Movie News

ట్విస్ట్ : ప్రీమియం లొకేషన్లకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు

రాబిన్ హుడ్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ బయటికి వచ్చాక దాని మీద పెద్ద చర్చే జరిగింది. నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరో నటించిన సినిమాకు అసలు హైక్ ఎందుకనే కోణంలో నెటిజెన్లు డిస్కషన్ పెట్టారు. అందులోనూ ఇది వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్యాన్ ఇండియా మూవీ కానప్పుడు ప్రత్యేక వెసులుబాటు ఎందుకనేది అందరి మదిలో మెదిలిన ప్రశ్న. బడ్జెట్ కొంచెం ఎక్కువ అయ్యుండొచ్చు. హిట్ అయితే ఎలాగూ అంతకంతా వెనక్కు వస్తుంది కాబట్టి సాధారణ రేట్లతో వినోదాన్ని అందివొచ్చు కదానే కోణంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

దీనికి మైత్రి నిర్మాతలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం ప్రీమియం లొకేషన్లకు మాత్రమే పెంపు ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణ రేట్లే అందుబాటులో ఉంటాయని అఫీషియల్ ట్వీట్ పెట్టింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రీమియం ఊళ్లు అంటే నగరాలా లేక జిల్లా కేంద్రాలా లేక భారీ జనాభా ఉండే పెద్ద పట్టణాలా. ఈ పాయింట్ మీద క్లారిటీ లేదు. అలా అనుకుంటే విజయవాడ, వైజాగ్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు లాంటి కేంద్రాలను ఈ క్యాటగిరీకి తెస్తారేమో. అయినా సరే ఇక్కడ కూడా సామాన్య ప్రేక్షకులు ఉంటారుగా. మరి వాళ్ళ సంగతేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఏదైతేనేం మొత్తానికి రాబిన్ హుడ్ టీమ్ ఎక్కువ చోట్ల హైక్ ఉండదనే మాట చెప్పడం సంతోషం. ఇంకా చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. ఈ ఇష్యూ వల్లే కొంత ఆలస్యం అయ్యిందని సమాచారం. ఇప్పుడు తీరిపోయింది కాబట్టి మొత్తం ఆన్ లైన్ అమ్మకాలు ఓపెనయ్యాక ఏవి ప్రీమియం సెంటర్స్ అనేది బయటికి వస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ మీద మంచి అంచనాలున్నాయి. అన్నట్టు మ్యాడ్ స్క్వేర్ కూడా రాబిన్ హుడ్ తరహాలో టికెట్ పెంపు మోడల్ ఎంచుకుందనే టాక్ వచ్చింది కానీ ఇప్పటికైతే జిఓ, అధికారిక సమాచారం లాంటివి లేవు. సో వెయిటింగ్ తప్పదు.

Kumar

Recent Posts

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

2 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

3 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

5 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

6 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

7 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

8 hours ago