిన కేసు వల్ల చివరి నిమిషంలో ఇలా జరగడంతో ఉదయం, మధ్యాన్నం టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు రీ ఫండ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏడు కోట్లు చెల్లిస్తేనే మార్గం సుగమం అవుతుందని ముంబై న్యాయస్థానం చెప్పడంతో వ్యవహారం తేలదేమో అనుకున్నారు. ఎట్టకేలకు శుభం కార్డు పడింది.
మధ్యాన్నం నాలుగు గంటల నుంచి క్రమంగా షోలు మొదలయ్యాయి. దీని వల్ల ఓపెనింగ్స్ బాగా దెబ్బ తిన్నాయి. ఆలస్యంగా అప్డేట్ రావడంతో అప్పటికప్పుడు థియేటర్లు బుకింగ్స్ ని ఆన్ లైన్ లో అప్డేట్ చేసినప్పటికి సడన్ ప్లానింగ్ చేసుకోలేక డ్రాప్ అయిపోయిన ప్రేక్షకులు వేలు, లక్షల్లో ఉంటారు. ఉదయం విషయం తెలిసిన వెంటనే హీరో విక్రమ్, ఎస్జె సూర్యలు తమ పారితోషికం తగ్గించుకుని మరీ సహకరించేందుకు ముందుకు వచ్చారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో రేపో ఎల్లుండో ఏదైనా ప్రెస్ మీట్ పెడితే తప్ప స్పష్టత రాదు. ఏదైతేనేం సాయంత్రం, నైట్ షోలు జరిగిపోయాయి.
ఇలాంటి ఉదంతాలు కొత్త కాదు. తమిళంలోనే కాదు టాలీవుడ్ లోనూ జరిగాయి. దీనికి ఎవరు భాద్యులు అనే ప్రశ్న కన్నా ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలనే దాని మీద ప్రొడ్యూసర్లు దృష్టి పెట్టాలి. అసలే ఈ రోజు ఎల్2 ఎంపురాన్ తో పోటీ వల్ల వీరధీరశూరకు ఓపెనింగ్స్ పరంగా దెబ్బ పడింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇలాంటి పరిణామాల వల్ల నిర్మాత నుంచి బయ్యర్ల దాకా అందరూ నష్టపోతారు. షేర్లు పోతాయి. పోటీదారులు లాభపడతారు. మరి టాక్ పాజిటివ్ గా వస్తే ఈ వీరధీరశూర హమ్మయ్య అనుకోవచ్చు. అదేంటో రాత్రిలోగా తెలిసిపోతుంది. చూడాలి ఏ తీర్పు వస్తుందో.
This post was last modified on March 27, 2025 8:15 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…