Movie News

ట్విస్ట్ : ప్రీమియం లొకేషన్లకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు

రాబిన్ హుడ్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ బయటికి వచ్చాక దాని మీద పెద్ద చర్చే జరిగింది. నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరో నటించిన సినిమాకు అసలు హైక్ ఎందుకనే కోణంలో నెటిజెన్లు డిస్కషన్ పెట్టారు. అందులోనూ ఇది వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్యాన్ ఇండియా మూవీ కానప్పుడు ప్రత్యేక వెసులుబాటు ఎందుకనేది అందరి మదిలో మెదిలిన ప్రశ్న. బడ్జెట్ కొంచెం ఎక్కువ అయ్యుండొచ్చు. హిట్ అయితే ఎలాగూ అంతకంతా వెనక్కు వస్తుంది కాబట్టి సాధారణ రేట్లతో వినోదాన్ని అందివొచ్చు కదానే కోణంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

దీనికి మైత్రి నిర్మాతలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం ప్రీమియం లొకేషన్లకు మాత్రమే పెంపు ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణ రేట్లే అందుబాటులో ఉంటాయని అఫీషియల్ ట్వీట్ పెట్టింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రీమియం ఊళ్లు అంటే నగరాలా లేక జిల్లా కేంద్రాలా లేక భారీ జనాభా ఉండే పెద్ద పట్టణాలా. ఈ పాయింట్ మీద క్లారిటీ లేదు. అలా అనుకుంటే విజయవాడ, వైజాగ్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు లాంటి కేంద్రాలను ఈ క్యాటగిరీకి తెస్తారేమో. అయినా సరే ఇక్కడ కూడా సామాన్య ప్రేక్షకులు ఉంటారుగా. మరి వాళ్ళ సంగతేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఏదైతేనేం మొత్తానికి రాబిన్ హుడ్ టీమ్ ఎక్కువ చోట్ల హైక్ ఉండదనే మాట చెప్పడం సంతోషం. ఇంకా చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. ఈ ఇష్యూ వల్లే కొంత ఆలస్యం అయ్యిందని సమాచారం. ఇప్పుడు తీరిపోయింది కాబట్టి మొత్తం ఆన్ లైన్ అమ్మకాలు ఓపెనయ్యాక ఏవి ప్రీమియం సెంటర్స్ అనేది బయటికి వస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ మీద మంచి అంచనాలున్నాయి. అన్నట్టు మ్యాడ్ స్క్వేర్ కూడా రాబిన్ హుడ్ తరహాలో టికెట్ పెంపు మోడల్ ఎంచుకుందనే టాక్ వచ్చింది కానీ ఇప్పటికైతే జిఓ, అధికారిక సమాచారం లాంటివి లేవు. సో వెయిటింగ్ తప్పదు.

Kumar

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

21 minutes ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

53 minutes ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

59 minutes ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

1 hour ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

3 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

4 hours ago