Movie News

లూసిఫర్ వెనుక 13 సంవత్సరాల విషాదం

ఈ వారం విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ మొదటి భాగం లూసిఫర్ ని తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో భారీగానే చూశారు. చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ ని ఇష్టపడే టాలీవుడ్ ఆడియన్స్ ఎందరో. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ వెనుక చాలా పెద్ద కథే ఉందండోయ్. ప్రమోషన్ల సందర్భంగా అది బయటికి వచ్చింది. అదేంటో చూద్దాం. 2012లో రాజేష్ పిళ్ళై అనే దర్శకుడు లూసిఫర్ పేరుతో ఒక కథ రాసుకుని మోహన్ లాల్ కి వినిపించారు. రచయిత మురళి గోపితో కలిసి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. టైటిల్ రిజిస్టర్ చేసి ప్రాజెక్టుని మీడియా ముందు అనౌన్స్ చేశారు.

అప్పటికే కుంచకో బోబన్ తో మోటార్ సైకిల్ డైరీస్ తీస్తున్న రాజేష్ పిళ్ళై అది పూర్తి చేసేందుకు సమయం అవసరం కావడంతో దాంట్లో బిజీ అయిపోయారు. అదయ్యాక కూడా లూసిఫర్ కార్యరూపం దాల్చలేదు. అటుపక్క గోపి మురళి రైటర్ గా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. కట్ చేస్తే 2016లో రాజేష్ పిళ్ళై అనారోగ్యంతో చనిపోయారు. అలా లూసిఫర్ ఆగిపోయింది. కొంత కాలం తర్వాత టైటిల్ మాత్రమే తీసుకుని పూర్తిగా వేరే కథని తయారు చేశారు గోపి మురళి. వినగానే మోహన్ లాల్ కు నచ్చేసింది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయం చేద్దామని స్వంత బ్యానర్ మీద నిర్మించేందుకు రెడీ అయ్యారు.

స్క్రిప్ట్ పనుల కోసం కోచిలో ఒక ఫ్లాట్ కొన్న పృథ్విరాజ్ వర్క్ మొత్తం అక్కడే చేయించి 2018లో లూసిఫర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. తర్వాత ఏడాదికి రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంది. 30 కోట్లతో తీస్తే వంద కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపించింది. అయితే చనిపోయిన రాజేష్ పిళ్ళై అనుకున్న లూసిఫర్ కథ వేరని, కేవలం పేరు మాత్రమే తీసుకుని స్వంతంగా స్టోరీ సిద్ధం చేసుకున్నామని గోపి మురళి, పృథ్విరాజ్ వెర్షన్. ఏది ఏమైనా మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో సినిమా తీయాలని కలలు కన్న దర్శకుడు హఠాన్మరణం చెందడం, అది వేరొకరి చేతికి వెళ్లి చరిత్ర సృష్టించడం విధి లిఖితం. సినిమాని మించిన డ్రామా అంటే ఇదేనేమో.

Kumar

Recent Posts

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

46 minutes ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

2 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

2 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

3 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

3 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

5 hours ago