Movie News

లూసిఫర్ వెనుక 13 సంవత్సరాల విషాదం

ఈ వారం విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ మొదటి భాగం లూసిఫర్ ని తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో భారీగానే చూశారు. చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ ని ఇష్టపడే టాలీవుడ్ ఆడియన్స్ ఎందరో. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ వెనుక చాలా పెద్ద కథే ఉందండోయ్. ప్రమోషన్ల సందర్భంగా అది బయటికి వచ్చింది. అదేంటో చూద్దాం. 2012లో రాజేష్ పిళ్ళై అనే దర్శకుడు లూసిఫర్ పేరుతో ఒక కథ రాసుకుని మోహన్ లాల్ కి వినిపించారు. రచయిత మురళి గోపితో కలిసి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. టైటిల్ రిజిస్టర్ చేసి ప్రాజెక్టుని మీడియా ముందు అనౌన్స్ చేశారు.

అప్పటికే కుంచకో బోబన్ తో మోటార్ సైకిల్ డైరీస్ తీస్తున్న రాజేష్ పిళ్ళై అది పూర్తి చేసేందుకు సమయం అవసరం కావడంతో దాంట్లో బిజీ అయిపోయారు. అదయ్యాక కూడా లూసిఫర్ కార్యరూపం దాల్చలేదు. అటుపక్క గోపి మురళి రైటర్ గా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. కట్ చేస్తే 2016లో రాజేష్ పిళ్ళై అనారోగ్యంతో చనిపోయారు. అలా లూసిఫర్ ఆగిపోయింది. కొంత కాలం తర్వాత టైటిల్ మాత్రమే తీసుకుని పూర్తిగా వేరే కథని తయారు చేశారు గోపి మురళి. వినగానే మోహన్ లాల్ కు నచ్చేసింది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయం చేద్దామని స్వంత బ్యానర్ మీద నిర్మించేందుకు రెడీ అయ్యారు.

స్క్రిప్ట్ పనుల కోసం కోచిలో ఒక ఫ్లాట్ కొన్న పృథ్విరాజ్ వర్క్ మొత్తం అక్కడే చేయించి 2018లో లూసిఫర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. తర్వాత ఏడాదికి రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంది. 30 కోట్లతో తీస్తే వంద కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపించింది. అయితే చనిపోయిన రాజేష్ పిళ్ళై అనుకున్న లూసిఫర్ కథ వేరని, కేవలం పేరు మాత్రమే తీసుకుని స్వంతంగా స్టోరీ సిద్ధం చేసుకున్నామని గోపి మురళి, పృథ్విరాజ్ వెర్షన్. ఏది ఏమైనా మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో సినిమా తీయాలని కలలు కన్న దర్శకుడు హఠాన్మరణం చెందడం, అది వేరొకరి చేతికి వెళ్లి చరిత్ర సృష్టించడం విధి లిఖితం. సినిమాని మించిన డ్రామా అంటే ఇదేనేమో.

This post was last modified on March 24, 2025 5:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

37 minutes ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

1 hour ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

3 hours ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

3 hours ago

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

6 hours ago

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

7 hours ago