కోర్ట్.. ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన సినిమా. ఇందులో చెప్పుకోదగ్గ స్టార్ లేడు. కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు. అతణ్నేమీ ఇందులో హీరోలా చూపించలేదు. ఒక టీనేజీ జంట చుట్టూ తిరిగే సినిమా ఇది. ఎక్కువగా కోర్టు వాదనల చుట్టూ కథ నడుస్తుంది. ఇలాంటి సినిమాలు తెలుగులో ఆడిన దాఖలాలు తక్కువ. ఐతేనేం పకడ్బందీ కథాకథనాలతో ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. రిలీజ్కు ముందే పెయిడ్ ప్రిమియర్స్ నుంచి మంచి టాక్ రావడంతో సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి వీకెండ్లో అంచనాలను మించి వసూళ్లు రాబట్టిన ‘కోర్ట్’.. ఆ తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది.
తాజాగా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఓవరాల్ వసూళ్లు రూ.50 కోట్లను దాటడం ఒకెత్తయితే.. యుఎస్లో ఈ మూవీ మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం మరో ఎత్తు. అక్కడ కాన్సెప్ట్ ఓరియెంటెడ్, క్లాస్ సినిమాలు మంచి వసూళ్లే సాధిస్తుంటాయి. కానీ ఇటీవల యుఎస్ బాక్సాఫీస్ బాగా డల్ అయింది. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక పెట్టిన ఆంక్షలతో వేలాదిమంది తెలుగు వాళ్లు ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉద్యోగాలు పోయిన వాళ్లు కొందరైతే.. పార్ట్ టైం ఉద్యోగాలకు దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డవాళ్లు ఇంకొంతమంది.
ఈ ప్రభావం యుఎస్లో రిలీజయ్యే తెలుగు చిత్రాల మీద పడింది. వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో కొన్ని చిన్న సినిమాలను అక్కడ రిలీజ్ చేయడమే ఆపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘కోర్ట్’ లాంటి చిన్న చిత్రం మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం అంటే అనూహ్యమే. కంటెంట్ ఉన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడుతుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ.
This post was last modified on March 26, 2025 3:23 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…