రాబిన్ హుడ్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ బయటికి వచ్చాక దాని మీద పెద్ద చర్చే జరిగింది. నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరో నటించిన సినిమాకు అసలు హైక్ ఎందుకనే కోణంలో నెటిజెన్లు డిస్కషన్ పెట్టారు. అందులోనూ ఇది వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్యాన్ ఇండియా మూవీ కానప్పుడు ప్రత్యేక వెసులుబాటు ఎందుకనేది అందరి మదిలో మెదిలిన ప్రశ్న. బడ్జెట్ కొంచెం ఎక్కువ అయ్యుండొచ్చు. హిట్ అయితే ఎలాగూ అంతకంతా వెనక్కు వస్తుంది కాబట్టి సాధారణ రేట్లతో వినోదాన్ని అందివొచ్చు కదానే కోణంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీనికి మైత్రి నిర్మాతలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం ప్రీమియం లొకేషన్లకు మాత్రమే పెంపు ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణ రేట్లే అందుబాటులో ఉంటాయని అఫీషియల్ ట్వీట్ పెట్టింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రీమియం ఊళ్లు అంటే నగరాలా లేక జిల్లా కేంద్రాలా లేక భారీ జనాభా ఉండే పెద్ద పట్టణాలా. ఈ పాయింట్ మీద క్లారిటీ లేదు. అలా అనుకుంటే విజయవాడ, వైజాగ్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు లాంటి కేంద్రాలను ఈ క్యాటగిరీకి తెస్తారేమో. అయినా సరే ఇక్కడ కూడా సామాన్య ప్రేక్షకులు ఉంటారుగా. మరి వాళ్ళ సంగతేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఏదైతేనేం మొత్తానికి రాబిన్ హుడ్ టీమ్ ఎక్కువ చోట్ల హైక్ ఉండదనే మాట చెప్పడం సంతోషం. ఇంకా చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. ఈ ఇష్యూ వల్లే కొంత ఆలస్యం అయ్యిందని సమాచారం. ఇప్పుడు తీరిపోయింది కాబట్టి మొత్తం ఆన్ లైన్ అమ్మకాలు ఓపెనయ్యాక ఏవి ప్రీమియం సెంటర్స్ అనేది బయటికి వస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ మీద మంచి అంచనాలున్నాయి. అన్నట్టు మ్యాడ్ స్క్వేర్ కూడా రాబిన్ హుడ్ తరహాలో టికెట్ పెంపు మోడల్ ఎంచుకుందనే టాక్ వచ్చింది కానీ ఇప్పటికైతే జిఓ, అధికారిక సమాచారం లాంటివి లేవు. సో వెయిటింగ్ తప్పదు.
This post was last modified on March 25, 2025 4:19 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…