ఈ వారం విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ మొదటి భాగం లూసిఫర్ ని తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో భారీగానే చూశారు. చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ ని ఇష్టపడే టాలీవుడ్ ఆడియన్స్ ఎందరో. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ వెనుక చాలా పెద్ద కథే ఉందండోయ్. ప్రమోషన్ల సందర్భంగా అది బయటికి వచ్చింది. అదేంటో చూద్దాం. 2012లో రాజేష్ పిళ్ళై అనే దర్శకుడు లూసిఫర్ పేరుతో ఒక కథ రాసుకుని మోహన్ లాల్ కి వినిపించారు. రచయిత మురళి గోపితో కలిసి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. టైటిల్ రిజిస్టర్ చేసి ప్రాజెక్టుని మీడియా ముందు అనౌన్స్ చేశారు.
అప్పటికే కుంచకో బోబన్ తో మోటార్ సైకిల్ డైరీస్ తీస్తున్న రాజేష్ పిళ్ళై అది పూర్తి చేసేందుకు సమయం అవసరం కావడంతో దాంట్లో బిజీ అయిపోయారు. అదయ్యాక కూడా లూసిఫర్ కార్యరూపం దాల్చలేదు. అటుపక్క గోపి మురళి రైటర్ గా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. కట్ చేస్తే 2016లో రాజేష్ పిళ్ళై అనారోగ్యంతో చనిపోయారు. అలా లూసిఫర్ ఆగిపోయింది. కొంత కాలం తర్వాత టైటిల్ మాత్రమే తీసుకుని పూర్తిగా వేరే కథని తయారు చేశారు గోపి మురళి. వినగానే మోహన్ లాల్ కు నచ్చేసింది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయం చేద్దామని స్వంత బ్యానర్ మీద నిర్మించేందుకు రెడీ అయ్యారు.
స్క్రిప్ట్ పనుల కోసం కోచిలో ఒక ఫ్లాట్ కొన్న పృథ్విరాజ్ వర్క్ మొత్తం అక్కడే చేయించి 2018లో లూసిఫర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. తర్వాత ఏడాదికి రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంది. 30 కోట్లతో తీస్తే వంద కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపించింది. అయితే చనిపోయిన రాజేష్ పిళ్ళై అనుకున్న లూసిఫర్ కథ వేరని, కేవలం పేరు మాత్రమే తీసుకుని స్వంతంగా స్టోరీ సిద్ధం చేసుకున్నామని గోపి మురళి, పృథ్విరాజ్ వెర్షన్. ఏది ఏమైనా మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో సినిమా తీయాలని కలలు కన్న దర్శకుడు హఠాన్మరణం చెందడం, అది వేరొకరి చేతికి వెళ్లి చరిత్ర సృష్టించడం విధి లిఖితం. సినిమాని మించిన డ్రామా అంటే ఇదేనేమో.
This post was last modified on March 24, 2025 5:37 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…